• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

రూ.80,000 క్రాస్ చేసి, రికార్డ్ ధర పలికిన ఎండుమిర్చి

ఎండు మిర్చి బంగారంతో పోటీ పడటం కాదు.. బంగారాన్ని మించి ఒకటిన్నర రెట్లు పలికింది! మార్కెట్‌లో ఎండు మిర్చికి మంచి డిమాండ్ కనిపిస్తోంది. దిగుమతి తగ్గడం, పచ్చళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ఎండు మిర్చి రికార్డు ధర పలుకుతోంది. శుక్రవారం ఎనుమాముల మార్కెట్‌లో ఎండు మిర్చి ధర క్వింటాల్‌కు ఏకంగా రూ.80,100 పలికింది. అయితే అన్ని రకాల మిర్చికి ఈ ధర రాలేదు. పచ్చళ్లు, ఔషదాలలో వినియోగించే ఓ రకమైన మిర్చి ఆసియా అతిపెద...

January 6, 2023 / 09:33 PM IST

కోవిడ్ ఎఫెక్ట్, కుప్పకూలిన స్టాక్ మార్కెట్: ఫార్మా స్టాక్స్ పుంజుకుంటాయా?

ప్రపంచంతో పాటు భారత స్టాక్ మార్కెట్‌లో కరోనా భయాలు కమ్ముకున్నాయి. ఈ నెలలోనే 63,000 మార్కు పైకి చేరుకున్న సెన్సెక్స్ ఆ తర్వాత అంతర్జాతీయ పరిణామాలతో నష్టపోయాయి. ఆ తర్వాత కాస్త పుంజుకున్నట్లు కనిపించినప్పటికీ, చైనాలో కోవిడ్ బీఎఫ్ 7 వేరియంట్ ఆందోళనలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. నెల రోజుల క్రితం చైనాలో కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో రోజుకు వేలు, లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. జపాన్, అమెరికాలోను కేసులు...

December 24, 2022 / 06:17 PM IST

అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్లకు పైగా ఎన్పీఏల రైటాఫ్

బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాలలో రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను (NPA) రైటాఫ్ చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు. ఇందులో గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలోనే రూ.8.5 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్లు తెలిపారు. అలాగే, ఇదే కాలంలో పబ్లిక్ రంగ బ్యాంకులకు చెందిన ఒక లక్ష మూడువేల కోట్ల రైటాఫ్ లోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. నాలుగేళ్లు దాటిన మొండి బకాయిలను బ్యాంకులు ర...

December 13, 2022 / 08:19 PM IST

లాభాల్లో స్టాక్ మార్కెట్, ఈ స్టాక్స్ 10 శాతానికి పైగా లాభాల్లో ఉన్నాయి

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (డిసెంబర్ 8) స్వల్ప లాభాల్లో ప్రారంభమై, దాదాపు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఈ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. అయినప్పటికీ కాస్త ఫ్లాట్‌గానే కనిపిస్తోంది మార్కెట్. మొత్తానికి స్వల్ప లాభాల్లో ఉంది. మధ్యాహ్నం గం.11.40 సమయానికి సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి, 62,469 పాయి...

December 8, 2022 / 02:42 PM IST

వడ్డీ రేటు పెంచిన ఆర్బీఐ, మీ కారు, హోమ్ లోన్ ఈఎంఐ ఇక మరింత భారం

కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును పెంచింది. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటు. ఈ రెపో రేటు పెరిగితే, బ్యాంకులు తన కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ ద్వైపాక్షిక భేటీలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం మీడియాకు వివరించారు. రెపో రేటును 0.35 పాయింట్లు శాతం లేదా 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ...

December 7, 2022 / 12:09 PM IST

వడ్డీ రేటుపై ఆర్బీఐ నిర్ణయానికి ముందు అప్రమత్తంగా స్టాక్ మార్కెట్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిర్ణయానికి ముందు స్టాక్ మార్కెట్లు అప్రమత్తంగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు వరుసగా మూడు రోజుల పాటు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ నేడు స్వల్ప నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత కాసేపటికి స్వల్ప లాభాల్లోకి వచ్చింది. సోమవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశ నిర్ణయాలను నేడు (బుధవారం, డిసెంబర్ ) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించనున్నారు. ఈ ప్రకటనకు ముందు మా...

December 7, 2022 / 12:03 PM IST

జగన్ ప్రభుత్వానికి షాక్, వేతనాలు లేక ఉద్యోగుల ఆందోళన

అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సహా వివిధ రూపాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన దాదాపు రూ.1000 కోట్లను బకాయిల కింద వెనక్కి తీసుకున్నది. నవంబర్ 25వ తేదీన కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ మొత్తం రూ.17,000 కోట్లలో ఆంధ్రప్రదేశ్ వాటా 682 కోట్లను విడుదల చేసింది. ఇతర కేటాయింపుల కింద ఈ వారం మరో రూ.300 కోట్లు ఇచ్చింది. మొత్తం రూ.982 కోట్...

December 7, 2022 / 11:57 AM IST

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, ఆర్బీఐ భేటీ సహా కారణాలివే

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. నిన్న స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్, నేడు అంతకుమించి నష్టపోయింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు మరికొంతకాలం కొనసాగించనుందనే వార్తల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇలా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, బుధవారం ఆర్బీఐ రెపో రేటు సహా ఇతర నిర్ణయాలు, వివిధ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మా...

December 6, 2022 / 06:43 PM IST

ఈసారి వడ్డీ రేటు పెంపు ఎంత ఉండవచ్చునంటే?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైమాస సమీక్ష సమావేశం(MPC) సోమవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు MPC అనంతరం బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రెపో రేటును వరుసగా పెంచుకుంటూ రావడంతో ఇప్పటికే 190 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఈసారి కాస్త తగ్గించి 35 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అం...

December 6, 2022 / 06:34 PM IST

అతి తక్కువ ధరకే జియో బుక్ ల్యాప్ టాప్(jiobook laptop)….!

రిలయన్స్ జియో తన తొలి ల్యాప్ టాప్ ను విడుదల చేసింది. జియో బుక్(jiobook laptop) పేరిట అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ల్యాప్ టాప్ రూ.15వేలకే అందుబాటులోకి వస్తుండటం గమనార్హం. అతి తక్కువ ధరకే ఈ ల్యాప్ టాప్ ని అందుబాటులోకి తీసుకు రావడం గమనార్హం. రిలయన్స్‌ జియో ఇటీవల ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ (ఈఎంసీ) ఈవెంట్‌ వేదికగా ఈ ల్యాప్‌టాప్‌ను లాంఛ్‌ చేయగా తొలుత ప్రభుత్వ అధికారులకు అందుబాటులో ఉండగా తాజాగా విని...

October 21, 2022 / 05:24 PM IST

భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు…1,190 పాయింట్లు వృద్ధి

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం(అక్టోబర్ 4న) భారీ లాభాలతో మొదలయ్యాయి. BSE సెన్సెక్స్ ఒకదశలో 1,191 పాయింట్లు పెరుగగా.. NSE నిఫ్టీ 345 పాయింట్లు వృద్ధి చెందింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా వరుసగా 979, 533 పాయింట్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూల ధోరణులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సోమవారం ఆసియా, అమెరికా మార్కెట్లు పుంజుక...

October 4, 2022 / 11:47 AM IST

రేపు దేశంలో5జీ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనున్న మోదీ…!

ప్రధాని నరేంద్రమోదీ.. దేశంలో రేపు 5జీ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనున్నారు. 5జీ సేవలు మొట్ట మొదట ఏ ఏ ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయనే విషయంలో స్పష్టం లేదు. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముందు కొన్ని నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని ఆ తర్వాత నెమ్మదిగా కొన్నేళ్లకు దేశ వ్యాప్తంగా అన్ని నగరాలకు విస్తరిస్తుందని ప్రభుత్వ సమాచార విభాగం PIB ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్రమోడీ స్వాతం...

September 30, 2022 / 06:18 PM IST

ఇన్ స్టాగ్రామ్ లో న్యూ ఫీచర్… అమ్మాయిల కోసమే…!

ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్ ఇన్ స్టాగ్రామ్ గురించి తెలియని వారుండరు. ఈ రోజుల్లో  ప్రతి ఒక్కరూ ఈ యాప్ ని వాడేవారే. ఈ యాప్ లో రీల్స్ చేసి పాపులారిటీ తెచ్చుకున్నవారు చాలా మందే ఉన్నారు. దీని వల్ల లాభం ఎంత ఉందో… సమస్యలు ఎదుర్కున్నవారు కూడా అంతే ఉన్నారు. ఈ యాప్ లో మెసేజ్ సెక్షన్లో లైంగిక, అసభ్యకరమైన ఫొటోలతో యూజర్లు ఇబ్బంది పడుతున్నవారు చాలా మందే ఉన్నారు. దీనికి చెక్ పెట్టేందుకు.. […]

September 27, 2022 / 07:06 PM IST

రైల్వే ప్రయాణికులకు ఫ్రీ మీల్స్… బట్ కండీషన్స్ అప్లై..!

ఇక నుంచి రైలులో ప్రయాణించేవారికి ఉచితంగా మీల్స్ అందించనున్నామని భారత రైల్వే శాఖ పేర్కొంది. రాజధాని, శతాబ్ధి, దరంతో వంటి ప్రీమియం ట్రైన్స్లో ఫ్రీ మీల్స్ అందిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. కానీ… కండిషన్స్ అప్లై అంటూ మెలిక పెట్టింది. ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే…రైలు.. 2 గంటలకు మించి ఆలస్యమైతేనే ప్రయాణికులకు ఫ్రీ మీల్స్ ఇస్తామని చెప్పడం గమనార్హం. ఆలస్యానికి కారణమేదైనా సరే.. ఉచితంగా భోజనం కల...

September 12, 2022 / 06:01 PM IST

సైరస్ మిస్త్రీ మరణానికి అసలు కారణం ఇదేనా..?

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ… ఆదివారం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా… ఆయన మరణంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా… ఈ దర్యాప్తులో షాకిం్ విషయాలను పోలీసులు వెల్లడించారు. టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న లగ్జరీ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో… కారులో వెనక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీ…. ప్రాణాలు కోల్పోయా...

September 7, 2022 / 04:10 PM IST