SGR: దోస్త్ ద్వారా సంగారెడ్డిలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మిగిలిపోయిన సీట్లకు ఈనెల 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అరుణబాయి శుక్రవారం తెలిపారు. ఇంటర్ మెమో, బోనఫైడ్, టీసీ, ఇన్కం, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలని చెప్పారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు.