• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

వరంగల్లో ఫిబ్రవరి చివరి నాటికి..మరో ఐటీ కంపెనీ యూనిట్ షురూ!

  తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద సిటీ అయిన వరంగల్లో ఐటీ కంపెనీలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓరుగల్లులో ఇప్పటికే మూడుకుపైగా ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సంస్థలను ఏర్పాటు చేశాయి. తాజాగా మరో సంస్థ అయిన ఎల్టీఐ మైం డ్ ట్రీ(LTI mindtree) ఈ నెలాఖరు నాటికి తమ డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్లో మంత్రి ...

February 8, 2023 / 07:54 AM IST

అదానీ ప్రభావం బ్యాంకుల మీద అంతగా ఉండదు: రేటింగ్ ఏజెన్సీలు

హిండెన్ బర్గ్ వ్యవహారం నేపథ్యంలో అదానీ గ్రూప్ కకావికలమవుతోంది. ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. ఈ వారం పది రోజుల్లోనే షేర్లు మూడింతలు నష్టపోయాయి. దీంతో గౌతమ్ అదానీ సంపద లక్షల కోట్లు కరిగిపోయింది. ఈ వ్యవహారం పార్లమెంటును కూడా కుదిపేస్తోంది. అదే సమయంలో హిండెన్ బర్గ్ విశ్వసనీయత పైన కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు మరో విషయాన్ని వెల్లడించాయి. అదానీ గ్రూప్‌కు రుణాల...

February 7, 2023 / 09:09 PM IST

పెండింగ్ బకాయిలు చెల్లిస్తాం… ఏపీకి నిర్మలా సీతారామన్ హామీ..!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ బడ్జెట్ లో ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలను అందిస్తామని  నిర్మలా సీతారామన్ చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి పంపవలసిన రూ. 689 కోట్ల రూపాయల నిధులు పె‌డింగ్‌లో ఉన్నాయని, ఆ సొమ్మును పరిహార నిధి నుంచి త్వరలోనే చెల్లిస్తామని కేంద్ర నిర్మలా సీతారామన్ హమీ ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల చెల్ల...

February 7, 2023 / 06:16 PM IST

రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభవార్త.. వాట్సాప్‌ నుంచి ఆ సేవలు

రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైల్వే ప్రయాణికులు తమ వాట్సాప్ నంబర్ ద్వారా తమకు ఇష్టమైన, రుచికరమైన భోజనాన్ని ఆర్డర్ పెట్టొచ్చు. ఇంట‌రాక్టివ్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌-ఎనేబుల్డ్ చాట్‌బోట్‌ను ఇందుకోసం రైల్వే అందుబాటులోకి తెస్తోంది. ఈ చాట్‌బోట్‌పై ప్ర‌యాణికులు ఈ-కేట‌రింగ్‌, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేసి తమకు నచ్చిన ఆహారాన్ని...

February 6, 2023 / 10:03 PM IST

6,500 మంది ఉద్యోగులను తొలగించనున్న డెల్

టెక్ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకునేందుకు వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ప్రముఖ టెక్ కంపెనీలు అయిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, బైజూస్, పేపాల్, స్పాటిఫై వంటి సంస్థలు ఇప్పటికే తమ సంస్థల్లోని ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. తాజాగా ఈ జాబితాలోకి కంప్యూటర్ల తయారీ దిగ్గజం డెల్ కూడా చేరిపోయింది. తమ సంస్థలో 6500 మంది ఉద్యో...

February 6, 2023 / 09:36 PM IST

అదానీ షేర్ల క్రాష్ పై నిర్మల సీతారామన్ ఏమన్నారంటే…

హిండేన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత అదానీ షేర్లు భారీగా కుప్పకూలుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న అదానీ గ్రూప్ వ్యవహారం ప్రభావం భారత దేశ ఆర్థిక భావ చిత్రంపై, స్థూల ఆర్థిక వ్యవస్థ మౌలికాంశాలపై ఏమాత్రం ఉండదని చెప్పారు. అదానీ గ్రూప్ పబ్లిక్ ఆఫర్ ఉపసంహరణ పైన కూడా పరోక్షంగా స్పందించారు. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫ...

February 4, 2023 / 09:36 PM IST

పది రోజుల్లోనే లక్షల కోట్ల అదానీ సంపద ఆవిరి

అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ అనే షార్ట్ సెల్లర్ సంస్ద రూపొందించిన నివేదిక కారణంగా భారత బిలియనీర్ గౌతమ్ ఆదానీ ఇబ్బందుల్లో పడ్డారు. ఆదానీ సంస్దలకు చెందిన స్టాక్స్ అన్నీ మార్కెట్ లో భారీ పతనం అవుతున్నాయి. ఈ కారణంగా ఆదానీ సంపద ఆవిరవుతునే ఉంది. ఈ నివేదిక వెలువడిన పది రోజుల్లోనే అదానీ గ్రూప్ కంపెనీలు ఏకంగా 118 బిలియన్ డాలర్లు నష్టపోయింది. భారత కరెన్సీలో ఇది రూ. 9.73 లక్షల కోట్లు. అదానీ [&h...

February 4, 2023 / 12:51 PM IST

21వ స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ

ప్రపంచ కుబేరుడు, భారత వ్యాపారవేత్త అయిన గౌతమ్ అదానీ ఆస్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తి అయిన అదానీ తాజాగా బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 21వ స్థానానికి పడిపోయాడు. గత రెండు వారాలుగా గౌతమ్ అదానీ కంపెనీ షేర్లలో నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యనే భారతదేశపు బడా వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ ఇండియాలో అత్యంత ధనవంతుడయ్యాడు. ఆస్తుల పరంగా చూస్తే అదానీ వెనకంజల...

February 3, 2023 / 03:02 PM IST

అదానీ గ్రూప్ సంపద నెలరోజుల్లో 76% పతనం

హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు కుప్పకూలుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్‌లో అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ శుక్రవారం ఏకంగా 15 శాతానికి పైగా నష్టపోయింది. సరిగ్గా నెల రోజుల క్రితం రూ.4000కు సమీపంలో ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు రూ.1330 వద్ద ట్రేడ్ అవుతోంది. నెల రోజుల్లో 65 శాతానికి పైగా, గత వారం రోజుల్లో 56 శాతానికి పైగా కుప్పకూలింది. ఉదయం గం.11 సమయంలో ఓసారి రూ.1000 స్థాయి...

February 3, 2023 / 01:28 PM IST

పేదల గురించి రెండుసార్లే ప్రస్తావించారు: బడ్జెట్‌పై చిదంబరం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో కేవలం రెండుసార్లు మాత్రమే పేదల ప్రస్తావన తెచ్చారన్నారు. ప్రజలు, వారి ఆందోళనలను ఏమాత్రం మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఏ మాత్రం కనికరం లేని బడ్జెట్ ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారన్నారు. 90 నిమిషాల ప్రసంగంలో నిరు...

February 2, 2023 / 07:21 AM IST

ఆదాయపు పన్ను ఊరట, మీరు ఎంత డబ్బు సేవ్ చేస్తారు?

ఆదాయపు పన్నుకు సంబంధించి 2023-24 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరటను ఇచ్చారు. ప్రస్తుతం కొత్త, పాత పన్ను విధానాలు ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో గతంలో రూ.5 లక్షలు ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. పాత పన్ను విధానంలో మార్పులేదు. కొత్త పన్ను విధానంలో రూ.15 లక్షల ఆదాయం దాటితే గరిష్టంగా 30 శాతం పన్ను రేటు విధిస్తారు. పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమ...

February 1, 2023 / 03:45 PM IST

బడ్జెట్ ఎఫెక్ట్: అదరగొట్టిన స్టాక్ మార్కెట్.. కానీ

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. బడ్జెట్ ఇన్వెస్టర్లకు సంతృప్తిని ఇచ్చింది. 2024లో లోకసభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న పూర్తి బడ్జెట్ కాబట్టి ఎన్నో తాయిలాలు ఉంటాయనే అంచనాలతో మార్కెట్లు ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రసంగం సమయంలో అంతకంతకూ పైకి చేరింది. ప్రసంగం అనంతరం సూచీలు నెమ్మదించాయి. బడ్జెట్ నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 450 ...

February 1, 2023 / 02:32 PM IST

SSMB28 కోసం దిల్ రాజు భారీ ఆఫర్, OTT రైట్స్ 80 కోట్లు

మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా సినిమాలు ప్రారంభమైతే చాలు బిజినెస్ లెక్కలు ప్రారంభమవుతున్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం పెద్ద పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి. ఓటిటిలు స్టార్ హీరోల సినిమాలకు భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి. మహేష్ బాబు… త్రివిక్రమ్ SSMB28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అప్పుడే బయ్యర...

January 31, 2023 / 06:03 PM IST

టాప్-10 ధనవంతుల లిస్ట్ నుంచి అదానీ ఔట్

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రపంచ ధనవంతుల జాబితా నుంచి చోటును కోల్పోయారు. వ్యాపార దిగ్గజం అయిన అదానీ ప్రముఖ వ్యాపారవేత్త అంబానీతో పోటీపడుతున్నారు. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు అదానీ అధినేతగా ఉన్నారు. సోలార్, థర్మల్ విద్యుత్తు తయారీ, రవాణా, ఓడరేవుల నిర్వహణ వంటి వ్యాపారాలో అధానీ దూసుకుపోతున్నారు. పలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్ 10లో అదానీ కొనసాగుతున్నారు. అయ...

January 31, 2023 / 12:14 PM IST

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

గత రెండు రోజుల నుంచి నష్టాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు నేడు లాభాల బాట పడ్డాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170 పాయింట్లు లాభపడి 59,500 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ కూడా 45 పాయింట్లు పెరిగి 17,649కు చేరింది. ఐటీ, టెక్, టెలికామ్ సంస్థలు లాభాలతో మార్కెట్లను నడిపించాయి. ఇదిలా ఉండగా నేడు అదానీ గ్రూపు షేర్లు మరోసారి పతనం అయ్యాయి. గత రెండు రోజులుగా అదానీ గ్రూపు షేర్లు పతనం అవు...

January 31, 2023 / 12:21 PM IST