అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 నేడు (అక్టోబర్ 8న) ప్రారంభమైంది. అయితే ప్రైమ్ మెంబర్ల కోసం అక్టోబర్ 7వ తేదీన అర్ధరాత్రి నుంచే సేల్ ప్రక్రియ మొదలైంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి అనేక ఆర్డర్లపై భారీ డిస్కౌంట్ రేట్లను ప్రకటించారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ఈ ఏడాది ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 8వ తేదీన మొదలు కాగా..అక్టోబర్ 15 వరకు కొనసాగనుంది. మొబైల్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ సహా అనేక రకాల ఉత్పత్తులపై కొన్ని అదిరిపోయే డిస్కౌంట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అవెంటో ఓసారి లుక్కేయండి మరి.
టెలికామ్ సంస్థలు అన్ని తమ ప్యాకేజీలను యూజర్లకోసం అప్డేడ్ చేస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించే పనిలో భాగంగా ఓటీటీ ప్లాట్ ఫామ్లను అందిస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ ఐడీయా కూడా ఇదే తరహా ప్లాన్ను అందిస్తోంది.
పండుగల కంటే ముందే ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు జీఎస్టీ కౌన్సిల్ అనేక చర్యలు చేపట్టింది. ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో బెల్లం సహా పలు ఉత్పత్తులపై జిఎస్టి రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పండుగల సీజన్కు ముందు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక విషయం చెప్పింది. ఇకపై ప్రజలు రుణాలు తీసుకోవడం కష్టతరం చేయనుంది. దేశంలో వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి ధోరణిపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక రకాల చిన్న పొదుపు పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో ఒకదాని పేరే పబ్లిక్ ప్రావిడెంట్ స్కీమ్ (PPF). ఈ పథకం కింద పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 15 సంవత్సరాల వ్యవధిలో భారీ నిధులను పొందవచ్చు.
ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరించే అమెరికా ఈ ఏడాదిలో తీవ్ర ఆర్థికమాంద్యమాన్ని ఎదుర్కొబోతోంది అని ప్రముఖ ఎకనామిస్ట్ నీలకంఠ మిశ్రా తెలిపారు. యూఎస్ఏ వలన భారతదేశానికి చాల నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.
OnePlus నుంచి అదిరిపోయే కలర్లలో 5జీ మోడల్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. రెడ్ కలర్ తోపాటు సిల్వర్, సోనిక్ బ్లాక్ కలర్లలో ఉన్న ఈ ఫోన్ ఫీచర్లు, ధరలు ఎంటో ఇప్పుడు చుద్దాం. రేపటి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా వీటి సేల్ మొదలు కానుంది.
ధోనీకి ఇప్పటికే చాలా కంపెనీలతో అనుబంధం ఉంది. ధోనీని జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్గా చేయడం గురించి రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్లు కంపెనీ తెలిపింది.
ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వేస్ అభిమానులకు పెద్ద ఊరటనిచ్చింది. అక్టోబర్ 14న అహ్మదాబాద్కు ప్రత్యేక రైలును నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.
జర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల సమావేశం ముగిసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కీలక నిర్ణయాలను తెలియజేశారు. ఈ ఎంపీసీ సమావేశంలో రెపో రేటుతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలలో బుల్లెట్ చెల్లింపు పథకంలో మార్పులు కూడా ఉన్నాయి.
ప్రముఖ పిజ్జా చైన్ డొమినోస్ తన పెద్ద పిజ్జా శ్రేణి ధరను తగ్గించింది. కంపెనీ నాన్ వెజ్, వెజ్ కేటగిరీలు రెండింటిలోనూ పెద్ద పిజ్జాల రేట్లను సగానికి తగ్గించింది.
భారతీయ బ్యాంకులు ఆన్లైన్ లావాదేవీల ద్వారా 64 బిలియన్ డాలర్లు అంటే రూ. 5 లక్షల కోట్లు ఆర్జించాయి. ఆన్లైన్ లావాదేవీలు జరుపుతున్న ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది.