KMR: బాన్సువాడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్ పర్సన్ కాసుల విజయ, ఆసుపత్రి సమన్వయకర్త డా. విజయభాస్కర్తో కలిసి ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంగలల వరకు 14 ఏళ్లు బాలికలకు HPV వ్యాక్సినేషన్ అందించనున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
SRPT: సూర్యాపేట పట్టణంలోని ప్రముఖ వివాహ షాపింగ్ మాల్లో ఆదివారం సినీ తార నిధి అగర్వాల్ సందడి చేశారు. ఆమె మాల్ను సందర్శించడంతో అభిమానులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో చేరి ఆమెను చూడడానికి ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా మాల్ నిర్వాహకులు నిధి అగర్వాల్కు స్వాగతం పలికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతూ ఆమె కొంత సమయం గడిపారు.
NZB: గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నిరోధం కోసం ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్.పి.వి వ్యాక్సిన్ను 14-15 సంవత్సరాల మధ్య వయసు కలిగిన బాలికలు అందరికీ తప్పనిసరిగా ఇప్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తల్లిదండ్రులకు సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం హెచ్.పి.వి వ్యాక్సిన్ ప్రారంభించారు.
SRPT: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్త చర్యగా అందించే HPV టీకాలను చేసుకోవాలని సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ అన్నారు. ఆదివారం తుంగతుర్తిలోని ఏరియా హాస్పిటల్లో టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 14 నుంచి 15 సంవత్సరాల ఆడపిల్లలకు విధిగా ఈ టీకాలను వేయించాలన్నారు.
విజయనగరం జిల్లాకు చెందిన వెంపడపు గణేష్, బొబ్బిలి(మం) పారాది గ్రామానికి చెందిన అల్లాడ వెంకట రమణ వారి కుటుంబలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరికి జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ జిల్లా కార్యాలయంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి పార్టలో చేరామని తెలిపారు.
నెల్లూరు రూరల్ ములుమూడి గ్రామంలో రూ.42.50 లక్షలతో ములుమూడి కలుజు మీద బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు లేని వేళ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య: తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం బాపనవారిపల్లిలో ఆదివారం ఉదయం భార్యాభర్తలపై దాడి జరిగింది. నరసింహులు, మమత దంపతులు సర్వే నంబర్ 357లో ఇల్లు నిర్మాణానికి గుంట తీయిస్తుండగా నజీర్ కుటుంబసభ్యులు వచ్చి వాగ్వాదానికి దిగినట్లు బాధితులు తెలిపారు. అనంతరం దాడి చేసి గాయపరిచినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపైబ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
సత్యసాయి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూనే కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, 50 ఏళ్లకే పింఛన్ వంటి పథకాల్లో మహిళలకు వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డారని ఆరోపించారు.
NRPT: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేది ప్రతి ఒక్కరి బాధ్యత అని మంది పల్లి సర్పంచ్ సురేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా 99 ప్రజా రోజుల ప్రణాళికలో భాగంగా ధన్వాడ మండల కేంద్రంగలో పరిశుభ్రత, తాగునీరు, డ్రైనేజీ శుభ్రపరిచే వంటి అంశాలపై పంచాయతీ కార్యదర్శి జ్యోతి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్, రామకృష్ణారెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
RR: ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డిని శంకర్పల్లి మాజీ సర్పంచ్ బేసోల్లా శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొకె అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ పట్టిష్టతకు కృషి చేయాలని శ్రీధర్కు ఎమ్మెల్యే సూచించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంయుక్త నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ది బ్లాక్ గోల్డ్’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదలైంది. ఈ మూవీలో సంయుక్త ఫియర్ లెస్, పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ పోస్టర్కి ‘ఆయుధాల కంటే న్యాయాన్ని నమ్మే మహిళ’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇక, యోగేష్ KMC తెరకెక్కిస్తున్న ఈ మూవీకి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.
ASR: అరకులోయలో వెలుగు వ్యవస్థ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సృష్టికర్తలు మహిళలను ఆర్టీసీ ప్రాంతీయ జోన్ ఛైర్మన్ దొన్నుదొర దేవతలతో పోల్చి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా విద్యతో ఇంటితో పాటు సమాజానికి మహిళలు వెలుగు ఇస్తారని వేడుకలో పాల్గొన్న మహిళా డాక్టర్, సామాజికవేత్తలు, అధికారులు, నాయకులు పేర్కొన్నారు.
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఎస్ఆర్ షాపింగ్ మాల్ను సినీనటి మీనాక్షి చౌదరి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మాల్ పట్టణ ప్రజలకు మంచి షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభిమానులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు.
AP: రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలనే మూడు పార్టీలు కలిశాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు ఇచ్చిన నాయకుడు NTR అని తెలిపారు. ‘మహిళా యూనివర్సిటీ తెచ్చిన ఘనత NTRదే. మహిళలు బాగా చదువుకోవాలని ప్రత్యేక యూనివర్సిటీ తెచ్చారు. మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చారు. ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ సంపాదిస్తున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
KRNL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళా పోలీసులకు ప్రశంసా పత్రాలు ఇవాళ అందజేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ASP హుస్సేన్ పీరా పాల్గొని మహిళా పోలీసులను అభినందించారు. మహిళా పోలీసులు సమాజ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.