PLD: పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం రాజుపాలెం మండలం కొండమోడు వీరమ్మ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్ దారులకు డబ్బు అందజేశారు.
కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి, 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో, జిల్లా వ్యాప్తంగా 45 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని, జాతీయ రహదారులు, ఆర్&బీ రహదారుల వెంట మొక్కలు నాటి, వాటిని సంరక్షించే చర్యలు తీసుకోవాలన్నారు.
TPT: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం హిస్టరీ, బాటనీ పేపర్–II పరీక్షలు శనివారం నిర్వహించారు. జనరల్ కోర్సులో 5,033 మందికి గాను 4,930 మంది హాజరై, 103 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ కోర్సులో 1,090 మందికి గాను 1,058 మంది హాజరై, 32 మంది గైర్హాజరయ్యారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అధికారులు తెలిపారు.
NTR: గంపలగూడెం మండలం తునికపాడు గ్రామంలో రామిశెట్టి సత్యంబాబు అనే లబ్ధిదారుడికి వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ. 44,231 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అండగా నిలుస్తుందని తెలిపారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి దూరం చేసిందని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఆరోపించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వాసవి నగర్ మెయిన్ రోడ్డులో సీసీ డ్రెయిన్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
W.G: ఉండి మండలం మహదేవపట్నం హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. M. జాన్ బాబు సైన్సు ప్రాముఖ్యత, మూఢనమ్మకాలు నిర్మూలన అవగాహన కల్పించారు. సైన్స్ ఉపాధ్యాయులు K.V నాగేశ్వర రావు, K. శ్రీలత, P. లక్ష్మణుడు EPC సురేష్ పాల్గొన్నారు.
TPT: తిరుమలలో రీల్స్ చేసిన యూట్యూబర్ గీతూ రాయల్ అండ్ టీమ్పై TTD ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వప్రయోజనాల కోసం కొండపై అసత్య కథనాలతో రీల్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా ఇవాళ ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలో, కౌంటర్ల వద్ద గీతూ రాయల్ అండ్ టీం రీల్స్ చిత్రీకరించి SMలో పోస్ట్ చేశారు.
ELR: లాభాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీకి అందరూ అండగా నివాల్సిన అవసరం ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఏలూరు రెడ్ క్రాస్ సంస్థ భవనంలో 2వ అంతస్తు నిర్మాణ పనులకు ఎంపీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తన తల్లి విజయలక్షి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెడ్ క్రాస్ సంస్థకు ఎంపీ రూ. 2 లక్షల విరాళం అందించారు.
TPT: నారాయణవనం మండలం సింగిరి కోన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సరస వెంకటనారాయణబట్టి దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయంలో ఏర్పాటుచేసిన సుదర్శన ధన్వంతరి హోమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పరిసరాలు, స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం చాలా సంతోషాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం: స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కనిగిరి సెంట్ జెఎక్స్ స్కూల్లో విద్యార్థులకు ‘ముస్తాబు’ కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ కఫార్ తెలిపారు. చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కల్పించారు.
ATP: బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ, ఈ ప్రమాదం ప్రభుత్వ వైఫల్యమని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు పోతుల నాగరాజు విమర్శించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. బాణాసంచా తయారీ కేంద్రాలను తక్షణమే మూసివేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
VZM: కాకినాడ జిల్లా వేట్లపాలెం లో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి సుమారు 20 మంది సజీవ దహనం ఆయన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విజయనగరం జిల్లా చీపురుపల్లి పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత హుటాహుటిన ఘటనా స్థలానికి పయనమయ్యారు. ఇప్పటికే అక్కడ అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.
NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి పర్యటించారు. మండల టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా బీసీ ఇందిరా రెడ్డి పాల్గొన్నారు. బనగానపల్లె మండలంలోని టైలర్లకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె అన్నారు.
PPM: పార్వతీపురంలో జీఎస్టీ నిధులతో పింక్ టాయిలెట్ నిర్మాణానికి ఏపీ జిఎస్టి కమిషనర్ పి. ఆనంద్ కుమార్, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శనివారం శంకుస్థాపన చేశారు. స్థానిక నాయకులు అధికారులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. జీఎస్టీ కమిషనర్గా దేశవ్యాప్తంగా సేవలందించిన ఆనందకుమార్ రాష్ట్రానికి అనేక పథకాలు తీసుకొచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
SKLM: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ను వేగవంతం చేయాలి అని జిల్లా జనసేన పార్లమెంటరీ సమన్వయకర్త కె .రవికుమార్ అన్నారు. శనివారం నరసన్నపేటలో జరిగిన జనసేన క్రియాశీలక నమోదు ప్రక్రియలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి లో విస్తరించాలని కోరారు.