AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏడో రోజు సమావేశాలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఇవాళ్టి సెషన్స్లో మండలి సభ్యులకు బడ్జెట్ ప్రసంగంపై మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమివ్వనున్నారు. కాగా ఇందాపూర్ డెయిరీ అంశంపై వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.
TG: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్ మేయర్ ఉమారాణి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పాల్వంచలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
NLR: బుచ్చి(మం) రామచంద్రపురం గురుకుల పాఠశాలలో కరెంటు షాక్ తగిలి ఓ కూలి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీపై ఇనుప ముల్ల కంచె ఏర్పాటు చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ కూలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే బుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
RR: తిమ్మాపూర్ ఉన్నత పాఠశాలలో నిన్న విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు చదువు బోధించారు. పలువురు విద్యార్థులు ఒక్కరోజు హెడ్ మాస్టర్, కలెక్టర్ వంటి హోదాల్లో కనిపించారు. ఈ సందర్భంగా ఫోటోలు దిగి తీపి జ్ఞాపకాలను మిగిల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
CTR: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23 నుంచి జరగబోయే ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియెట్ డీఐఈవో రఘుపతి ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ప్రతి కేంద్రం వద్ద కళాశాల పేరు, పరీక్ష కేంద్రం నంబర్ కనిపించేలా ఫ్లెక్సీలు చేయాలన్నారు. నో సెల్ఫోన్ జోన్ అని విద్యార్థులకు అర్థమయ్యేలా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.
SKLM: జలుమూరు మండలం శ్రీ ముఖలింగం క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాల అనంతరం స్వామివారి హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించనున్నట్లు ఆలయ ఈవో కె.ఏడు కొండలు గురువారం ప్రకటనలో తెలిపారు. ఆలయ నిబంధనల మేరకు దేవ దాయ శాఖ అధికారులు, పాలక మండలి, అర్చకుల సమక్షంలో లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు.
GNTR: నేడు అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కోటా మాలాద్రి తెలిపారు. గుంటూరులోని మల్లయ్య లింగం భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ సంపద కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో కేంద్రీకృతమైందని, అసమానతలు పెరిగాయని విమర్శించారు.
ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పెద్ద జట్లకు నెదర్లాండ్స్, స్కాట్లాండ్ తరఫున డచ్ ప్లేయర్ బాస్ డెలీడ్ కీలక విజ్ఞప్తి చేశాడు. పెద్ద టీమ్స్ ICC టోర్నీల్లో మినహా తమ నెదర్లాండ్స్ లాంటి అసోసియేట్ జట్లతో ఆడట్లేదని.. ద్వైపాక్షిక సిరీసులు కుదరకుంటే వార్మప్ మ్యాచులైనా ఆడాలని కోరాడు. దీంతో తమ ఆట మెరుగవుతుందని, జూన్లో వన్డే WC క్వాలిఫైయింగ్ మ్యాచులు జరిగే వరకు తాము ఖాళీనే అని పేర్కొన్నాడు.
NDL: బుచ్చి(మం) రామచంద్రపురం గురుకుల పాఠశాలలో కరెంటు షాక్ తగిలి ఓ కూలి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీపై ఇనుప ముల్ల కంచె ఏర్పాటు చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ కూలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే బుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
VKB: ధారూర మండల పరిధిలోని నాగసమందర్లో మరింత కట్టుదిట్టం చేస్తూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం ధారూర్ ఎస్సై సున్నం రాఘవేందర్ ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సర్పంచ్ వెంకట్ ఆధ్వర్యంలో ఈ నిఘా నేత్రాలను ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ఎంతో దోహదపడతాయని తెలిపారు.
హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ‘ఈషా’ మూవీ OTTలోకి వచ్చేసింది. గత ఏడాది DEC 25న విడుదలై ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ కేవలం ఓవర్సీస్లో రెంట్ పద్దతిలో మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా తెలుగులో కూడా స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఇక ఈ మూవీలో హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్ కీలక పాత్రలు పోషించారు.
MNCL: యూరియా బుకింగ్ యాప్లో రైతులు ఫోన్ నెంబర్ను లింక్ చేయించుకోవాలని జన్నారం మండలం కవ్వాల్ క్లస్టర్ అక్రమ్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు యూరియా బస్తాల కోసం ఇంకా యాప్లో ఫోన్ నెంబర్ను లింక్ చేయించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో వారికి యూరియా బస్తాలు అందే అవకాశాలు లేదని హెచ్చరించారు. దేవునిగూడెం రైతు వేదికకు రైతులు రావాలని సూచించారు.
NLG: రూ. కోట్లు పెట్టి నిర్మించిన చిట్యాల పురపాలక వైకుంఠధామంలో సౌకర్యాల లేమి అద్దం పడుతోంది. గురువారం రాత్రి మునుగోటి వెంకన్న అనే వ్యక్తి అంత్యక్రియల సమయంలో కనీసం విద్యుత్ దీపాలు లేకపోవడంతో, సెల్ఫోన్ టార్చ్ లైట్ల సాయంతో కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. విద్యుత్ స్తంభాలు ఉన్నా దీపాలు అమర్చకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
VZM: మద్యానికి బానిసైన భర్తను భార్య మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరంలో జరిగింది. వన్ టౌన్ ఎస్సై ఎస్సై అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్కు చెందిన బెవర శ్రీనివాస్ (28) కూలీ పనులు చేస్తు జీవనం సాగించే వాడు. మద్యానికి బానిస కావడంతో ఆయన భార్య రేవతి మందలించింది.
KNR:గంగాధర మండలంలో మాజీ సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని కోరుతూ గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో డి.రాముకు పలువురు మాజీ సర్పంచ్లు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు మాజీ సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.