అక్టోబర్ ప్రారంభం కాకముందే ప్రభుత్వం దేశీయ సహజ వాయువు ధరలను పెంచింది. ఈ పెరుగుదల తర్వాత దేశీయ సహజ వాయువు ధర $8.60/MMBTU నుండి $9.20/mBtuకి పెరిగింది. కొత్త రేట్లు ఆదివారం అంటే అక్టోబర్ 1, 2023 నుండి అక్టోబర్ 31, 2023 వరకు వర్తిస్తాయని ప్రభుత్వం సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలక్టోరల్ బాండ్ల విక్రయం గురించి మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం(Chidambaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిని "చట్టబద్ధమైన లంచం"గా అభివర్ణించారు. తాజాగా అక్టోబర్ 4న మళ్లీ ఎలక్టోరల్ బాండ్ల విక్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇది బీజేపీకి "బంగారు పంట" అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
విదేశీ మారక నిల్వల్లో క్షీణత వరుసగా మూడో వారం కొనసాగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో విడుదల చేసిన డేటా ప్రకారం, గత వారం 2.33 బిలియన్ డాలర్ల క్షీణత నమోదైంది. గత వారం అంటే సెప్టెంబర్ 15తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు 593.03 బిలియన్ డాలర్లుగా ఉండగా ఇందులో కూడా 5 బిలియన్ డాలర్ల క్షీణత నమోదైంది.
నెట్ఫ్లిక్స్ మాదిరిగానే డిస్నీ కూడా తన విధానాన్ని మార్చుకుంది. ఈ ఏడాది జూలైలో నెట్ఫ్లిక్స్ భారతీయ వినియోగదారులు తమ ఇంటి వెలుపల తమ పాస్వర్డ్లను పంచుకోకుండా నిషేధించింది. ఇప్పుడు డిస్నీ కూడా నెట్ఫ్లిక్స్ బాటలో పయనిస్తోంది.
దేశంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. గత ఎనిమిది నెలల్లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో కొత్త ఇన్వెస్టర్ల నమోదు కోటికి చేరుకుంది.
మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అయితే ఇదే మంచి సమయం. ఎందుకంటే గత 10 రోజుల్లో పుత్తడి రేటు ఏకంగా 3 రూపాయలకుపైగా తగ్గింది. అయితే ఈరోజు గోల్డ్ రేటు ఎంత ఉంది సహా మరికొన్ని విషయాలను ఇప్పుడు చుద్దాం.
దేశంలోనే అతిపెద్ద పెయింట్స్ తయారీ సంస్థ ఏషియన్ పెయింట్స్ సహ వ్యవస్థాపకుడు 79 ఏళ్ల అశ్విన్ డానీ కన్నుమూశారు. అతను ఏషియన్ పెయింట్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని నిర్వహించాడు. కంపెనీ బోర్డు సభ్యుడు కూడా. ఏషియన్ పెయింట్స్లో అతని ప్రయాణం 1968లో ప్రారంభమైంది.
వరుసగా మరో రోజు స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది. ఎఫ్ఎంసిజి, ఐటి, బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్ ఫ్లాట్ అయింది. నేటి సెషన్లో మిడ్క్యాప్ స్టాక్లలో కూడా అమ్మకాలు కనిపించాయి.
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. బ్యాంకుల్లో తగిన సంఖ్యలో ఉద్యోగులను నియమించాలని, రెగ్యులర్ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ చేయడాన్ని నిరసిస్తూ బ్యాంకు యూనియన్లు సమ్మెకు దిగాయి.
ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో రైతులకు కేంద్రం డబ్బు అందజేస్తారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 14 విడతల లబ్ధిదారుల జాబితాను పంపగా ఈ విడత విడుదల కాకముందే వివిధ కారణాలతో చాలా మంది లబ్ధిదారులను పథకం నుంచి తప్పించారు.
వారం రోజుల క్రితమే బైజూస్ ఇండియా వ్యాపారాన్ని టేకోవర్ చేసిన అర్జున్ మోహన్.. కంపెనీ పరిస్థితిని చక్కదిద్దేందుకు పూర్తి ప్రణాళికను సిద్ధం చేశారు. సంస్థ పునర్వ్యవస్థీకరణలో ఉంది.
ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఎటువంటి జీతం తీసుకోరు. వరుసగా మూడు సంవత్సరాలుగా ఎటువంటి జీతం తీసుకోవడం లేదు. ఇప్పుడు అతని ముగ్గురు పిల్లలు కూడా అదే బాట పట్టారు.