దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 56.19 పాయింట్ల నష్టంతో 84,857.85 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 16.10 పాయింట్లు కుంగి 25,924.30 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.58గా ఉంది.
SRPT: ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో గంటల ప్రతిపాదన ఫిజిక్స్ బోధించుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను మోడల్ స్కూల్లో బోధించడానికి ఎంఎస్సీ, బీఈడీ విద్యార్హత ఉన్నవారు సంబంధించిన సర్టిఫికెట్లతో ఈ నెల 26 తేదీలోగా మోడల్ స్కూల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
MDK: అక్కెనపల్లి ఆదర్శ పాఠశాలలో గంటల ప్రాతిపాదికన బోధించేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జానయ్య తెలిపారు. పీజీటీ విభాగంలో జంతు శాస్త్రం, భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రం, పౌర శాస్త్రం, గణితం ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 26లోపు పాఠశాలలో ధ్రువపత్రాలను అందజేయాలని సూచించారు.
NLR: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయిమెంట్ కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా ఈనెల 27న వెంకటేశ్వరపురం ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు, ఐటీఐ, డిప్లమో చదివినవారు అర్హులన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ- ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడప్- ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 కంపెనీలతో.. మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారులు భరద్వాజ్, రవితేజ తెలిపారు. 10వ తరగతి నుంచి ఏదైనా పీజీ పూర్తి చేసి, 18-35 ఏళ్లలోపు యువతీ, యువకులు అర్హులన్నారు.
TG: రాష్ట్రంలో ఉపాధి కల్పించే ప్రయత్నాల్లో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీమా రంగాల్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే కోర్సులు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఇవాళ CM రేవంత్రెడ్డి చేతుల మీదుగా కోర్సులను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 38 కాలేజీల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 10 వేల మంది విద్య...
TG: హైదరాబాద్లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,360, అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,000 ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ.98,000 ఉంది.
VSP: ఈ నెల 26,27 తేదీల్లో విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. మళ్లీ 30వ తేదీన నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.వి. శేషమ్మ తెలిపారు. ఆఫీసు అసిస్టెంట్ (3), రిసెప్షనిస్ట్కమ్ – డేటా ఎంట్రీ ఆపరేటర్ (1) ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
TG: MBBS, BDS ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. రేపటి నుంచి మొదటి విడత అడ్మిషన్ల వెబ్ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. కన్వీనర్ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకున్న 16,679 మంది విద్యార్థుల ప్రాథమిక జాబితాను నిన్న కాళోజీ హెల్త్ వర్సిటీ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఇవాళ సా.5లోపు తెలుపాలని వీసీ పేర్కొన్నారు. అభ్యంతరాలు పరిశీలించి రేపు తుది జాబితాను విడుదల చేసి, అదేరోజు వెబ్ ఆప్షన్ల ...
VZM: రెవిన్యూ శాఖలో వివిధ క్యాడర్లకు చెందిన 462 మందిని బదిలీ చేస్తూ విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.మొత్తం 462 పోస్టులకు బదిలీ జరిగింది.బదిలీలు జరిగిన వాటిలో MRO-1, DT -69, సీనియర్ అసిస్టెంట్-50, జూనియర్ అసిస్టెంట్-21, వీఆర్వో గ్రేడ్ I -238, వీఆర్వో గ్రేడ్ II-81, రికార్డ్ ఆసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ ఒక్కొక్క పోస్టు ఉన్నాయన్నారు .
VSP: కంచరపాలెం ప్రభుత్వ ఓల్డ్ ఐటీఐలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో ఫిట్టర్ వెల్డర్ ఎలక్ట్రీషియన్ మెకానికల్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి అప్రెంటిస్ షిప్ పూర్తి చేసిన అభ్యర్థులు జాబ్ మేళాకు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.
VSP: విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయం ఆవరణలో ఈనెల 27న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా సబ్ రీజినల్ ఎంప్లాయిమెంట్ అధికారి శ్యాంసుందర్ తెలిపారు. వివిధ కంపెనీల్లో 250 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ ఉత్తీర్ణులైన వారు అర్హులుగా పేర్కొన్నారు. వయసు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలన్నారు.
VSP: ఏయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పీజీ డిప్లమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సంచాలకులు డి.ఏ నాయుడు తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన వారు అక్టోబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రముఖ గాయని పీ సుశీలకు ‘కలైజ్ఞర్ స్మారక కళా విభాగం స్పెషలిస్ట్’ అవార్డును తమిళనాడు సర్కార్ ప్రకటించింది. దివంగత DMK అధినేత కరుణానిధి పేరిట తమిళనాడు సర్కార్ తమిళాభివృద్ధి విభాగం నేతృత్వంలో కలైజ్ఞర్ నినైవు కళై తురై విత్తగర్ అవార్డును ప్రదానం చేయడానికి 2022లో నిర్ణయించారు. మొదటి అవార్డు తిరువారూర్ ఆరూర్దాస్కు దక్కింది. ఈనెల 30న సీఎం స్టాలిన్ చేతులమీ...
TG: వైద్యారోగ్యశాఖలో 633 ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అక్టోబర్ 5 నుంచి 21వ తేదీ సా.5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో పొరపాట్లు ఉంటే అక్టోబర్ 23 నుంచి 24 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసే అవకాశం కల్పించారు. నవంబర్ 30న CBT పద్దతిలో పర...