• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించిన కలెక్టర్

MNCL: కాసిపేట మండల కేంద్రంలోని KGBV ని కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించి వారి విద్యా సామర్థ్యాన్ని పరీక్షించారు. అనంతరం వంటశాలను పరిశీలించి, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎస్ఓ సరితను ఆదేశించారు. పాఠశాలలో నిర్మాణంలో ఉన్న అదనపు గదుల పనులు పరిశీలించారు.

February 28, 2026 / 08:34 AM IST

రేపే జూలో చిత్రలేఖనం పోటీలు

VSP: ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా రేపు జూలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్లు క్యూరేటర్ జీ.మంగమ్మ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జూ బయోస్కోప్ వద్ద పోటీలు జరుగుతాయి. 1–5, 6–10 తరగతులు, ఇంటర్ నుంచి పీజీ వరకు మూడు విభాగాల్లో విద్యార్థులు పాల్గొనవచ్చు. వివరాలకు 94411 56344 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

February 28, 2026 / 08:33 AM IST

తెనాలి పంట కాలువలో మృతదేహం లభ్యం

GNTR: తెనాలి మండలం కంచర్లపాలెం శివారులోని పంట కాల్వలో సుమారు 50ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు శుక్రవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి,ప్రాథమిక విచారణలో మృతుడు యాచకుడిగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించారు.

February 28, 2026 / 08:32 AM IST

రాహుల్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు

MDK: సహకార శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు జిల్లాలో ఘనంగా వీడ్కోలు పలికారు. శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పలువురు అధికారులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. అదనపు కలెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ వీడ్కోలు సమావేశం నిర్వహించింది. జిల్లాను రోల్ మోడల్‌గా నిలిపేందుకు విశేషంగా కృషి చేశారన్నారు.

February 28, 2026 / 08:32 AM IST

IPOకి భారత్ బయోటెక్

TG: వ్యాక్సిన్లు తయారు చేసే హైదరాబాద్​ కంపెనీ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఐపీఓకి రానుందని, సుమారు రూ.4,200 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోందని సమాచారం. ఐపీఓ చర్చల దశలో ఉందని, సైజ్, టైమింగ్‌‌‌‌‌‌‌‌ మారొచ్చని పేర్కొన్నారు.

February 28, 2026 / 08:30 AM IST

అసెంబ్లీ సిబ్బందితో బాలయ్య ముచ్చట్లు

సత్యసాయి: ఏపీ అసెంబ్లీ కాఫీ సెక్షన్ సిబ్బందితో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సరదాగా గడిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడ పనిచేస్తున్న వారితో కలిసి గ్రూపు ఫోటో దిగి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవిస్తూ, ఎంతో వినయంగా మెలిగే బాలయ్య వ్యక్తిత్వంపై సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 28, 2026 / 08:30 AM IST

‘కార్మికుల అభ్యున్నతి కోసం గడపగడపకు’

PLD: క్రోసూరు:కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీల అభ్యున్నతి కోసం CPI పార్టీ పనిచేస్తుందని నియోజకవర్గ CPI కార్యదర్శి మునుగోటి శ్రీనివాసరావు తెలిపారు. మార్చి ఒకటి నుంచి 15 వరకు మండలంలో గడపగడపకు CPI కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంతో పోరాడి పరిష్కరిస్తామని ఆయన అన్నారు.

February 28, 2026 / 08:30 AM IST

హబ్సిగూడలో పార్క్.. ప్రశాంతతకు మరో పేరు.!

MDCL: ప్రశాంతతకు మరో పేరుగా హబ్సిగూడలోని వీరరాజా రెడ్డి పార్కు నిలుస్తుంది. సుమారుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ ఉద్యానాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఒకేసారి 500 మంది యోగా చేసుకునే వీలుందని, స్థానిక ప్రజలందరూ సాయంత్రం, ఉదయం సమయాల్లో ఈ పార్కులో గడిపి, మానసిక సంతోషాన్ని, యోగ ద్వారా ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరచుకోవాలని అధికారులు సూచించారు.

February 28, 2026 / 08:29 AM IST

భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

WGL: చారిత్రక భద్రకాళి ఆలయంలో ఉత్తరాయణం శుక్లపక్షం సందర్భంగా శనివారం అర్చకుడు శేషు ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యార్చన, షోడశోపచార పూజలు చేసి అమ్మవారిని అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు క్యూలైన్‌లలో వేచి ఉండి దర్శనం చేసుకుంటున్నారు.

February 28, 2026 / 08:27 AM IST

‘బలవంతపు భూసేకరణ నిలిపివేయాలి’

MDK: జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణంలో కోట్ల రూపాయల విలువైన భూమికి 15 లక్షలు చెల్లించి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని రామాయంపేటకు చెందిన బైరం అర్జున్ నరసమ్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు భూమికి బదులు భూమి ఇవ్వాలని, బహిరంగ మార్కెట్ ధరతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

February 28, 2026 / 08:26 AM IST

సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

AKP: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ పప్పల చలపతిరావు అన్నారు. శుక్రవారం ఎలమంచిలి టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజాదర్బార్లో ప్రజలు అందజేసిన అర్జీలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు .

February 28, 2026 / 08:25 AM IST

ఇద్దరు MEOలు సస్పెండ్..!

KDP: ముద్దనూరు MEO-1 అన్నయ్య, కొండాపురం MEO-1 ఓబులేశును సస్పెన్షన్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముద్దనూరు మండలం చింతకుంట ఎంపీపీ స్కూల్లో గతంలో విధులు నిర్వర్తించిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైనా కూడా MEOలు జీతాలు మంజూరు చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో MEOలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

February 28, 2026 / 08:24 AM IST

జేఎన్యూ వీసీ రాజీనామాకు ఎస్ఎఫ్ఎ డిమాండ్

MBMR: ఢిల్లీలోని జేఎన్యూ (JNU)లో విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన దాడిని నిరసిస్తూ పాలమూరు యూనివర్సిటీ ముందు ఎస్ఎఫ్ఎ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా, భరత్ మాట్లాడుతూ.. దాడులకు బాధ్యత వహిస్తూ వీసీ శాంతిశ్రీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

February 28, 2026 / 08:23 AM IST

‘రోడ్డు భద్రత నియమాలు పాటించాలి’

SRCL: రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదలకు దూరంగా ఉండాలని చందుర్తి సీఐ వేంకటేశ్వర్లు అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఆరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహన దారుడు సామాజిక భాధ్యతగా రోడ్డు భద్రత, ట్రాపిక్ నియమాలు పాటించాలన్నారు. మద్యం సేవించి వాహ నాలు నడపకూడదన్నారు.

February 28, 2026 / 08:23 AM IST

ట్రాఫిక్ రూల్స్ కఠినం చేయండి: కలెక్టర్

ELR: జిల్లాలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణమే సవరణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రి‌సెల్వి అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. అవసరమున్న చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం చేయాలన్నారు. రోడ్లపై పశువుల సంచారం విచ్చలవిడిగా ఉంటుందని వివరించారు.

February 28, 2026 / 08:22 AM IST