TG: యూరియా వాడకంపై జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ వీసీ జానయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పంటకు నత్రజని అందించడం కోసమే యూరియా అవసరం. యూరియాకి ప్రత్యామ్నాయం ఉంది.. రైతులు ఆ దిశగా ఆలోచించారు. యూరియాపై భారీ సబ్సిడీ ఉండటమే.. అంత డిమాండ్కి కారణం. ధర ఎక్కువగా ఉన్న ఎరువులతో యూరియాను రేషనలైజ్ చేయాలి’ అని పేర్కొన్నారు.