WGL: నర్సంపేట మండలం మగ్దుంపురంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ఇస్కాన్ కూకట్పల్లి సహకారంతో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు క్యాన్సర్ నిర్మూలన, నివారణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. వి. జానకి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.