BDK: నాయి బ్రహ్మణ సంఘం నాయకులు, చిరకాల మిత్రుడు గుడివాడ నాగేశ్వరరావు మృతి పట్ల ఎమ్మెల్యే కోరం కనకయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం వారి కుటుంబ సభ్యులను ఎంఎల్ఏ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్ట సమయంలో ఉన్న వారి కుటుంబానికి కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
BDK: నాయి బ్రహ్మణ సంఘం నాయకులు, చిరకాల మిత్రుడు గుడివాడ నాగేశ్వరరావు మృతి పట్ల ఎమ్మెల్యే కోరం కనకయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం వారి కుటుంబ సభ్యులను ఎంఎల్ఏ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్ట సమయంలో ఉన్న వారి కుటుంబానికి కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
MDK: వెల్దుర్తి మండల పరిధిలోని ఆరెగూడెంలో బుధవారం రాత్రి గుండెపోటుతో తిరుపతి (23) అనే యువకుడు మృతి చెందాడు. రాత్రి 11:30 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. అందరితో కలుపుగోలుగా ఉండే తిరుపతి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు రావడం గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
MDK: వెల్దుర్తి మండల పరిధిలోని ఆరెగూడెంలో బుధవారం రాత్రి గుండెపోటుతో తిరుపతి (23) అనే యువకుడు మృతి చెందాడు. రాత్రి 11:30 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. అందరితో కలుపుగోలుగా ఉండే తిరుపతి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు రావడం గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో రానున్న భారీ చిత్రం ‘వారణాసి’ గురించి ప్రియాంక చోప్రా ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇందులో తను ‘మందాకిని’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించింది. ఈ సినిమా తన సినీ ప్రయాణాన్ని మార్చేస్తుందని, తన కెరీర్ను నిర్వచించే చిత్రమిదని ఆమె పేర్కొంది.
MDCL: జిల్లాలో సెకండ్ ఫేజ్ యూరియా బుకింగ్ ప్రారంభమైంది. రైతులు ఫెర్టిలైజర్ యాప్ ద్వారా సులభంగా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. పాస్ బుక్ చేసిన మొబైల్ నంబర్తో లాగిన్ అయి అవసరమైన పరిమాణాన్ని ఎంపిక చేసి సమీప ఎరువుల దుకాణాన్ని సెలెక్ట్ చేయాలి. బుకింగ్ నిర్ధారణ తర్వాత మెసేజ్ వస్తుందని పేర్కొన్నారు.
MDCL: ఉప్పల్ పరిధిలోని గణేష్ నగర్, సెవెన్ హిల్స్, కావేరి నగర్, శ్రీనగర్ ప్రాంతాల్లో దోమల బెడద తీవ్రంగా మారింది. కాలువల్లో నిల్వ నీరు, చెత్త పేరుకుపోవడం, గుర్రపు డెక్క వల్ల దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం తర్వాత బయటకు రావడం కష్టంగా మారింది. డెంగ్యూ, మలేరియా భయం నెలకొంది.
ప్రకాశం: కొమరోలు మండలంలోని రావురిపాలెం, రెడ్డి చర్ల గ్రామాలలో గల పంటలను ఉద్యాన శాఖ అధికారి శ్వేత బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని టమాటా పంటను ఆమె పరిశీలించి, పంటలో మంచి దిగుబడి రావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ప్రకాశం: కొమరోలు మండలంలోని రావురిపాలెం, రెడ్డి చర్ల గ్రామాలలో గల పంటలను ఉద్యాన శాఖ అధికారి శ్వేత బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని టమాటా పంటను ఆమె పరిశీలించి, పంటలో మంచి దిగుబడి రావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
BDK: ఎన్నికల్లో గెలవాలనుకుంటే ప్రజాస్వామికంగా గెలవాలని, కానీ పోలీసులను వాడుకోవడం దేనికని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని సీపీఐ అభ్యర్థిని ఒక సీఐ తుపాకీ పెట్టి బెదిరించాడని ఆరోపించారు. తమ అభ్యర్థులను పోలీసులతో అణచివేయాలని చూసిన ఎన్నికల్లో గెలిచి చూపించామన్నారు.
MDK: ఏడుపాయల మహాశివరాత్రి జాతర హుండీ లెక్కింపును బుధవారం గోకుల్ ఫంక్షన్ హాల్లో చేపట్టారు. 29 రోజుల హుండీ ఆదాయం రూ.39,87,178తో పాటు ఒడిబియ్యం, తలనీలాలు, ప్రత్యేక దర్శన టికెట్లు, లడ్డూ, పులిహోర విక్రయ సేవాల ద్వారా మొత్తం దేవస్థానానికి రూ.87,56,265 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వీరేశం తెలిపారు. 2025 కంటే 2026లో ఆదాయం రూ.26,06,031 ఎక్కువగా వచ్చిందన్నారు.
HNK: జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాల్లో ఇంటర్, 64 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
MDK: మనస్పర్థలతో యువకుడు ఆత్మహత్య చేసుకన్న చిలిపిచెడ్ మండలం చిట్కుల్లో జరిగింది. గ్రామానికి చెందిన అశోక్ (30) సంగారెడ్డి జిల్లా చౌటకూర్కు ఇల్లరికం వెళ్లాడు. కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా మనస్తాపం చెంది పొలానికి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. చేతికందిన కొడుకు మృతితో చిట్కుల్లోని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
MDK: మనస్పర్థలతో యువకుడు ఆత్మహత్య చేసుకన్న చిలిపిచెడ్ మండలం చిట్కుల్లో జరిగింది. గ్రామానికి చెందిన అశోక్ (30) సంగారెడ్డి జిల్లా చౌటకూర్కు ఇల్లరికం వెళ్లాడు. కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా మనస్తాపం చెంది పొలానికి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. చేతికందిన కొడుకు మృతితో చిట్కుల్లోని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
WGL: ఉమ్మడి జిల్లా ముస్లిం సోదర, సోదరీమణులకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు రంజాన్ నెల అత్యంత పవిత్రమైనదని మంత్రి పేర్కొన్నారు. ఈ మాసంలో ముస్లిం ప్రజలందరూ ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలతో, ఆరోగ్యంగా, సంతోషంగా గడపాలని మంత్రి సురేఖ కోరారు.