కామారెడ్డి జిల్లా తెలంగాణ జాగృతి కార్యదర్శిగా లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ తెలిపారు. ప్రతాప్ రెడ్డి కవితను కలవగా, ఆమె కండువా కప్పి అభినందించారు. తనపై నమ్మకంతో అప్పగించిన పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని పేర్కొన్నారు.
అన్నమయ్య: కడప-చెన్నై హైవేపై ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి కరెంట్ పోల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, పోల్ విరగడంతో పుల్లంపేటలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
అన్నమయ్య: కడప-చెన్నై హైవేపై ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి కరెంట్ పోల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, పోల్ విరగడంతో పుల్లంపేటలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
అన్నమయ్య: కడప-చెన్నై హైవేపై ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి కరెంట్ పోల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, పోల్ విరగడంతో పుల్లంపేటలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
NTR: వీరులపాడులో ఆదివారం 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవాన్ని టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించారు.
KRNL: పెద్దకడబూరులో సీఎస్ఐ, ఆర్సీఎం చర్చిల నందు క్రైస్తవ సోదరులు మట్టల ఆదివారాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి స్థానిక చర్చి నందు ప్రత్యేక ప్రార్థల అనంతరం ఈత మట్టలను చేతబూని ‘హోసన్నా జయముహోసన్నా జయము’ అనే నినాదాలతో గ్రామ పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ మనోహర్ బాబు, ఫాదర్ రాజేంద్ర మట్టల ఆదివారం విశిష్టతను భక్తులకు సందేశమిచ్చారు.
KRNL: పెద్దకడబూరులో సీఎస్ఐ, ఆర్సీఎం చర్చిల నందు క్రైస్తవ సోదరులు మట్టల ఆదివారాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి స్థానిక చర్చి నందు ప్రత్యేక ప్రార్థల అనంతరం ఈత మట్టలను చేతబూని ‘హోసన్నా జయముహోసన్నా జయము’ అనే నినాదాలతో గ్రామ పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ మనోహర్ బాబు, ఫాదర్ రాజేంద్ర మట్టల ఆదివారం విశిష్టతను భక్తులకు సందేశమిచ్చారు.
PPM: సంగంవలన పంచాయతీ పరిధిలోని అడ్డూరివలస, సీతంపేట గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి దెబ్బతిని రవాణాకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని స్థానికులు తెలిపారు. పదేళ్ల క్రితం వేసిన మెటల్ రోడ్డు ప్రస్తుతం రాళ్లు తేలిపోవడంతో అధ్వానంగా మారిందన్నారు. ఈ మార్గం ద్వారా పది గిరిజన గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహనదారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని వెల్లడించారు.
PPM: సంగంవలన పంచాయతీ పరిధిలోని అడ్డూరివలస, సీతంపేట గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి దెబ్బతిని రవాణాకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని స్థానికులు తెలిపారు. పదేళ్ల క్రితం వేసిన మెటల్ రోడ్డు ప్రస్తుతం రాళ్లు తేలిపోవడంతో అధ్వానంగా మారిందన్నారు. ఈ మార్గం ద్వారా పది గిరిజన గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహనదారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని వెల్లడించారు.
ఏలూరు జిల్లాలో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణాపై కలెక్టర్ వెట్రిసెల్వి తీవ్రంగా స్పందించారు. అనుమతి లేకుండా కాలువలు, చెరువుల గట్ల నుంచి మట్టిని తవ్వడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన కేసులు నమోదు చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అధికారులకు ఆదేశించారు.
NDL: కోవెలకుంట్ల మండలం రేవనూరు పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించి 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మద్దిలేటి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ధనుంజయ్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
నెల్లూరులో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. వర్షాకాలం వస్తున్నా అధికారుల వద్ద తగిన నిల్వలు లేవు. ప్రధాన రీచ్లు మూతపడ్డాయి. దీనిని ఆసరాగా చేసుకుని నెల్లూరు రూరల్ (కోడూరుపాడు), నెల్లూరు అర్బన్ (భగత్సింగ్ నగర్)లో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ట్రాక్టర్కు రూ.2 వేలు, టిప్పర్కు రూ.5-7 వేల వరకు ప్రజలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
ATP: గుంతకల్లు-నంచర్ల రైల్వే స్టేషన్ల మధ్య ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలులో నుంచి జారిపడి మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాల కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: గుంతకల్లు-నంచర్ల రైల్వే స్టేషన్ల మధ్య ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలులో నుంచి జారిపడి మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాల కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: అనంతపురం పట్టణంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. థింక్ గ్యాస్ కనెక్షన్ కోసం రిజిస్టర్ చేసుకున్న 8200 మంది వినియోగదారులకు వెంటనే కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకోసం రిసోర్స్ పర్సన్లు, మెప్మా సిబ్బందితో ప్రత్యేక టీములను సైతం ఏర్పాటు చేశారు.