NZB: వేల్పూర్ మండలం మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కుమారి రూప ఇటీవల జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున ఆడి మంచి ప్రతిభ కనపరిచినందుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైద్య గణేశ్, ఉపాధ్యాయులు మంచే గణేశ్, మహేందర్ ఉన్నారు.
SS: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మార్చి 1న కడపలో నిర్వహించే భారీ బహిరంగ సభకు తరలిరావాలని జిల్లా YCP అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. హిందూపురంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టును ఆపేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నా చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు.
NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలు, గోధుమల్లో అక్రమాలను అరికట్టేందుకు అధికారులు పక్క వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. నిరుపేదల రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు నిఘాను ముమ్మరం చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 2,081 రేషన్ దుకాణాలపై నిరంతరం పరిరక్షణ ఉంచాలని ఆ శాఖ నిర్ణయించుకుంది.
AP: శ్రీకాకుళంలో డయేరియా కేసుల నమోదుపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. 32 మంది డయేరియా బారిన పడ్డారని, 10 మంది డిశ్చార్జి అయ్యారని అధికారులు తెలిపారు. 22 మంది పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో రహదారి మరమ్మతు పనుల వల్ల నీరు కలుషితమైందని ప్రాథమికంగా గుర్తించామని, డయేరియా బాధితుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని సీఎంకు అధికారులు వివరించారు.
KMR: బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలో జనసేన పార్టీ నాయకుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ వీర మహిళ నాయకురాలు సరిత మానేకర్ హాజరై మాట్లాడుతూ.. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ప్రారంభం కాబోతున్నాయని, బిచ్కుంద మండలంలోని ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వాలను తీసుకోవాలని పేర్కొన్నారు.
WGL: ప్రతిష్ఠాత్మక కాకతీయ యూనివర్సిటీలో ఇటీవల కాలంలో విద్యార్థుల మధ్య గొడవలు, ఘర్షణలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రశాంత వాతావరణం ఉండే క్యాంపస్లో ఇప్పుడు అస్థిరత నెలకొంది. నిన్న యూనివర్సిటీలోనే చికెన్ కోసం విద్యార్థులు కర్రలతో కొట్టుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పర్యవేక్షణ లేక గొడవలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 17వ వార్డ్లో మంగళవారం ఉదయం పారిశుద్ధ్య పనులను కమిషనర్ సంపత్ రెడ్డి, కౌన్సిలర్ రాగంశెట్టి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. మురుగు కాలువలలో పేరుకుపోయిన చెత్తను సిబ్బందిచే తీయించారు. వార్డ్లలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
MDK: విద్యుత్ సమస్యలు పరిష్కారంలో భాగంగా మనోహరాబాద్ మండలం రామయిపల్లిలో ప్రజాబాట నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రజలు విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని కాళ్లకల్ ఏఈ రాజ్ కుమార్ తెలిపారు. ఈ ప్రజాబాటలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు: కార్వేటినగరం మండలంలో మందుబాబుల అడ్డాలుగా ఉన్న ప్రాంతాలను పోలీసులు రూపు మార్చుతున్నారు. ఎస్పీ తుషార్ డూడీ ధైర్య స్పర్శ అనే ఓ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎస్ఐ తేజస్విని సిబ్బందితో కలిసి మందుబాబులకు అడ్డాగా ఉన్న అమ్మపల్లి డ్యాం వద్దకు వెళ్లారు. అక్కడి చెత్త తొలగించారు. మందుబాబులు కూర్చోకుండా ప్రదేశాలను నీటిగా రెడీ చేస్తున్నారు.
SRD: సిర్గాపూర్ ఉన్నత పాఠశాలలో టెన్త్ విద్యార్థుల అంతర్గత పరీక్షల మార్కులను GHM వెంకటేశం బృందం నేడు పరిశీలించారు. నిర్మాణాత్మక మూల్యాంకన 4 పరీక్షలకు సంబంధించి మార్కులు, ప్రాజెక్ట్, ప్రయోగ పని, చేతిరాత ఒక్కొక్క అంశానికి 5 చొప్పున 20 మార్కులకు ఆధారాలను చూస్తూ, పరిశీలకులు చెక్ చేసి అప్రూవల్ ఇస్తారు. మొత్తం 103 మంది విద్యార్థుల వివరాలు పరిశీలించారు.
MHBD: వాహనదారులు ప్రమాద సమయంలో తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవడానికి హెల్మెట్లను తప్పకుండా ధరించాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ అన్నారు. దాతల సహాయంతో పలువురు వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను అందజేశారు. వాహనదారుల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘అరైవ్-అలైన్’ అమలు చేస్తుందన్నారు.
ATP: నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత లక్ష్యంగా జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జాతీయ రహదారులు, ముఖ్య కూడళ్లలో వాహనాలను ఆపి పత్రాలను పరిశీలించారు. అక్రమ రవాణా, అనుమానాస్పద కదలికలను అరికట్టడమే ఈ ప్రత్యేక డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.
కోనసీమ జిల్లా రావులపాలెం రైతు బజార్కు ఇకపై ప్రతి మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..వారాంతపు సెలవుగా నిర్ణయించినట్లు ఎస్టేట్ ఆఫీసర్ తేజ సోమవారం తెలిపారు. కావున రైతులు, వ్యాపారుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కావున మంగళవారం రైతు బజార్ మూసి ఉంటుందని,వినియోగదారులు ఈ మార్పును గమనించాలన్నారు.
ముఖంపై పేరుకుపోయిన అదనపు నూనెను, మురికిని తొలగించడంలో రోజ్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఎండ వల్ల చర్మం కందిపోయినా లేదా ఎర్రగా మారినా కొద్దిగా రోజ్ వాటర్ చిలకరిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. కానీ మొదటి సారి వాడేటప్పుడు చేతిపై కొద్దిగా రాసి ‘ప్యాచ్ టెస్ట్’ చేసుకోవడం ఉత్తమం.
అన్నమయ్య: మదనపల్లెలో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాల మార్కెట్కు 66 వేల కిలోల (66 మెట్రిక్ టన్నుల) టమాటాలను రైతులు తీసుకువచ్చారు. మొదటి రకం 10 కిలోల టమాటాలు రూ.140, రెండవ రకం రూ.110, మూడవ రకం రూ.100లతో అమ్ముడుపోయినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. అన్ సీజన్ కారణంగానే టమాటాలకు రేట్లు పెరగడంలేదని, దిగుబడి పెరిగినా.. గిట్టుబాటు ధరలు పలకడం లేదని రైతులు వాపోతున్నారు.