• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తర్లుపాడులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ప్రకాశం: తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డి పల్లి నుంచి తుమ్మలచెరువు గ్రామానికి వెళ్లే రోడ్డుపై మంగళవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 03:23 PM IST

‘గిరిజన యువతకు ఉపాధి కల్పించండి’

ASR: ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల్లో సాగవుతున్న జీడిమామిడికి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి గిరిజన యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ఆదివాసీ జేఏసీ కోరింది. మంగళవారం ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు వారు వినతిపత్రం అందజేశారు. అలాగే, దేవీపట్నం మండలంలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉన్న తోటల్లో జీడిగింజలు కోసేందుకు గిరిజనులకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు.

March 3, 2026 / 03:21 PM IST

పంపనూరులో వైభవంగా లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం

ATP: ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, స్వయంగా రథాన్ని లాగి ఉత్సవాన్ని పురస్కరించుకున్నారు.

March 3, 2026 / 03:20 PM IST

‘క్వారీల్లో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందే’

SKLM: పొందూరు మండల పరిధిలో ఉన్న క్వారీ యజమానులతో డీఎస్పీ వివేకానంద మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్లాస్టింగ్ సమయంలో కార్మికులు, స్థానిక ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మందుగుండు నిల్వ, రవాణా, వినియోగంలో నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

March 3, 2026 / 03:19 PM IST

పెదకాకానిలో ధర్నా చేపట్టిన అంగన్వాడీలు

GNTR: పెదకాకానిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడుతూ.. అంగన్వాడీలకు కనీస వేతనం చెల్లించాలని, గత సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

March 3, 2026 / 03:14 PM IST

వెంకన్న ఆలయం మూసివేత

AKP: నక్కపల్లి మండలం ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరిగి రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, పుణ్యా వచనం కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

March 3, 2026 / 03:11 PM IST

బాల్య వివాహాలపై ఎంపీ అవగాహన కార్యక్రమం

KRNL: బాల్యం అమూల్యమైన దశ అని, బాల్య వివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక-మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. బాల్య వివాహ విముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా రూరల్(మం) పంచలింగాల గ్రామంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ దురాచారాన్ని అరికట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని MP కోరారు.

March 3, 2026 / 03:08 PM IST

టీటీడీ మహిళా ఉద్యోగులకు పోటీలు

TPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల కోసం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. మార్చి 4న క్విజ్ పోటీలు, మార్చి 5న సంగీత పోటీలు నిర్వహించనున్నారు. డిప్యూటీ ఈవో ఆనందరాజు పర్యవేక్షిస్తున్నారు.

March 3, 2026 / 03:02 PM IST

బేతంచెర్లలో సామాజిక తనిఖీలు ప్రారంభం

NDL: బేతంచెర్ల మండలంలో ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై సామాజిక తనిఖీలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయని ఎంపీడీవో ఫజుల్ రహిమాన్ తెలిపారు. 2024-25 సంవత్సరానికి ప్రతి గ్రామానికి ప్రత్యేక బృందాలు వెళ్లి పనులు, కూలీల హాజరు, చెల్లించిన వేతనాలు, లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా పరిశీలిస్తాయని చెప్పారు. పారదర్శకతే లక్ష్యమని పేర్కొన్నారు.

March 3, 2026 / 03:01 PM IST

లక్ష్మిపాలెంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

KDP: బద్వేల్(మం) లక్ష్మిపాలెంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మిపాలెం మాడవీధుల్లో స్వామివారికి ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 3, 2026 / 02:57 PM IST

పరీక్షలలో ప్రశ్నాపత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి: రాం ప్రదీప్

NTR: ప్రతి విద్యార్థి పరీక్షలలో ప్రశ్నాపత్రాన్ని 15 నిమిషాలు క్షుణ్ణంగా చదివి సమాధానాలు రాస్తే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుందని ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధి రాం ప్రదీప్ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మునుకుళ్ళలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 3, 2026 / 02:55 PM IST

అభివృద్ధి లక్ష్యాల ప్రణాళికను సమర్పించాలి: కలెక్టర్

కోనసీమ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల ప్రణాళికను అధికారులు సమర్పించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం సమీక్ష చేశారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాను ప్రథమ స్థాయిలో నిలపాలన్నారు.

March 3, 2026 / 02:52 PM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే

కృష్ణా: పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన గొరిపర్తి బసవయ్య అనే లబ్ధిదారుడికి వైద్య ఖర్చులు నిమిత్తం మంజూరైన రూ. 1,79,000ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య చికిత్స నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.

March 3, 2026 / 02:52 PM IST

రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

కృష్ణా: పమిడిముక్కల మండలంలోని మామిళ్ళపల్లి గ్రామంలో రైతులకు 278 కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 19 నెలల కాలంలో రైతుల ప్రగతే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వం రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలను ముద్రించిందని విమర్శించారు.

March 3, 2026 / 02:51 PM IST

కూటమి ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ

CTR: విజయపురం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విజయపురం మండలంలోని గాండ్ల కండ్రిగ గ్రామంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు రమేష్ రాజుతో కలిసి మండల పరిషత్ అధ్యక్షులు లక్ష్మీపతి రాజు గారు పరిశీలించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించాలన్నారు.

March 3, 2026 / 02:50 PM IST