KDP: పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారి పల్లెలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజూ మద్యం తాగి వేధిస్తున్న భర్త సిద్ధారెడ్డిపై భార్య సుహాసిని సహనం కోల్పోయి, గొడ్డలితో గొంతునరికి హత్య చేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. CI చల్లని దొర, ఎస్సై తులసి నాగప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నమయ్య: లక్కీరెడ్డిపల్లి మండలం అనంతపురం గంగమ్మ జాతర 3 రోజుల హుండీ లెక్కింపు గురువారం పూర్తయింది. ఈ లెక్కింపు ప్రకారం మొత్తం రూ.17, 96,420 ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని ఆలయ ఖాతాకు జమ చేయనున్నారు. ఆలయ సిబ్బంది, పూజారులు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు ఇచ్చిన సహకారం ఆలయ నిర్వహణకు, పూజా కార్యక్రమాల కోసం ఉపయోగపడనుందని ఆలయ ఈవో శ్రీనివాసులు తెలిపారు.
KRNL: నందవరం SC కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఎంపీడీవో పుల్లయ్య తనిఖీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తోందని, ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని సూచించారు. పాఠశాలలోని స్టాక్ రిజిస్టర్, హోమ్ డెలివరీ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
ASF: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని కలెక్టర్ హరిత అన్నారు. కాగజ్ నగర్ మైనారిటీ సంక్షేమ పాఠశాలలో ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి మండలాల నూతన సర్పంచ్లకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లదే కీలక భూమిక ఉంటుందన్నారు. ప్రభుత్వం చేపట్టే పలు సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు.
1. బాగ్లిహార్ ఆనకట్ట ఏ నదిపై ఉంది?ANS: చీనాబ్2. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?ANS: జనవరి 253. భారత ‘ఎయిర్ఫోర్స్ డే’ ఎప్పుడు నిర్వహిస్తారు?ANS: అక్టోబరు 84. ఈశాన్య భారత సరిహద్దుల్లో తొలి వాణిజ్య బొగ్గు గని ఏది?ANS: నమ్చిక్-నమ్ఫుక్
KNR: చిగురుమామిడి గ్రామంలో వచ్చే వేసవికాలం దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు రూపొందించడానికి గ్రామ సర్పంచ్ ఆకవరం భవాని ఆధ్వర్యంలో ఎంపీవో ఎండీ ఖాజా మొయినుద్దీన్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జ్ఞానేశ్వరిలు గ్రామంలో పర్యటించారు. నీటి ట్యాంకుల రిపేరులు, గేట్ వాల్స్ రిపేర్స్, నూతన పైపులైన్లు వేసి చేతి పంపు మెటీరియల్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు.
JGL: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 43 రోజులకు గాను 14 హుండీలను కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్ రావు పర్యవేక్షణలో శ్రీ లలితా సేవాట్రస్ట్చే గురువారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.1,16,04,438 నగదు, 199 విదేశీ కరెన్సీ లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే వచ్చిన వెండి, బంగారాన్ని ఒక బ్యాగ్లో వేసి సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరిచినట్లు వెల్లడించారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ తాజాగా ‘హే బల్వంత్’ అనే మూవీలో నటించాడు. ఈ మూవీ ఈరోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకు నవీన్ ఒకరోజు రాత్రి తనకు మెసేజ్ చేసినట్లు తెలిపాడు. అందులో ‘నా చైల్డ్ హుడ్ ఎంతో బాగుండేది నాన్న. నీ ప్రేమను మిస్ అవుతున్నా’ అని రాసి ఉందన్నాడు. ఆ మెసేజ్ చూడగానే తాను ఎంతో ఏడ్చినట్లు చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా టీమిండియా సూపర్-8 పోరుకు సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో ఆదివారం తలపడనుంది. ఈ పోరులో ఒక్క మార్పుతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంచనా వేశాడు. అర్ష్దీప్ సింగ్ను బెంచ్కే పరిమితం చేసి.. అతడి స్థానంలో అక్షర్కు అవకాశం ఇవ్వొచ్చని తెలిపాడు. అలాగే, సుందర్ను కొనసాగించే ఛాన్స్ ఉందన్నాడు.
AP: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలకు ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును అధికారులు తొలగించారు. YSR పేరు తొలగించాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు ఇన్ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్కు వినతిపత్రం అందించారు. తాజాగా బుధవారం మరోసారి కోరడంతో ఇన్ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్ YSR పేరును తొలగిస్తూ ఆదేశాలిచ్చారు.
➢1935: ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి జననం➢1946: దివంగత నటి విజయ నిర్మల జననం➢1973: మ్యూజిక్ డైరెక్టర్ టి.వి.రాజు మరణం➢2010: నటుడు, నిర్మాత పద్మనాభం మరణం* ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం* పిచ్చుకల దినోత్సవం* జాతీయ నాయకత్వ దినోత్సవం* అరుణాచల్ ప్రదేశ్, మిజోరం అవతరణ దినోత్సవం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం తదియ: మ.3:33 తదుపరి చవితి ఉత్తరాభాద్ర: రా.9:13 తదుపరి రేవతి వర్జ్యం: ఉ.7:11 నుంచి 8:44 వరకు అమృత ఘడియలు: సా.4:32 నుంచి 6:06 వరకు దుర్ముహూర్తం: ఉ.8:46 నుంచి 9:33 వరకు తిరిగి మ.12:37 నుంచి 1:22 వరకు రాహుకాలం: ఉ.10:30 నుంచి 12:00 వరకు సూర్యోదయం: ఉ.6:29; సూర్యాస్తమయం: సా.5:59.
వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల ‘Y’ క్రోమోజోమ్ను ఎక్కువగా నష్ట పోతున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జబ్బులతోపాటు, తక్కువ ఆయుర్దాయంతో ముడిపడి ఉందట. 60 ఏళ్లు పైబడిన పురుషులలో ‘Y’ క్రోమోజోమ్ లోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆడవారితో పోలిస్తే మగవారిలో మరణాల రేటు ఎక్కువగా ఉండటానికి ఇది ఒక కారణం కావొచ్చని అంచనా వేశారు.
సామెత: ‘ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాడట’ అర్థం: కొంత మంది తను చేయాల్సిన కనీస బాధ్యతలు చేయడం కూడా ఏదో ఘనకార్యం చేసినట్లు చెప్పుకుంటారు. భార్యను పోషించడం భర్త కనీస బాధ్యత. తను, తన సంసారం కాకుండా, లోకానికి ఉపయోగపడేలా ఏదైనా చేస్తే అర్ధం ఉంది. కానీ, తన వాళ్ళకి పెట్టుకుని లోకాన్ని ఉద్దరించినట్లు మాట్లాడే వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ సామెత ఉపయోగిస్తారు.