E.G: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల కోసం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని SP నరసింహ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆదివారం తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి చేరుకోవాలని, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు.
KRNL: ఆదోనిలో సుందరయ్య భవన్ సీపీఎం కార్యాలయం నిర్మాణానికి డీవైఎఫ్ఐ పట్టణ నాయకులు సతీష్ గారి తల్లి గ్రేసమ్మ ఆదివారం రూ.10,111 విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని పార్టీ నాయకులకు ఆమె స్వయంగా అందజేశారు. కార్యాలయ నిర్మాణానికి సహకరించినందుకు సీపీఎం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఇటువంటి సహకారం మరింత ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.
KMM: ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 206 నుంచి రూ. 230 మధ్య ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ. 234 నుంచి రూ. 260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గింది. దీంతో చికెన్ షాప్ దగ్గర వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి.
నటుడు విక్రమ్ ఒకేసారి నాలుగు సినిమాలను ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ‘కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ఒక ప్రిపరేషనే. నేను ఆరాధించే దర్శకులతో, విభిన్నమైన కథలతో మీ ముందుకు వస్తున్నాను’ అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ ఏడాది అంతా కథల ఎంపికపైనే దృష్టి పెట్టానని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపాడు. ఈ అప్డేట్తో సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది.
GDWL: కేంద్రంలోని BJP ప్రభుత్వం పార్లమెంటులో ఏకపాత్రాభినయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. ఆదివారం అలంపూర్ చౌరస్తాలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను కాలరాస్తూ తెచ్చిన లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా మార్చి 1 నుంచి నిర్వహించే ప్రచార క్యాంపెయిన్ ఉంటుందన్నారు.
T20 వరల్డ్ కప్-2026లో భాగంగా ఇవాళ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సా.7 గంటలకు టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 35 టీ20 మ్యాచ్లు ఆడాయి. వీటిలో 21 మ్యాచుల్లో భారత్, 13 మ్యాచుల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించాయి. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, టీమిండియాదే పైచేయి అనిపిస్తుంది.
VKB: కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా కొనసాగుతున్న పరిస్థితిలో నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మైనార్టీ నేత యూసుఫ్, బొంరాస్ పేట్ రాజేష్ రెడ్డి తదితరులకు పదవులు కేటాయించబడినప్పటికీ, యువజన కాంగ్రెస్ నేత కృష్ణంరాజుకు ఇంకా నియమిత పదవీ కోసం వేచిచూస్తున్నారు.
KKD: శంఖవరంలోని ఏపీ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వీర్రాజు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరానికి గానూ ఈనెల 25వ తేదీ నుంచి 31వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
MHBD: కురవి మండలకేంద్రంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పార్వతీ రామలింగేశ్వర (శివాలయం) స్వామి ఆలయం వద్ద దోపోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు.
SRCL: గ్రామపంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను ప్రభుత్వం చెల్లించాలంటూ ఈ నెల 23న కలెక్టరేట్ ఎదుట కార్మికులతో ధర్నా చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి ప్రకటించారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్లోని అమృత్లాల్ శుక్లా కార్మిక భవనంలో శనివారం సీఐటీయూ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.
AKP: సబ్బవరం మండలం తవ్వవానిపాలెంలో ఈ నెల 24న పరదేశిమాంబ పండగను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ స్వామి నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం గోడపత్రిక ఆవిష్కరించారు. పండగ సందర్భంగా ఆదివారం రాష్ట్రస్థాయి మహిళ వాలీబాల్ పోటీలు, 23న చిడతల పోటీలు జరుగుతాయన్నారు. 24న ఎడ్ల బండ్ల పరుగు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
CTR: బంగారుపాళ్యం మండలంలోని పాలేరు, బలిజపల్లి గ్రామాల్లో ఈ రోజు తెల్లవారుజామున పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో సిబ్బంది ట్రబుల్ మాంగర్స్, NDPS అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాలు, ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దని అనుమానితులను కఠినంగా హెచ్చరించారు.
ATP: ఆత్మకూరు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ జగదీష్ శనివారం సాయంకాలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, శాంతి భద్రతల పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల పురోగతిపై సమగ్రంగా ఆరా తీశారు. రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పారదర్శకత పాటించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు.
సత్యసాయి: లేపాక్షి మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన రజిని (19) కనిపించడం లేదని తల్లి నాగమ్మ, తండ్రి ఆదినారాయణలు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. బంధువులు, గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ సమాచారం లభించలేదు. ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే 9676852213 నంబర్కు తెలపాలని కోరారు.