భారత్ పర్యటనలో ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కీలక ఖనిజాలు, భద్రత, వాణిజ్యంపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్ డాలర్లకు మించి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. లాటిన్ అమెరికాలో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా బ్రెజిల్ ఉందని మోదీ పేర్కొన్నారు.
AP: బీజేపీ ఎస్సీ మోర్చా పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ చీఫ్ మాధవ్ హాజరయ్యారు. బీజేపీ ఎస్సీ మోర్చా కార్యక్రమం భిన్నమైందన్నారు. ఎస్సీలను ఓటు బ్యాంక్గా చూసేవారికి బుద్ధి చెప్పాలని సూచించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారని తెలిపారు. అంబేద్కర్ వల్లే ఎస్సీలకు గౌరవం వచ్చిందని పేర్కొన్నారు.
NLR: బోగోలు మండలం కొండ బిట్రగుంట బిలకూట క్షేత్రంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నూతన రథశాల, కళ్యాణ మండపాలను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం ప్రారంభించారు. స్వామివారిని దర్శించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 7 వరకు తిరుమల విధానంలో 11 రోజుల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
HNK: నడికూడ (M) చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్, తెలుగు భాషా ఉపాధ్యాయులు పల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలను అన్నింటిని రక్షించుకోవాలన్నారు. మాతృభాష మృత భాష కాకూడదని అమృత భాష కావాలని కోరారు. ఉపాధ్యాయులు లకావత్ దేవ, రాజకుమార్ ఉన్నారు.
TG: పోలీసులు, ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీ బుక్ కాంగ్రెస్కు చుట్టమైందన్నారు. రైతు బంధు పేరు చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని.. ఇంతవరకు నిధులు విడుదల చేయలేదన్నారు. రైతు బంధు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. సీఎం, వ్యవసాయశాఖ మంత్రి ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు.
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని మహేశ్వరంలో ప్రతి బస్స్ హాల్టింగ్ చేయాలని శనివారం కౌన్సిలర్ మృత్ నాయక్, శిరీష రాజు RTC డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వెళ్లే ప్రజలు బస్సు ఆపకపోవడంతో నర్సంపేటకు రావాల్సి వస్తుందని తెలిపారు. అధికారులు స్పందించి బస్సు హాల్టింగ్ చేయాలని కోరారు.
E.G: తిరుపతి వెంకటేశ్వర స్వామి వారితో వైసీపీ రాజకీయ పరాచకాలు ఆడుతోందని, రాజకీయ ఆయుధంగా వాడుకోవడం దుర్మార్గమని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. శాసనమండలి సమావేశాల్లో వైసీపీ సభ్యులు చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలను ప్రదర్శించడాన్ని తప్పుబట్టారు. వారి తీరు హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు.
అనంతపురం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం సిగ్గుచేటని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌని ప్రతాపరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా శనివారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. భారతజాతి ప్రయోజనాలు కాపాడమంటే పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం దుర్మార్గమన్నారు. నరేంద్ర మోడీని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్టా అని పేర్కొన్నారు.
TG: హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో గత నెల రోజులుగా ఉత్సాహంగా సాగిన ‘పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్’ క్రీడల పండుగ ఇవాళ్టితో ముగిసింది. సికింద్రాబాద్లోని చారిత్రాత్మక జిమ్ఖానా గ్రౌండ్స్లో జరిగిన ఈ ముగింపు వేడుకకు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
KRNL: సి.బెళగల్ మండలంలోని తిమ్మందొడ్డి పరిధిలో ఎస్సై వేణుగోపాలరాజు శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీ నిర్వహించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ను పట్టుకున్నారు. మంత్రాలయం మండలం చట్నిహళ్లి నుంచి ఇసుక తరలిస్తుండగా కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు శనివారం తెలిపారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KDP: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న ఆర్ఐవో వెంకటేశ్వర్లుకు వినతి పత్రం సమర్పించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు, ఫ్యాన్లు, నిరంతర విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు స్వల్ప సడలింపు ఇవ్వాలన్నారు.
TG: బీజేపీ నాయకులు గుండాయిజం చేస్తే చూస్తూ ఊరుకోమని.. కామారెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సందీప్ హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన మహేందర్ రెడ్డితో తమకు సంబంధం లేదన్నారు. మహేందర్ రెడ్డి తమ నియోజకవర్గ నాయకుడు కాదన్నారు. ఎమ్మెల్యే కేవీఆర్ పోలీసులను బెదిరిస్తున్నారన్నారు.
TG: సీఎం రేవంత్ రెడ్డికి BRS నేత బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ‘రాష్ట్రంలో క్షణికావేశంలో గడ్డిమందు తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రాష్ట్రాలు ఈ గడ్డి మందును నిషేధించాయి. తెలంగాణలో కూడా గడ్డిమందు నిషేధంపై ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆత్మహత్యలకు పాల్పడిన మెజార్టీ రైతుల్లో.. గడ్డిమందును వాడిన వారే ఎక్కువ’ అని లేఖలో పేర్కొన్నారు.
పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయ్యింది. టాస్ తర్వాత ప్రారంభమైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో, అంపైర్లు మ్యాచ్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్ను పంచుకున్నాయి. కాగా, రేపు భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.
నక్సలిజం నుంచి దేశం విముక్తి పొందుతున్నట్లే.. చొరబాటుదారులను ఏరివేయడం కూడా సాధ్యమేనని కేంద్రమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా.. రాబోయే ఐదేళ్లలో దేశం నుంచే తొలగిస్తామని చెప్పారు. ‘గతంలో రాహుల్ అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని చెప్పారు కానీ, చేయలేదు. ఎందుకంటే వారే ఆ పార్టీకి ఓటు బ్యాంకు’ అని షా ఆరోపించారు.