త్వరలోనే ముడి చమురు ధరలు తగ్గొచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో చమురు సంస్థ మార్జిన్లు బాగా పెరిగాయంది. కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.2-3 చొప్పున తగ్గించేందుకు వీలుందని పేర్కొంది. కాగా.. ఈ ఏడాది మార్చిలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2 చొప్పున తగ్గించారు. అప్పటి నుంచి వీటి ధరల్లో మార్పు లేదు.
TG: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అమెరికాలో పర్యటనలో బిజీగా ఉన్నారు. నెవాడా, ఆరిజోనా పర్యటనలో భాగంగా హూవర్ డ్యామ్ను సందర్శించారు. లాస్ వెగాస్లో మైనింగ్ ఎగ్జిబిషన్లోని ఆధునిక యంత్ర పరికరాలను పరిశీలించారు. సంబంధిత కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. కాగా, మరో వారం రోజుల పాటు అమెరికాలోనే భట్టి పర్యటించనున్నారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మెటా AIలో మూడు సరికొత్త ఫీచర్లను జోడించింది. AI సంభాషణల్ని మరింత మెరుగుపరచడం కోసం రియల్ టైం కన్వర్జేషన్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అలాగే ఫొటోలను నచ్చినట్లుగా తీర్చిదిద్దే ఫీచర్లను కూడా జోడించింది. వీటితో పాటు ఫొటోతో సెర్చ్ చేసి.. అందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు కొత్త ఫీచర్లకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్ తన బ్లాగ్పోస...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వార్షిక లాభాన్ని రూ.లక్ష కోట్లకు చేర్చాలనే లక్ష్యంతో ఉన్నామని బ్యాంక్ ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. ఈ ఘనతను రానున్న 3-5 ఏళ్లలో అందుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. 2023-24లో SBI రూ.61,077 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని.. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 21.59 శాతం అధికమని చెప్పారు. కార్పొరేట్ రుణాలకు గిరాకీ బాగుందని.. ఇప్పటికే రూ.4 లక్షల కోట్ల రుణాలకు దరఖాస్తుల...
HDFC బ్యాంకు కొన్ని క్రెడిట్ కార్డులకు అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. స్మార్ట్బై ప్లాట్ఫామ్లో యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుపై రివార్డు పాయింట్ల రిడీమ్ను ఒక క్యాలెండర్ త్రైమాసికంలో ఒక ఉత్పత్తికి పరిమితం చేసింది. తనిష్క్ వోచర్లపై రివార్డు పాయింట్ల రిడీమ్ను 50,000 రివార్డు పాయింట్లకు పరిమితం చేసింది. ఈ మార్పులు ఇన్ఫినియా, ఇన్ఫినియా మెటల్ కా...
భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్ల కోసం రూ.999లతో సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 98 రోజులు. రోజుకూ 100 ఉచిత SMSలతోపాటు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. 2GB రోజువారీ డేటా కూడా లభిస్తుంది. అలాగే, 5G ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ప్రాంతాల్లోనివారు అపరిమిత 5G డేటాను వాడుకోవచ్చు. JIOTV, జియోక్లౌడ్, JIO సినిమా వంటి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్లను క...
చైనా ఆన్లైన్ గేమింగ్ యాప్పై ఈడీ చర్యలు చేపట్టింది. FIEWIN యాప్తో అనుసంధానించిన క్రిప్టో ఖాతాలను ఫ్రీజ్ చేసింది. రూ.25 కోట్లు విలువైన క్రిప్టో ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసినట్లు తెలిపింది. గేమింగ్ యాప్ ద్వారా ఇండియా నుంచి చైనాకు దాదాపు నాలుగు వందల కోట్లు చేరినట్లు గుర్తించిన ఈడీ.. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది.
TG: హైదరాబాద్లో గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ అరెస్ట్ అయ్యారు. చంద్రశేఖర్ను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ అరెస్టు చేసింది. చంద్రశేఖర్ రూ.7 కోట్ల స్కామ్ చేశారని.. ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్కు విక్రాంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసి ఈవోడబ్య్లూ ఆధారాలు సేకరించింది. నార్సింగి, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.
SKLM: రాజాం పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి నీలం గోవింద రావు ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ చదివిన వారు అర్హులన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని గమనించాలన్నారు.
HNK: WGL,HNK జిల్లాల్లోని పలు డిగ్రీ కాలేజీలు అధికంగా పరీక్ష ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. HNKలోని ఓ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో కాకతీయ యూనివర్సిటీ ఆదేశాల ప్రకారం రెగ్యులర్ పరీక్ష ఫీజు ఒక్కొక్కరికి రూ.750 ఉండగా.. రూ.1500-1980 వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల వసూలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 182 పాయింట్ల లాభంతో 85,358 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 26,048 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.68గా ఉంది.
ప్రస్తుతం మనదేశంలోకి ఏటా 70-80 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తుండగా.. వచ్చే కొన్నేళ్లలో దీన్ని 100 బిలియర్లకు చేర్చాలనుకుంటున్నట్లు పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి అమర్ దీప్ సింగ్ తెలిపారు. ఇందుకు FDI దరఖాస్తుల ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరిస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడులను మరింతగా ప్రోత్సహించేందుకు రక్షణ, రైల్వేలు, బీమా, టెలికాం వంటి రంగాల్లో నిబంధనలను...
NLR: ఏపీ టెట్ (టీచర్ ఎలిజిబుల్ టెస్ట్) పరీక్షను అక్టోబర్ 3 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో రామారావు తెలిపారు. ఈ పరీక్షలు జిల్లాలోని PBR విశ్వోదయ కళాశాల (కావలి), RSR కళాశాల (కడనూతల), నారాయణ ఇంజినీరింగ్ కళాశాల ( నెల్లూరు), అయాన్ డిజిటల్ సెంటర్ (పొట్టేపాలెం)లో జరుగుతాయన్నారు. అభ్యర్థులు సమయానికి 30నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి రావాలన్నారు.
NLR: గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
VSP: వడ్డాదికి చెందిన యర్రా హేమలత ఫార్మా డీలో గోల్డ్ మెడల్ సాధించింది. రాము, దేవి దంపతుల ప్రథమ కుమార్తె హేమలత కాకినాడలోని ఓ కాలేజీలో ఫార్మా-D కోర్సు పూర్తి చేసింది. కష్టపడి చదివి మంచి మార్కులతో గోల్డ్ మెడల్ సాధించింది. కాలేజీలో 133 మంది విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులకు ఈ అవకాశం కలిగిందని విద్యార్థిని హేమలత తెలిపింది.