కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సంస్థ పరిష్కారం వేదికలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ ప్రజల వద్ద నుండి 5 అర్జీలను స్వీకరించారు. శానిటేషన్ కు సంబంధించి 1 అర్జీ, ఆక్రమణలకు సంబంధించి 2 అర్జీలు, న్యూ డ్రైనేజ్ నిర్మాణం కోసం 2 అర్జీలు కమిషనర్కు అందాయి. సంబంధిత శాఖ అధికారులు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు.
GNTR: గుంటూరు కలెక్టరేట్ శంకరన్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, ఆలస్యం జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు,
కాకినాడ: పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆటో డ్రైవర్లకు అవగాహన, కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆటో నడిపే సమయంలో చేసే సాధారణ తప్పిదాలు, ప్రమాదాలకు గల అవకాశాలను వివరించారు. వేగం అదుపులో లేకుండా నడపడం ప్రాణాలకు హానికారకమని, పరిస్థితులను గమనిస్తూ వాహనం నడపాలని సూచించారు. నియమాలను లెక్కచేయకుండా నడిపితే జరిమానాలు, కేసులు, వాహన పత్రాలరద్దు వంటి చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.
KRNL: ఆలూరులో ఎనిమిదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు లైంగిక దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్, సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఇవాళ డిమాండ్ చేశారు. నిందిత విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
SKLM: జిల్లా కేంద్రంలో అతిసార వ్యాధి కేసులు నమోదు కావడంతో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. వ్యాధి ప్రభావంపై సమీక్షించిన అనంతరం బాధితులకు తక్షణమే మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వ్యాధి వ్యాప్తి మూలాలను గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రకాశం: ప్రజల ఆర్థిక భద్రతను కాపాడడమే లక్ష్యంగా గిద్దలూరు లోని ఏటీఎం కేంద్రాల్లో సీఐ సురేష్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా సీసీ కెమెరాల పనితీరు, అలారం వ్యవస్థలు, రాత్రి వేళల్లో లైటింగ్ , సెక్యూరిటీ గార్డుల లభ్యతను తనిఖీ చేశారు. ఏటీఎం మిషన్లకు స్కిమ్మింగ్ పరికరాలు అమర్చడం వంటి మోసాలను అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకు అధికారులకు సూచించారు.
VSP: మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే SCC పబ్లిక్ పరీక్షలను పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 133 పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
VSP: సింహాచలం ఆలయ పరిధిలోని గంగాధర మార్గంలో వేంచేసియున్న త్రిపురాంతకేశ్వరి సమేత త్రిపురాంతక స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో వెంకట్రావు దంపతులు పాల్గొని స్వస్తివాచనం, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజలతో ఐదు రోజుల మహోత్సవాలకు అంకురార్పణ చేశారు.
TPT: సత్యవేడు మండలం అమాసరెడ్డి కండ్రిగ సమీపంలో అడిషనల్ ఎస్సై లావణ్య ఆధ్వర్యంలోని బృందం తనిఖీలు నిర్వహించింది. అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 1500 కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాయుడుపేటకు చెందిన మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
PPM: నీతి ఆయోగ్ భారత్ ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన సిటీ రీజియన్స్ గ్రోత్ హబ్ ప్రాజెక్ట్లో భాగంగా జిల్లాను అభివృద్ధిలో నడిపించేందుకు జిల్లాయంత్రాంగం సిద్ధమైందని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. అందులో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్స్ కింద జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కమిటీకి జేసీ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు.
CTR: నగరి నియోజకవర్గ పుత్తూరు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం బృందం వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురం పంచాయతీలో ప్రత్యేక శిబిరం నిర్వహించింది. సురక్షా బీమా, జీవన్ జ్యోతి బీమా, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన, NPS పథకాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ మోసాలపై జాగ్రత్తలు సూచించారు.
ఏలూరు: సత్రంపాడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఈనెల 24న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఐదు ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళాకు టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన 18-35 ఏళ్ల వారు అర్హులని ప్రిన్సిపల్ భూషణం తెలిపారు. అభ్యర్థులు తమ బయోడేటాతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
KDP: ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరంలోని ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో హుండీలను సోమవారం లెక్కించారు. రూ.80,035లు రాబడి లభించిందని ఆలయం EO శ్రీధర్ తెలిపారు. ప్రొద్దుటూరు టెంపుల్స్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు సన్నుతి శ్రీనివాసులు, ఆలయ అర్చకులు, భక్తుల సమక్షంలో హుండీలోని సొమ్మును లెక్కించినట్లు ఈవో తెలిపారు.
KRNL: హలహర్వి మండలం, గూళ్యం గ్రామంలో నిర్వహించిన శ్రీ గాదిలింగేశ్వర స్వామి జాతర మహోత్సవంలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివ ప్రసాద్ స్వామివారిని సోమవారం దర్శించుకున్నారు. నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ.. సుఖసంతోషాలతో ఉండాలని నాయకులు ప్రార్థించారు.
W.G: నరసాపురం మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన చేరుగొండి రాజ్ కుమార్ సోమవారం ఆర్డీవో దాసిరాజుకు వినతిపత్రం సమర్పించారు. తన కుమారుడు ప్రభాకర్ (6)పుట్టుకతోనే 90 శాతం శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని, మెడికల్ బోర్డు ధ్రువీకరణ ఉన్నా పింఛన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం స్పందించి పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలన్నారు.