• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంటర్ పరీక్షలకు 197 మంది విద్యార్థులు హాజరు

NRPT: మరికల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 204 మంది విద్యార్థులకు గాను 197 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 7 మంది విద్యార్థులు పరీక్షకు గైహాజరైనట్టు ప్రిన్సిపల్ నాగమణి మాల తెలిపారు. పరీక్షల సందర్భంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు.

February 25, 2026 / 12:38 PM IST

సర్వేలను వేగవంతం చేయాలి: ఎంపీడీవో

బాపట్ల: కర్లపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో జరుగుతున్న సర్వేలను వేగవంతం చేయాలని ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు ఆదేశించారు. ఆయన చింతాయపాలెం, కర్లపాలెం పంచాయతీల్లో బుధవారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేల తీరును పరిశీలించారు. సర్వేల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా పంచాయతీ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.

February 25, 2026 / 12:37 PM IST

రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ లైన్‌మెన్ మృతి

PLD: నకరికల్లు మండలం అడ్డరోడ్డు వారిగూడెం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజారావు అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. గుండుపల్లి గ్రామంలో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న ఆయన, విధులకు వెళ్తుండగా బైక్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. రాజారావు మరణవార్తతో నకరికల్లు విద్యుత్ శాఖలో మరియు ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది.

February 25, 2026 / 12:36 PM IST

ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన ప్రదీప్!

దర్శకుడిగా, హీరోగా సత్తా చాటిన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. తాజాగా ఆయన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసినట్లు సమాచారం. తన బ్యానర్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాను రూపొందించనున్నాడట. ఇందులో నటి మమితా బైజు ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

February 25, 2026 / 12:36 PM IST

‘విద్యార్థుల కోసం ఎక్కడైనా బస్సు నిలపాలి’

KMR: ఇంటర్, పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కామారెడ్డి, బాన్సువాడ డిపోల పరిధిలో విద్యార్థులు చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆపాలని డిపో మేనేజర్లు డ్రైవర్లను ఆదేశించారు. మార్చి 16 వరకు ఇంటర్, ఏప్రిల్ 7 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఈ వెసులుబాటు కల్పించారు.

February 25, 2026 / 12:35 PM IST

‘ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి’

PPM: పార్వతీపురం మన్యం జిల్లాను విశాఖ ఎకనామిక్ కారిడార్‌లో కలపడం అత్యంత ఆనందదాయకమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర హర్షం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. పార్వతీపురంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతుల అభివృద్ధికి దోహదపడాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. పార్వతీపురంలో వ్యవసాయ ఉత్పత్తులకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు.

February 25, 2026 / 12:35 PM IST

గ్రీన్ టీతో బెల్లీ ఫ్యాట్‌ తగ్గుతుందా?

గ్రీన్ టీ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే కాటెచిన్స్, కెఫీన్ మెటబాలిజంను వేగవంతం చేసి, కొవ్వును కరిగించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, కేవలం గ్రీన్ టీ తాగడం వల్ల మాత్రమే బరువు తగ్గరు. దీంతో పాటు సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

February 25, 2026 / 12:34 PM IST

MCA మొదటి సెమిస్టర్ పరీక్షలు రీషెడ్యూల్

WGL: కాకతీయ యూనివర్సిటీలో వాయిదా పడిన MCA మొదటి సెమిస్టర్ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ వెల్లడించారు. మొదటి పేపర్ మార్చి 6న, రెండవ పేపర్ మార్చి 9న, మూడవ పేపర్ మార్చి 11న, నాలుగవ పేపర్ మార్చి 13న, ఐదవ పేపర్ మార్చి 17న నిర్వహించనున్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.

February 25, 2026 / 12:33 PM IST

మహిళా సమైక్య భవనానికి భూమిపూజ

MDK: నర్సాపూర్ ఇన్‌ఛార్జి ఆవుల రాజిరెడ్డి బుధవారం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సికింద్లాపూర్ గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఆయన మహిళల సాధికారత, ఆర్థిక స్వాలంబన కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

February 25, 2026 / 12:33 PM IST

బాసర ఐఐఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

TG: నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీలో విషాదం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న వసంత అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు. విద్యార్థిని బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

February 25, 2026 / 12:33 PM IST

‘వట్టివాగు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి’

BDK: పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం కరకగూడెం మండలం చొప్పాల గ్రామ పరిధిలోని గొడుగుబండ వద్ద వట్టివాగు ప్రాజెక్టును పరిశీలించారు. రైతులకు రెండుపంటలు పండేలా ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని సూపర్వైజర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 25, 2026 / 12:33 PM IST

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం లక్ష్యం: సర్పంచ్

BHPL: గోరికొత్తపల్లి(M) నిజాంపల్లి గ్రామంలోని 1వ వార్డులో బుధవారం గ్రామ సర్పంచ్ సునీత-రవీందర్ ఆధ్వర్యంలో GP కార్మికులు సైడ్ డ్రైనేజీ కాలువలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.

February 25, 2026 / 12:32 PM IST

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద దరఖాస్తులు ఆహ్వానం

MLG: జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ 2025-26 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద అర్హత గల ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి తెలిపారు. అర్హత గల విద్యార్థులు మార్చి 25వ తేదీ లోపు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 25, 2026 / 12:31 PM IST

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

W.G: నరసాపురం మండలం వేములదీవి పడమరలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం .. బుధవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన బొమ్మిడి యేసుబాబు (53) అనే మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే నరసాపురం తహసీల్దార్ ఐవీవీ సత్య నారాయణ, ఆర్‌ఐ సురేఖ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.అతన్ని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 25, 2026 / 12:31 PM IST

‘జిల్లాలో కోర్టు విధులను బహిష్కరిస్తున్నాం’

న్యాయవాది పవన్ కుమార్‌పై దాడి చేసిన సీఐ విక్రమ్ సింహాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. ఈనెల 25 నుంచి 27 వరకు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు హరినాథ్ చౌదరి, వెంకటేశ్వర్లు ప్రకటించారు. జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.

February 25, 2026 / 12:30 PM IST