VKB: కుల్కచర్లలో ఇంటర్మీడియట్ పరీక్షల రెండవ రోజు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల పరిశీలకులు తెలిపారు. రామలింగేశ్వర డిగ్రీ కాలేజీలో 186 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ప్రిన్సిపల్ కామేశ్వరి వెల్లడించారు. వివేకానంద జూనియర్ కాలేజీలో 206 మందికి గాను 199 మంది హాజరు కాగా, 7మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు పేర్కొన్నారు.
CTR: సోమల ఏఎంసీ ఛైర్మన్ శ్రీనివాసులు నాయుడు అమరావతిలో పలువురు మంత్రులను కలిశారు. హోం మంత్రి అనిత, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ను కలిసి మండలంలో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. భూ వివాదాలు, భద్రతా సంబంధిత అంశాలను వారి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. వీటిపై చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు.
మధ్యాహ్న భోజనంలో పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరిచి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. ఎండ వేడి నుంచి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, కాల్షియం శరీరానికి అంది ఎముకలు బలంగా ఉంటాయి. ఇది కడుపు నిండిన భావనను కలిగించి అతిగా తినకుండా చేస్తుంది. అయితే జలుబు లేదా దగ్గు ఉన్నప్పుడు మాత్రం పెరుగుకు దూరంగా ఉండటం మంచిది.
PPM: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణను గురువారం జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఆమె స్థానిక ఆర్.కె.జూనియర్ కళాశాల, పి.ఎస్.ఎం.వాసవి జూనియర్ కళాశాలలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించారు. పరీక్షల సరళిని, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.
ATP: విడపనకల్లు మండలం డొనేకల్ శివారులో గురువారం ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతడిని రాళ్లతో కొట్టి చంపినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: రాయలసీమను రతనాల సీమను చేశామని CM చంద్రబాబు అన్నారు. ’14 వారాలు వెలిగొండకు డెడ్లైన్ పెట్టాం. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులు ఈ టర్మ్లో పూర్తి చేస్తాం. వెలిగొండ ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశా..నేనే పూర్తి చేయబోతున్నా. జూలైలో వెలిగొండ ఫేజ్-1 నుంచి నీళ్లు ఇవ్వబోతున్నాం. 2,500 కోట్ల పనులు పెండింగ్ పెట్టి జాతికి అంకితం అంటూ గత పాలకులు హడావుడి చేశారు’అని అన్నారు.
MDK: హవేలీ ఘనపూర్ మండలం లింగసాన్ పల్లి వద్ద ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డం రావడంతో అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో తిమ్మాయిపల్లికి చెందిన మమత, ఆర్యాన్, పరమేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది ప్రవీణ్ కుమార్, కిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కుటుంబ కలహాలపై నటి హేమ మాలిని ఎట్టకేలకు స్పందించింది. నటుడు ధర్మేంద్ర మరణం తర్వాత సన్నీ డియోల్, బాబీ డియోల్లతో తనకు విభేదాలు తలెత్తాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ఖండించింది. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, తామంతా ఒకే కుటుంబంగా కలిసి ఉన్నామని స్పష్టం చేసింది. ఈ పుకార్లలో నిజం లేదని చెబుతూ వివాదాలకు చెక్ పెట్టింది.
ADB: నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో రెండు నెలల పసికందు మరణానికి కారణమైన శ్రీధర్ రెడ్డి, మధు సుదన్ రెడ్డి అనే నిందితులందరిపై మర్డర్ కేసు నమోదు చేయాలని CPM జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పసిపాపను చంపిన కులోన్మాదులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
BPT: ప్రజారక్షణే లక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రశంసించారు. అసెంబ్లీలో ఏపీలో ‘నో హెల్మెట్–నో ఫ్యూయల్’ అమలు చేయాలని ప్రతిపాదించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ లేక ఇంధనం ఇస్తే ప్రమాదాలు పెరుగుతాయని తెలిపారు.
WNP: ఆత్మకూరు పట్టణంలో గురువారం వాసవి కాలనీలో నూతనంగా నిర్మించిన వాసవి కళ్యాణ మండపాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైశ్య సోదరులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. దాదాపు రూ.2 కోట్లతో నిర్మించిన కళ్యాణ మండపం నిర్మించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
KRNL: విజయవాడలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడును ఆలూరు టీడీపీ ఇంఛార్జి వైకుంఠం జ్యోతి మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సమావేశంలో ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ సంస్థాగత బలోపేతంపై ఇంఛార్జి చర్చించారు. ఈ భేటీ నియోజకవర్గ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించింది.
NZB: జిల్లా సైక్లింగ్ సంఘం నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన భూలోక విజయ్ కాంత్ రావు ఇవాళ మర్యాద పూర్వకంగా జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్ను కలిశారు. DYSO మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సైక్లింగ్ క్రీడ అభివృద్ధి చేయాలని క్రీడ సంస్థ పక్షాన అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ELR: దెందులూరులో గురువారం కలెక్టర్ వెట్రి సెల్వి పర్యటించారు. గ్రామస్తులకు పన్నుల చెల్లింపు ప్రాముఖ్యతపై అవగాహన వివరించడంతో స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చి గ్రామ సచివాలయం సిబ్బంది ద్వారా ఆన్లైన్లో హౌస్ టాక్స్ను చెల్లించారు. ప్రజలు సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ సామజిక బాధ్యతగా పన్నులు చెల్లించాలని వారికి సూచించారు.
BHNG: మోత్కూర్-గుండాల ప్రధాన రహదారిలోని బిక్కేరు వాగుపై నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన సింగిల్ లైన్ బ్రిడ్జితో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ దృష్ట్యా ఈ పాత వంతెనపై తరచూ ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఆర్టీసీ, ప్రైవేటు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు.