TG: వైద్యారోగ్యశాఖలో 633 ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అక్టోబర్ 5 నుంచి 21వ తేదీ సా.5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో పొరపాట్లు ఉంటే అక్టోబర్ 23 నుంచి 24 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసే అవకాశం కల్పించారు. నవంబర్ 30న CBT పద్దతిలో పర...
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈనెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్పై బంపర్ ఆఫర్ అందుబాటులోకి రాబోతోంది. ఈ సేల్లో వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ను కొనే వారికి రూ.1,599 విలువైన వన్ ప్లస్ నార్డ్ 2r బడ్స్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు అమెజాన్ పేర్కొంది. బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ పోను రూ.16,999 అమెజాన్ సేల్లో వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ […]
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈనెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్పై బంపర్ ఆఫర్ అందుబాటులోకి రాబోతోంది. ఈ సేల్లో వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ను కొనే వారికి రూ.1,599 విలువైన వన్ ప్లస్ నార్డ్ 2r బడ్స్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు అమెజాన్ పేర్కొంది. బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ పోను రూ.16,999 అమెజాన్ సేల్లో వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ […]
TG: రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మండలానికి ఒక మండల విద్యాశాఖ అధికారిని నియమించింది. 609 మండలాలకు ఇన్ఛార్జ్ ఎంఈవోలను నియమించింది. మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం 632 మండలాలకు గానూ అందులో 16 మండలాల్లో రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు.
TG: రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మండలానికి ఒక మండల విద్యాశాఖ అధికారిని నియమించింది. 609 మండలాలకు ఇన్ఛార్జ్ ఎంఈవోలను నియమించింది. మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం 632 మండలాలకు గానూ అందులో 16 మండలాల్లో రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 130.92 పాయింట్ల నష్టంతో 84,797.69 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 22.80 పాయింట్లు కుంగి 25,916.20 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.56గా ఉంది.
సంచార జాతులకు చెందిన విద్యార్థులకు నూరు శాతం ఆర్థిక సహాయానికి కేంద్రప్రభుత్వం పీఎం యశస్వి పథకం కింద ప్రత్యేక స్కాలర్ షిప్ అందిస్తోంది. దేశంలోని ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ, ఎన్ఐటీలు తదితర ప్రీమియర్ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు 2024-25 ఏడాదికి 304 విద్యా సంస్థల్లో ఉపకారవేతనాల స్లాట్లను కేంద్ర సామాజిక న్యాయశాఖ ప్రకటించింది.
AP: అక్టోబరు 3 నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. అక్టోబర్ 11, 12 తేదీలు మినహా.. 3 నుంచి 21వ తేదీ వరకు టెట్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు 2,84,309 అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. రాష్ట్రంలో పరీక్ష కేంద్రాల కొరత కారణంగా పక్క రాష్ట్రాల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ప్లాంటు ఏర్పాటు యోచనలో ఉంది. ఇందుకోసం కంపెనీ మహారాష్ట్రలోని చకన్ కు సమీపంలో స్థల సేకరణలో నిమగ్నమైనట్లు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్ ఫామ్ అయిన న్యూ ప్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేస్తారు.
SKLM: ఏపీ పీజీ సెట్-2024 రెండో విడత కౌన్సిలింగ్కు సంబంధించి సోమవారం నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్లో ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. 26న మార్పునకు అధికారులు అవకాశం కల్పించారు. కాగా శ్రీకాకుళం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 562 సీట్లకు గాను ఈ కౌన్సిలింగ్కు 303 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఒంగోలు: స్థానిక త్రోవగుంట ఐఎల్డీడీ వద్ద గల శ్రీ శివ సాయి ఐటీఐలో మంగళవారం ఉదయం పది గంటలకు జాబ్ మేళా జరుగుతుందని కరస్పాండెంట్ కారుమూడి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. దివి లేబరేట రీస్ వారు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, బీఎస్సీ, బీఫార్మశీ, ఎం.ఫార్మశీ విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ధరలను తగ్గించటం కోసం ప్రభుత్వం వద్ద ఉన్న 4.7 లక్షల టన్నుల ఉల్లిపాయలను ప్రధాన నగరాల్లో హోల్సేల్ ధరలకు విక్రయించాలని నిర్ణయించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా సబ్బిడీ ద్వారా కేజీ ఉల్లిని రూ.35కు అమ్మాలని భావిస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖారే పేర్కొన్నారు. ఉల్లి ఎగుమతులపై సుంకాన్ని ఎత్తి వే...
VSP: విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయం ఆవరణలో ఈనెల 27న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా సబ్ రీజినల్ ఎంప్లాయిమెంట్ అధికారి శ్యాంసుందర్ తెలిపారు. వివిధ కంపెనీల్లో 250 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ ఉత్తీర్ణులైన వారు అర్హులుగా పేర్కొన్నారు. వయసు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలన్నారు.
VZM: గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి ప్రభుత్వ ఐటీఐలో 4వ విడత మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ తెలిపారు. ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మోటారు మెకానిక్, కోపా, డ్రస్ మేకింగ్ సీట్లకు ఈనెల 26లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన ప్లాగ్షిప్ మోడల్ ఎస్24 సిరీస్పై భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. ఈ సిరీస్ ఫోన్లపై ఏకంగా 15-35 శాతం మేర ధరలను తగ్గించింది. ఈ డిస్కౌంట్లు ఈ నెల 26 నుంచి ఫ్లిప్కార్టులో అందుబాటులోకి రానున్నాయి. ఈ ధరల తగ్గింపుతో ఎస్24 ఫోన్.. యాపిల్ 16 కంటే రూ.20 వేలు తక్కువకే లభిస్తుంది. అంతేకాకుండా క్రెడిట్ కార్డులు, ఎక్స్ఛేంజ్ డీల్ ద్వారా మరింత తక్కువకే ఈ సిర...