TG: నిజామాబాద్లో కాంగ్రెస్ నేత ఇమ్మడి గోపి హత్యకు గురయ్యాడు. ఇందల్వాయి శివారులో గోపి కారుపై దాడి జరిగింది. ఈ క్రమంలో అతన్ని కారులో నుంచి బయటకు తీసుకొచ్చి చంపేశాడు. అనంతరం నిందితుడు పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇందల్వాయి మాజీ ఎంపీపీగా గోపీ పనిచేశాడు.
కోనసీమ: రావులపాలెం మండలంలోని ఈతకోట టోల్ గేట్ వద్ద తెల్లవారుజామున భారీ ప్రమాదం తప్పింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రయాణికులెవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు. అయితే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మూడేళ్ల బాలుడు జయకృత్ మృతి చెందాడు. 25 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఇవాళ మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కల్తీ పాల వల్ల కిడ్నీతో పాటు వివిధ శరీర భాగాలు ఫెయిల్యూర్ అవడం వల్ల మృతి చెందాడని తెలిపారు.
AP: వెలగపూడి సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో తుళ్లూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విధుల్లో ఉన్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని ఆరా తీస్తున్నారు. సమీప పొలంలో నిప్పు పెట్టడంతోనే మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై విచారణ చేపట్టాలని హోం మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.
AP: అమరావతిలోని వెలగపూడి N9 జంక్షన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్ అండ్ టీ స్టాక్ పాయింట్ సంస్థలో భారీగా ప్లాస్టిక్ పైపులు తగలబడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పైపులు తగలబడుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కృష్ణా జిల్లా శివాలయంలో నగదు మాయంపై దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ ఈవో, అర్చకులు కలిసి రూ.10 లక్షలకుపైగా నగదు మాయం చేసినట్లు తెలుస్తోంది. అంతరాలయం హుండీ మారుతాళం తయారుచేసి భారీగా నగదు చోరీకి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు పూజారులతో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్ నుంచి థాయ్లాండ్ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ల్యాండింగ్ గేర్ దెబ్బతింది. దీంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. ఈ ఘటన ఫుకెట్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. దీంతో అధికారులు కొంతసేపు రన్వేను మూసేశారు. విమానంలోని 133 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
AP: విజయనగరం జిల్లా రామభద్రపురంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొబ్బిలి కూడలి మలుపు వద్ద సాలూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
VSP: జిల్లా కేంద్రంలో విషాద ఘటన జరిగింది. గోస్తాని గేటు ప్రధాన రహదారి పక్కన హై వోల్టేజ్ స్తంభం ఎక్కిన గుర్తుతెలియని వ్యక్తి విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు హార్బర్ పోలీసులు తెలిపారు. నేవీ సిబ్బంది దిగిపోమని హెచ్చరించినప్పటికీ అతడు మరింత పైకి ఎక్కడంతో వైర్లు తగిలి ప్రమాదం జరిగినట్లు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
AP: శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందింది. జాయేషా(4) ఆడుకుంటూ నీటి సంపులో పడింది. వెంటనే కుటుంబసభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ATP: గుత్తి పట్టణ శివారులోని చెట్నేపల్లి రహదారిలో ఓ గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. రాజధాని బెర్న్ నగరానికి పశ్చిమాన 25 కిలోమీటర్ల దూరంలోని కెర్జర్స్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: గార్లదిన్నె వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. అనంతపురం నుంచి గుత్తికి బైక్పై వెళ్తుండగా ఐచర్ వాహనం ఢీకొట్టింది. బాధితులను సురేంద్ర, భాషగా గుర్తించారు. స్థానికులు వారిని గమనించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
CTR: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కమ్మినపల్లికి చెందిన భరత్ (20), శ్రీధర్ (22), గిరి పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతరకు వచ్చి మంగళవారం రాత్రి బైక్పై స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో మదనపల్లె క్రాస్ వద్ద విద్యుత్ స్తంభాన్ని అదుపుతప్పి ఢీకొన్నారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
తిరుపతి రూరల్లో అద్దె ఇంట్లో ఉండే సంధ్య (29) దొంగతనానికి పాల్పడింది. సాయినగర్లో నివసించే మౌనిక.. తన ఇంటి తాళాలను రోజు పూలకుండి వద్ద ఉంచే అలవాటును సంధ్య గమనించింది. ఈ నేపథ్యంలో గత నెల 8న, ఈ నెల 5న ఇంట్లోకి చొరబడి నగలు, నగదు దొంగిలించింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రూ.1.40 లక్షల నగదు, రూ.16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.