KDP: మైదుకూరు బాల శివ యోగేంద్ర జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ నందు మైదుకూరు అర్బన్ ఎస్సై సుబ్బారావు విద్యార్థినీలకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్త్రీల పట్ల జరిగే నేరాలు, ఫోక్సో, గృహహింసలపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో ఎలా ఉపయోగించాలో వివరించారు.
సత్యసాయి: పెనుకొండ మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కేశవరావు సోమవారం తెలిపారు. కామర్స్, గణిత శాస్త్రం, వృక్షశాస్త్రం, చరిత్ర సబ్జెక్టులలో బోధించుటకు అతిథి అధ్యాపకులు కావాలన్నారు. సంబంధిత సబ్జెక్టులలో పోస్టు గ్రాడ్యుయేషన్ 55% ఉత్తీర్ణత కలిగిన వారు ఈ నెల 6లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు.
సత్యసాయి: కదిరి STSN ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్, వృక్షశాస్త్ర విభాగాల్లో రెండు అతిథి అధ్యాపకుల ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. ఎస్. స్మిత తెలిపారు. పీజీలో 55 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం) అర్హతగా ఉండాలని, అభ్యర్థులు సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలలో హాజరు కావాలని సూచించారు.
AP: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, Asst. బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల పరీక్ష 7న జరగనుంది. ఆఫ్లైన్ విధానం, ABCD సిరీస్లలో ప్రశ్నాపత్రం ఇస్తారు. తప్పులు లేకుండా OMR షీట్ నింపాలి. తప్పులు చేస్తే OMR షీట్ ఇన్వాలిడ్ అవుతుంది. కొట్టివేతలు కనిపించొద్దు. ఒకవేళ కనిపిస్తే ట్యాంపరింగ్ అయినట్లు భావిస్తారు. ఈ పరీక్షలో కూడా నెగిటివ్ మార్కులు ఉంటాయని అధికారులు సూచించారు.
గతవారం నష్టాల బాట పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో కళకళలాడాయి. సెన్సెక్స్ 554.84 పాయింట్లు లాభపడి 80,364.49 వద్ద ముగిసింది. నిఫ్టీ 198.20 పాయింట్లు పెరిగి 24,625.05 వద్ద స్థిరపడింది. ఆటోమొబైల్, ఐటీ, లోహ రంగ సూచీలు రాణించాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి 88.20 వద్ద ఆల్టైం కనిష్ఠ స్థాయిలో ముగిసింది.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆఫీసర్ స్కేల్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాంతీయ బ్యాంకులలో 13,217 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 21 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆఫీసర్ స్కేల్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాంతీయ బ్యాంకులలో 13,217 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు https://www.ibps.in/wp-content/uploads/CRP-RRBs-XIV ద్వారా తెలుసుకోవచ్చు.
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) భారత్లో రికార్డు సృష్టించింది. తొలిసారిగా ఒకే నెలలో 20 బిలియన్ల (రూ.2 వేల కోట్లు) లావాదేవీల మార్కును దాటింది. ఆగస్టుకు సంబంధించిన గణాంకాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసింది. కిరాణా సామాను, రుణాల వసూళ్లు వంటి విభాగాల్లో UPI వాడకం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఇవాళ మరోసారి గోల్డ్ ధరలు భగ్గుమన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.850 పెరిగి రూ.97,050లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.930 పెరిగి రూ.1,05,880 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,36,000గా ఉంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలను రుణాల ద్వారా తీసుకుని ఎగ్గొట్టి బెల్జియంకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని పోలీసులు అరెస్ట్ చేశారు. తను అరెస్టుని బెల్జియం కోర్టులో సవాల్ చేయగా.. న్యాయస్థానం తిరస్కరించింది. బెయిల్ విషయమై తాజాగా మరోసారి కోర్టును ఆశ్రయించగా నిరాశే ఎదురైంది. మరోవైపు సదరు వ్యాపారీని స్వదేశానికి తీసుకువచ్చేందుకు CBI బృందం చర్యలు చేపట్టింది.
TG: టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ (TTC) పరీక్షల ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం తాజాగా ప్రకటించింది. మొత్తం 3,202 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,173 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 3,131 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 98.68%గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ http://www.bse.telangana.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు.
VKB: పెద్దేముల్ పరిధిలోని గొట్లపల్లి ఆదర్శ పాఠశాలలో మిగిలిన సీట్లకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గాయత్రీ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్ మొదటి సంవత్సరంలో MPC, BIPC, CEC, MEC సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు కళాశాలను సంప్రదించాలని సూచించారు.
AP: అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయిన విషయం తెలిసిందే. తాజాగా, హాల్ టికెట్లు విడుదలయ్యాయి. బీట్ ఆఫీసర్, Asst. బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://portal-psc.ap.gov.in ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని APPSC తెలిపింది.
HYD: Ed.CET-2025 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమైనట్లు HYD ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 2 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్నవారు సర్టిఫికెట్ వెరిఫికేషన్లో పాల్గొనాల్సిన అవసరం లేదని, డైరెక్ట్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు అప్లికేషన్లు కోరుతోంది. ఆయా పోస్టులకు డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. సెప్టెంబర్ 4న ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు PGIMER.EDU.IN వెబ్ సైట్లో సంప్రదించగలరు.