తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కైలాసం పర్వతంపై శివపార్వతుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. చంద్రగ్రహణం సందర్భంగా మంగళహారం రాత్రి కనువిందుగా కనిపించాయి. దేవుళ్ల ఎడమ వైపు చంద్రుడు ప్రత్యేక కాంతులతో మెరిసిపోయాడు. పలువురు భక్తులు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారాయి.
CTR: రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో గజరాజుల దాడులు ఆగడం లేదు. ముత్తువాండ్లవూరు సహా పలు గ్రామాల్లో అరటి, కొబ్బరి, మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. మంగళవారం గుడిపాల మండలం పానాటూరు, అనుపు సమీపంలో వరి పంటను తిని, తొక్కి నాశనం చేశాయి. అప్పులు చేసి సాగు చేసిన పంటలు నష్టపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ATP: ఏపీ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కణేకల్లులో బుధవారం నుంచి పప్పుసెనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. క్వింటాలు కనీస మద్దతు ధర రూ.5875 ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని రాయదుర్గం నియోజకవర్గ రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
SKLM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం మండలం కళ్లేపల్లిలో ఉచిత వైద్య శిబిరాన్ని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నారిమణి పర్యవేక్షణలో మంగళవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ శిబిరంలో మహిళలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు చేశారు. మహిళల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన వారికి మందులు అందజేశారు.
సత్యసాయి: హిందూపురానికి చెందిన బి.లక్ష్మీనారాయణకు చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి రమణయ్య తీర్పు ఇచ్చారు. శ్రీనివాసులు నుంచి తీసుకున్న రూ.8 లక్షల అప్పుకు ఇచ్చిన రూ.8.80 లక్షల చెక్కు బ్యాంకులో చెల్లలేదు. బాధితుడు కోర్టును ఆశ్రయించగా.. నిందితుడికి జైలుశిక్ష విధించి రెండు నెలల్లోపు డబ్బు చెల్లించాలని ఆదేశించారు.
TPT: ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే POLYCET–2026 పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన లేదా ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 4 కాగా, ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 28న నిర్వహించనున్నారు.
అన్నమయ్య: గాలివీడు వెలిగల్లు ప్రాజెక్టు నుంచి మాధవరం, గొట్టివీడు, గోరన్ చెరువు గ్రామాలకు కాల్వల ద్వారా సాగునీరు అందించాలని CPI(ML) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. మంగళవారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. బోర్లు వేసినా నీరు పడక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందే వరకు రాజకీయాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
VZM: నెల్లిమర్ల ఎస్సై గణేష్ ఆద్వర్యంలో మంగళవారం స్దానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా చట్టాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికారులు సూచనలు మేరకు మహిళకు ప్రభుత్వం కల్పించిన హక్కులు చట్టాలపై అవగాహన కల్పించామని తెలిపారు. మహిళలు ఆపద సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని కోరారు.
AKP: టమాటాకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కంబాల జోగులు డిమాండ్ చేశారు. మంగళవారం నక్కపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు. పంటలకు నష్టం జరిగితే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ అమలు కావడం లేదన్నారు.
SRCL: వేములవాడ డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏ శ్రీనివాస్ను సంస్కృత విద్యార్థుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించింది. రాజన్న సన్నిధిలో సేవ చేసే అవకాశం లభించినందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. సంఘం అధ్యక్షుడు అల్లాడి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీరగోని చైతన్య గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కోనసీమ: మొగలికుదురు గ్రామానికి చెందిన నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పెనుమాల లక్ష్మి మహిళా కీర్తి రత్న పురస్కారం అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో మంగళవారం జరిగిన సమావేశంలో లక్ష్మికి ఈ పురస్కారం అందించారు. శ్రీశ్రీ అంతర్జాతీయ కళా వేదిక ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కీర్తి రత్న పురస్కారాన్ని లక్ష్మికి అందించారు.
JGL: హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో జగిత్యాల కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” అమలుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
ప్రకాశం: కొండపిలో విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని అనకర్లపూడి రోడ్లో సైడ్ కాలువలు నిర్మాణం జరుగుతున్నందున బుధవారం నుంచి శుక్రవారం వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని డీఈ యుగంధర్ తెలిపారు. ఈ మూడు రోజులు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడున్నర వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, విద్యుత్ వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.
NZB: సరదాగా హోలీ చేసుకున్న ఆ యువకుల ఆనందం మంజీరా నదిలో ఆవిరైపోయింది. బోధన్లో ఆచన్పల్లి కాలనీకి చెందిన రోని చౌదరి(18), సాయికుమార్(20) తమ స్నేహితులతో కలిసి స్నానానికి సాలూర వద్ద నదిలోకి దిగారు. లోతైన ప్రాంతానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. స్థానికులు వచ్చేలోపే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
PDPL: యువత సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని డీసీపీ రామ్ రెడ్డి సూచించారు. మంగళవారం పాలకుర్తి మండలం బాంమ్లా నాయక్ తండాలో గ్రామస్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, తల్లిదండ్రుల మార్గంలో నడవాలని చెప్పారు. వివిధ రంగాల్లో ప్రత్యేకత సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీధర్, సర్పంచ్ అఖిల పాల్గొన్నారు.