నిబంధనలను సరిగ్గా పాటించనందుకు ఫోన్పేపై RBI రూ.21 లక్షల జరిమానా విధించింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్(PPIs)కు సంబంధించిన నియమాలను ఉల్లంఘించినట్లు RBI తెలిపింది. అక్టోబర్ 2023-డిసెంబర్ 2024 మధ్య ఫోన్పే లావాదేవీలను పరిశీలించగా.. ఎస్క్రో ఖాతాలో ఉండాల్సిన బ్యాలెన్స్, బకాయి ఉన్న PPI విలువ కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో RBI ఈ చర్య తీసుకుంది.