WGL: పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలోని చెరువు తూములు పాడైపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో చెరువు కట్టపై రోడ్డు నిర్మాణ పనుల సమయంలో రెండు తూములు పూడుకుపోయాయని, ఆ తర్వాత మరమ్మతులు చేయకపోవడంతో సాగునీరు అందకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. వెంటనే కాంట్రాక్టర్ తూములను బాగు చేయాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం భూదాన్ భూములు విషయంలో మంత్రి తుమ్మల వ్యాఖ్యలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఖమ్మంలో మాట్లాడుతూ.. పేదల ఇళ్ల కూల్చివేతకి జిల్లాకి చెందిన ముగ్గురు మంత్రులే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. భూదాన్ భూముల్లోనే పేదలకు ఇల్లు కట్టించాలని పేర్కొన్నారు.
CTR: కడపలో వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం రాయలసీమ లిఫ్ట్ పూర్తి కోసం- భవిష్యత్తు కార్యాచరణ కార్యక్రమంలో పుంగనూరు ఎమ్మెల్యే పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు రాయలసీమకు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. చంద్రబాబు చర్యల వల్ల సీమకు తీరని నష్టం జరుగుతోందని ఆరోపించారు.
AKP: ఎస్ రాయవరం మండలంలో రూ.2,54,99,134 వసూళ్లు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1,26,46,557 వసూళ్లు చేసినట్లు డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ ఆదివారం తెలిపారు. దార్లపూడి, చినగుమ్ములూరు, తిమ్మాపురం, కొరుప్రోలు గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రజలు చెల్లించే ఇంటి పన్నులు ద్వారా కనీస సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు.
KNR: శంకరపట్నం మండలంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి హైస్కూల్ వరకు రహదారి విస్తరణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉపసర్పంచ్ ఆకు బత్తిని విజయకుమార్ ఆధ్వర్యంలో యజమానుల అనుమతితో రోడ్డుకు అడ్డంగా ఉన్న పాత ఇళ్ల గోడలను తొలగిస్తున్నారు. ఈ పనుల వల్ల రాకపోకలు సులభతరం అవుతాయని స్థానికులు తెలిపారు.
WNP: ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆత్మకూరు మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ నాగమణి, వైస్ ఛైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, కౌన్సిలర్లకు పెద్దమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కమిటీ ఛైర్మన్ ఎం. శ్రీధర్ గౌడ్ శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి, మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ADB: అంబేద్కర్ అభయ హస్తం, చేవెళ్ల డిక్లరేషన్ హామీని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మహేందర్ అన్నారు. ఈనెల 18న వరంగల్లో నిర్వహించనున్న దళిత మహాసభ కరపత్రాలను ఆదివారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. మహాసభను విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ ఉద్య మకారులకు స్థలం కేటాయించాలన్నారు.
GNTR: తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దొండపాడు శివారులో పిచ్చుకులపాలెం వద్ద జరగనున్న ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ భవన నిర్మాణ శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొంటారు.
GNTR: తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దొండపాడు శివారులో పిచ్చుకులపాలెం వద్ద జరగనున్న ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ భవన నిర్మాణ శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొంటారు.
JN: నూతనంగా విజయం సాధించిన సర్పంచ్, వార్డు మెంబర్లు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ అన్నారు. నర్మెట్ట మండలంలో నూతనంగా ఎన్నికైన GP పాలకవర్గ సభ్యులను హుస్సేన్ నాయక్ సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని అన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. ప్రమోషన్స్లో భాగంగా USAలో ఏప్రిల్ మొదటి వారంలో గ్రాండ్ ఈవెంట్ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ సక్సెస్ అయితే ‘పెద్ది’ అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారట. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న విడుదలవుతుంది.
సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఔషధాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఔషధాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
BDK: చర్లలో రూ.10.70 కోట్లతో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఈ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుందని మంత్రి తెలియజేశారు.
ATP: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ముదిగల్లుకు చెందిన అనాథ యువతి ప్రమీద వివాహానికి MLA అమిలినేని సురేంద్ర బాబు ఆర్థిక చేయూతనిచ్చారు. తల్లిదండ్రులు లేని ఆ అమ్మాయి పెళ్లి కోసం ఒక పట్టుచీరతో పాటు రూ.15,000 నగదును అందజేశారు. స్థానిక నాయకులు గౌని శ్రీనివాసులు రెడ్డి, ఊటంకి రామాంజనేయులు సమక్షంలో ఈ సాయాన్ని యువతి పెద్దనాన్న, పెద్దమ్మలకు అప్పగించారు.