ASR: అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు వసతి గృహాలు, ప్రహరీ గోడ నిర్మించాలని గిరిజన విద్యార్థి సంఘం నేతలు మాధవరావు, కిషోర్, బాబుజీ కోరారు. ఈమేరకు శుక్రవారం పాడేరు ఐటీడీఏలో జరిగిన మీకోసంలో కలెక్టర్ దినేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. కళాశాలలో 260 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వసతి గృహాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు.