MHBD: ఇనుగుర్తి గ్రామంలో ఎంజాల కుమారస్వామి అనే రైతు తమ సాగు చేస్తున్న కూరగాయల పంటలో కూరగాయలు తెంపుతుండగా, బీరకాయ సాగులో వినూత్నంగా రామచిలుక ఆకారంలో బీరకాయ కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. జెన్యూ మార్పిడి వల్ల కొన్ని సార్లు విత్తనాలు, చిన్న మార్పులు వస్తాయని పలువురు రైతులు పేర్కొన్నారు.
MLG: ఈ రోజు చంద్రగ్రహణం కారణంగా మంగపేట మండలం మల్లూరులో గల స్వయంభు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం స్వామి వారికి ఆరాధన, నివేదన చేసి (ద్వారా బంధనం) ఆలయ తలుపులు మూసివేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి రెవెల్లి మహేష్ తెలిపారు. బుధవారం దేవాలయ సంప్రోక్షణ అనంతరం స్వామివారి దర్శనం యధావిధిగా కొనసాగుతుందన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో అరణ్య ప్రాంతాల మార్గంలో ప్రయాణం చేస్తుంటే జింకల గుంపులు ప్రత్యక్షమై చెంగుచెంగున ఎగురుతూ వెళ్లేవి. ప్రస్తుతం ఎక్కడ చూసినా జింకలు కనిపించడం లేదు. పోడు సాగు, చెట్ల నరికివేత, గుట్టలు పిండి చేయడంతో అడవుల విస్తీర్ణం తగ్గిపోయి అవి దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయి స్థిర నివాసం ఏర్పరచుకున్నాయని వన్యప్రాణి ప్రేమికులు పరిశోధించారు.
WGL: సంగెం (M) కేంద్రంలోని కాపుల కాన్పర్తి గ్రామంలో 16 నూతన సీసీ కెమెరాలను ఏసీపీ వెంకటేష్ ఇవాళ ప్రారంభించారు. గ్రామంలో భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాలను అరికట్టడం, ప్రజలకు రక్షణ కల్పించడం లక్ష్యంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దొంగతనాలు నియంత్రణకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలిపై ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కోహ్లీ ఆటతీరు బౌలర్ను మానసికంగా దెబ్బతీస్తుంది. ఒక బ్యాటర్ బలాన్ని ఉపయోగించి స్లాగ్ షాట్తో సిక్స్ కొడితే నేను పెద్దగా పట్టించుకోను. కానీ, కోహ్లీలా టెక్నిక్తో గ్యాప్ల ద్వారా బంతిని బౌండరీకి పంపితే అది నన్ను బాధిస్తుంది’ అని పేర్కొన్నాడు.
భూపాలపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం మంగళవారం రంగుల కేళితో పులకించిపోయింది. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో మహిళా ఎస్సైలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డీజే పాటల హోరులో ఎస్పీతో కలిసి మహిళా అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా స్టెప్పులేశారు. సంప్రదాయ పద్ధతిలో రంగులు పూసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
తూ.గో: నిడదవోలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం చౌటుప్పల్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, నిడదవోలుకు చెందిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశాలతో క్షతగాత్రులను చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని మంత్రి తెలిపారు.
AP: రాష్ట్ర ఉన్నత విద్యామండలి లాసెట్, పీజీ-ఎల్సెట్ దరఖాస్తు గడువును పెంచింది. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 20వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది లా ప్రవేశ పరీక్షలను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
TG: మాజీ సీఎం కేసీఆర్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన మధ్యాహ్నం ఎర్రవల్లిలోని ఫామ్హౌస్కు చేరుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.
PDPL: పెద్దపల్లి సర్కిల్లో విద్యుత్ లేని 69 అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామని ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ లేని కేంద్రాలను గుర్తించి, అంతర్గత వైరింగ్, ఇతర సదుపాయాలతో పాటు విద్యుత్ సేవలను వేగంగా అందిస్తున్నామన్నారు.
ప్రకాశం: తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డి పల్లి నుంచి తుమ్మలచెరువు గ్రామానికి వెళ్లే రోడ్డుపై మంగళవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ASR: ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల్లో సాగవుతున్న జీడిమామిడికి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి గిరిజన యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ఆదివాసీ జేఏసీ కోరింది. మంగళవారం ఎస్టీ కమిషన్ ఛైర్మన్కు వారు వినతిపత్రం అందజేశారు. అలాగే, దేవీపట్నం మండలంలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉన్న తోటల్లో జీడిగింజలు కోసేందుకు గిరిజనులకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు.
ATP: ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, స్వయంగా రథాన్ని లాగి ఉత్సవాన్ని పురస్కరించుకున్నారు.
SRPT: అధికారుల వేధింపులు భరించలేక తెల్లబల్లి ప్యాక్స్ (PACS) ఇన్ఛార్జి సీఈవో రాజారావు సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రుణ వసూళ్లు, ప్యాక్స్ నిర్వహణపై ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఇవాళ తెలిపారు. ప్రస్తుతం రాజారావు ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
SKLM: పొందూరు మండల పరిధిలో ఉన్న క్వారీ యజమానులతో డీఎస్పీ వివేకానంద మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్లాస్టింగ్ సమయంలో కార్మికులు, స్థానిక ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మందుగుండు నిల్వ, రవాణా, వినియోగంలో నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.