ఏలూరు జిల్లాలో APOSS వోకేషనల్ పబ్లిక్ పరీక్షలు ఇంటర్మీడియట్ మార్చి 2 నుంచి 13 వరకు జరుగుతాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్ సోమవారం మాట్లాడుతూ.. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 736 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు.
MDCL: ప్రజలకు నీటి సరఫరా చేసే ముందుగా నాణ్యత పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా జలమండలి ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్టు కింద మేడిపల్లి ప్రాంతంలో సోలార్ క్లోరినేటర్ మీటర్లను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. వీటిని ఓవర్ హెడ్ ట్యాంక్ ఇన్ లెట్, అవుట్ లేట్ పైపులకు అమరిచిన తరువాత రెండుసార్లు నాణ్యత పరీక్షలు చేయనున్నారు.
ఎనిమిదిసార్లు ఛాంపియన్ కర్ణాటక.. తొలిసారి ఫైనల్ చేరిన జమ్మూకశ్మీర్ రంజీ ఫైనల్లో తలపడనున్నాయి. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, పడిక్కల్, స్మరణ్ లాంటి బ్యాటర్లతో కర్ణాటక బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. జమ్మూ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీ ఆధ్వర్యంలోని బౌలింగ్ విభాగం వారికి ఎలా అడ్డుకట్ట వేస్తుందనేది ఆసక్తికరం. J&K తొలిసారి ట్రోఫీని ముద్దాడుతుందా లేదా చూడాలి.
SRPT: ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని కోటపహాడ్ నర్సరీ సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రభుత్వం మొక్కల పెంపకానికి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువైంది. నర్సరీలోని మొక్కలకు సకాలంలో నీళ్లు పోయకపోవడంతో వేల సంఖ్యలో మొక్కలు ఎండిపోయాయి. అధికారుల నిర్లక్ష్యంపై మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
NDL: విదేశీ పక్షులతో జిల్లాలోని వరి రైతులు బెంబేలెత్తుతున్నారు. రబీ సీజన్లో రైతులు వరి నాట్లు విస్తారంగా వేశారు. అయితే పర్ఫాల్ స్వాపెన్ జాతికి చెందిన విదేశీ పక్షులు నాట్లను పీకేస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పోర్ఫిరియో ఇండికస్, ఆగ్నేయ ఆసియా నుంచి వచ్చిన ఈ పక్షులు చిత్తడి నేలల్లో జీవిస్తాయి. వరి, జమ్ము బెరడులను తిని ఈ పక్షులు జీవిస్తాయి.
KRNL: చిలకలడోన గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఉన్న అక్రమ ప్లాట్లు, గుడిసెలను తొలగించాలని ఎస్సీ కాలనీవాసులు జిల్లా సబ్ కలెక్టర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని భూమిని స్వాధీనపరచి, స్థలంలేని నిరుపేద కుటుంబాలకు ప్లాట్లు ఇవ్వాలని కోరారు. అలాగే ఎస్సీ కమ్యూనిటీ హాల్కు స్థలం కేటాయించి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
BHPL: జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్ భవనంలో నేటి నుంచి పంచాయతీ సర్పంచులకు మూడో విడత శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. మహాముత్తారం, మలహర్, పలిమెల మండలాలకు చెందిన సర్పంచులకు ఈ తుది విడత శిక్షణ 28వ తేదీ వరకు జరుగుతుంది. పంచాయతీ వ్యవస్థ బలోపేతం, అభివృద్ధి పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై శిక్షణ అందించనున్నారు.
MDK: తూప్రాన్ మండలం ఘనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి చేతన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్కు ఎంపికైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఎనిమిదో తరగతి చదువుతున్న చేతన ఎన్ఎంఎంఎస్ పరీక్షకు హాజరైంది. విద్యార్థికి 8, 9 తరగతులతోపాటు, ఇంటర్మీడియట్లో రూ. 1000 స్కాలర్షిప్ లభించనున్నట్లు ఉపాధ్యాయులు వివరించారు.
KMM: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్లను ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. సన్నబియ్యం నిల్వలు, నాణ్యత, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిల్వల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బియ్యం రక్షణకు రసాయనాల వినియోగంపై అధికారులకు సూచనలు చేశారు.
MNCL: బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలోని ఇప్ప లత ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సామాగ్రి కాలిపోయాయి. బాధితుల వివరాల ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ వల్ల బట్టలు, టీవీ, కూలర్, ఫ్యాన్, ఫ్రిజ్, రూ.50వేలు, అర తులం బంగారం, కుమారుడి స్టడీ సర్టిఫికెట్స్ కాలి బూడిద అయ్యాయన్నారు. అధికారులు స్పందించి నిరుపేదలమైన తమకు సాయం చేయాలని వేడుకున్నారు.
HYD: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నేడు పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఉదయం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన అనంతరం, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
MDCL: జిల్లా వ్యాప్తంగా జీరో టీబీ లక్ష్యంగా DTO అధికారిక యంత్రం చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపింది. ఇందులో భాగంగానే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఉద్యోగులకు క్షయ, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించినట్లుగా పేర్కొంది. అత్యధిక టెక్నాలజీతో కూడిన ఏఐ ఎక్స్ రే ద్వారా వ్యాధిని సులభంగా గుర్తించడం జరుగుతుందని డాక్టర్ సంధ్య పేర్కొన్నారు.
SKLM: అర్జీలు పెండింగ్లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించారు. 127 అర్జీలు ఇందులో రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్ , గ్రామీణాభివృద్ధి శాఖ తదితర శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.
TG: వైద్యారోగ్యశాఖలో 434 పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసిన 14 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో ఒక్కోదానికి 31 చొప్పున పోస్టులున్నాయి. వైద్యారోగ్య నియామక మండలి భర్తీ చేయనుంది. వీటితో పాటు జలమండలికి 130 పోస్టులు మంజూరు చేసింది. ఇందులో మేనేజర్, ఇంజనీర్ పోస్టులున్నాయి. వీటిని TGPSC ద్వారా భర్తీ చేస్తారు.
నంద్యాల 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద ఓ వృద్ధుడు మృతి చెందినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు CI నంబర్ 91211 01088కు సమాచారం ఇవ్వాలని కోరారు.