• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పర్యవేక్షణ

PLD: ఈనెల 23 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు పల్నాడు జిల్లాలో పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిణి నీలావతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 34,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరకానున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉంటుందన్నారు.

February 20, 2026 / 09:35 AM IST

జిల్లాలో అరుదైనా ఉడుత

VKB: జిల్లాలో ఒక అరుదైన పెద్ద ఉడుత (Malabar Giant Squirrel) కనిపించింది. కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి, అమ్రాబాద్ అడవిలో తన పరిశోధనలో భాగంగా దీనిని గుర్తించారు. దీనిని శాస్త్రీయంగా రాటుఫా ఇండికా అని పిలుస్తారు. ఇది సుమారు 3 అడుగుల పొడవు, వివిధ రంగులు కలిగి ఉంటుందని తెలిపారు.

February 20, 2026 / 09:35 AM IST

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ 2, 13 వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి ఇవాళ ఉదయం పర్యటించారు. ఈ మేరకు వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న శుభ్రత పనులను పరిశీలించారు. పనులు సక్రమంగా నిర్వహించాలని, చెత్త సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సిబ్బందికి సూచించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

February 20, 2026 / 09:35 AM IST

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను కలిసిన పీయు ఉపకులపతి

MBNR: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మను పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి జీఎన్ శ్రీనివాస్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండల చైర్మన్ బాల కిష్టారెడ్డి, ఇతర యూనివర్సిటీల ఉపకులపతులు ఉన్నారు.

February 20, 2026 / 09:34 AM IST

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 258.21 పాయింట్లు నష్టపోయి 82239.93 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 68.80 పాయింట్ల నష్టంతో 25385.55 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.98గా ఉంది.

February 20, 2026 / 09:34 AM IST

ఈ నెల 22న బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం TG-సెట్

MNCL: ప్రభుత్వ గురుకులాల్లో 5వ తరగతి, 6, 7, 8వ తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం ఈ నెల 22న TG-సెట్ నిర్వహించనున్నట్లు కాసిపేట బాలుర గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ వూటూరి సంతోష్ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. నిర్దేశించిన కేంద్రాల్లో పరీక్ష ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్ నుంచి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 09:33 AM IST

వేగవంతం కానున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు

VSP: చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. వంతెన నిర్మించాల్సిన ప్రాంతంలో అడ్డుగా ఉన్న భారీ వృక్షాల వల్ల పనులు నిలిచిపోగా, తాజాగా జీవీఎంసీ అధికారులు వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టారు. అడ్డంకులు తొలగడంతో త్వరలోనే నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. పాదచారుల చిరకాల స్వప్నమైన ఈ ఫుట్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుంది.

February 20, 2026 / 09:33 AM IST

బాల్య వివాహ విముక్తి ప్రచార రథం ప్రారంభం

BHNG: వివాహాలను అరికట్టడమే లక్ష్యంగా జిల్లాలో బాల్య ఏర్పాటు చేసిన ‘బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని భువనగిరి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

February 20, 2026 / 09:33 AM IST

కంభంలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం: కంభం పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజ్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ఆటో ఆగి ఒక్క సారిగా రివర్స్ చెయ్యడంతో వెనుక నుండి కార్ ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో నలుగురు, కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు. ఆటో, కారు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

February 20, 2026 / 09:32 AM IST

వైఎస్ జగన్మోహన్ రెడ్డి‌తో సమీర్ ఖాన్ భేటీ

NLR: విజయవాడలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ మేధావుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్, ముస్లిం మత పెద్దలతో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డికి పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను, రంజాన్ తోఫాను అందజేశారు.

February 20, 2026 / 09:31 AM IST

వైసీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా గుండా సురేంద్ర నియామకం

GNTR: వైసీపీ ఎస్టీ సెల్ (మైదానప్రాంత) రాష్ట్ర అధ్యక్షుడిగా గుండా సురేంద్ర నియమితులయ్యారు. గతంలో ట్రైకార్ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన మైదానప్రాంత గిరిజనుల సమస్యలపై చురుకుగా స్పందించారు. గిరిజనులకు పార్టీకి మధ్య వారధిగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 09:31 AM IST

బాపురంలో అంతర్ రాష్ట్ర బండలాగుడు పోటీలు

KRNL: పెద్దకడబూరు మండలం బాపురంలో వెలసిన శ్రీ గంగాదేవి జాతర సందర్భంగా ఈ నెల 23న అంతర్ రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు హనుమంతు శుక్రవారం తెలిపారు. ఇందులో విజేతలుగా నిలిచిన కాడెద్దులకు ప్రథమ బహుమతిగా రూ. 25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 20 వేలు, తృతీయ బహుమతిగా రూ. 15 వేలు, నాల్గవ బహుమతిగా రూ. 10 వేలు, ఐదవ బహుమతిగా 5 వేలు అందజేస్తామన్నారు.

February 20, 2026 / 09:30 AM IST

సెమీస్‌లో లంక తడబాటు.. భారత్ టార్గెట్ ఎంతంటే? 

ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: సెమీస్‌లో భారత్ బౌలింగ్ ధాటికి శ్రీలంక బ్యాటర్లు తడబట్టారు. దీంతో ప్రత్యర్థి జట్టు 118 పరుగులకే పరిమితమైంది. యువ భారత్ తరఫున కెప్టెన్ రాధా యాదవ్ 4 వికెట్లు తీయగా.. ప్రేమా రావత్, తనుజా కన్వర్ తలో 2 వికెట్లు పడగొట్టారు. టోర్నీ ఫైనల్ చేరేందుకు టీమిండియా విజయ లక్ష్యం 126 రన్స్.

February 20, 2026 / 09:30 AM IST

BREAKING: భారీగా డ్రగ్స్ స్వాధీనం

TG: HYDలోని అమీన్ పూర్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండున్నర కిలోల OPM డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న.. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్నారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

February 20, 2026 / 09:30 AM IST

పుస్తెల తాడు దొంగిలించిన యువకుల అరెస్ట్

NLG: మునుగోడు మండలం పలివెలలో చింతకాయలు తెంచుతున్న మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు దొంగిలించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మాద నరేందర్, వల్లెపు సాయిల నుంచి బంగారు గొలుసు, కారు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కేసును వేగంగా ఛేదించిన ఎస్ఐ రవిని డీఎస్పీ శివరాంరెడ్డి అభినందించారు.

February 20, 2026 / 09:28 AM IST