మెయిన్ బోర్డు కేటగిరిలో IPOకు వచ్చిన మన్బా ఫైనాన్స్ కంపెనీ సబ్స్క్రిప్షన్ క్షణాల్లోనే పూర్తయింది. ఇవాళ ఉదయం సబ్స్క్రిప్షన్ ప్రారంభం కాగా.. కొన్ని నిమిషాల్లోనే పూర్తి సబ్స్క్రిప్షన్ అందుకుంది. IPOలో భాగంగా రూ.151 కోట్ల సమీకరణకు 1.26 కోట్ల షేర్లను కంపెనీ విక్రయానికి పెట్టింది. ధరల శ్రేణిని రూ.114-120గా నిర్ణయించింది. కనీసం 125 ఈక్విటీ షేర్లకు సబ్స్క్రైబ్ చేసుకో...
UN సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ కార్యక్రమంలో గ్లోబల్ AI ఆపర్చునిటీ ఫండ్ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ CEO సుందర్పిచాయ్ ప్రకటించారు. గూగుల్ తరఫున ఈ ఫండ్లో భాగంగా 120 మిలియన్ డాలర్లు (రూ.వెయ్యి కోట్లు) సమకూరుస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కమ్యూనిటీల్లో AI ఎడ్యుకేషన్, శిక్షణకు ఖర్చు చేస్తామన్నారు. AI ఎడ్యుకేషన్, శిక్షణను స్థానిక భా...
TG: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. వైద్యారోగ్య శాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 5 చివరి తేదీగా ప్రకటించారు. వివరాలకు https://mhsrb.telangana.gov.in/MHSR...
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76 వేలు దాటింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరగ్గా రూ.69,800గా ఉంది. వెండి ధర రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. కాగా, కిలో వెండి ధర రూ.98,000గా ఉంది.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీ. ఫార్మసీ రెండవ సంవత్సరం రెండవ సెమిస్టర్ రెగ్యులర్ సప్లమెంటరీ, మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన పరీక్షా కేంద్రాలకు జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం తెలిపారు. కళాశాల వారీగా జంబ్లింగ్ చేసి నూతన పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు వెల్లడించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 310 పాయింట్లు ఎగబాకి 84,854 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 126 పాయింట్లు లాభపడి 25,917 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.83.47 వద్ద ఉంది.
ప్రకాశం: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీలో పదో తరగతి, ఇంటర్ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 28వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. రూ.300 అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు ఆన్లైన్లో అడ్మిషన్లు పొందవచ్చని డీఈఓ పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లు ఈ విషయాన్ని గమనించి అడ్మిన్ల సంఖ్య పెంచాలని డీఈవో తెలిపారు.
WG: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పొందేందుకు ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని యలమంచిలి ఎంఈవో–2 కనుమూరు వెంకట రామకృష్ణంరాజు పేర్కొన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, పురపాలక, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రకాశం: డాన్ బాస్కో సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న ఒంగోలులోని దాన్ బాస్కో ఐటీఐ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రధానాచా ర్యులు రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ డిప్లొమా, బీటెక్, బీ. ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్ధులు ధ్రువ పత్రాలతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.
VSP: ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖ ఇందిరాగాంధీ జూ పార్క్ లో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖడ్గమృగాల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ పోటీలను నిర్వహించినట్లు జూ అధికారులు తెలిపారు.
WG: పెడతాడేపల్లిలోని డాక్టర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో ఖాళీగా ఉన్న మూడు పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ రాజారావు ఆదివారం ప్రకటనలో తెలిపారు. పార్ట్ టైం ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాను ఈ నెల 25 వతేదీ లోపు స్వయంగా అందజేయాలని ప్రిన్సిపల్ రాజారావు పేర్కొన్నారు.
ఐఫోన్ యూజర్లకు కేంద్రం హై రిస్క్ హెచ్చరికలను జారీ చేసింది. IOS, ఐపాడ్, మ్యాక్, వాచ్, విజన్ OSలలో భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. వెంటనే IOS 18, 17.7కు ముందు ఉన్న వెర్షన్లు, ఐపాడ్ OS 18,17.7, మ్యాక్ OS సోనోమాలో 14.7, వెంచురాలో 13.7, సీక్వోయాలో 15, TV OS 18, వాచ్ OS 11, సపారీలో 18, X కోడ్లో 16, విజన్ OSలో 2కు ముందు ఉన్న వెర్షన్లను వీలైనంత […]
SKLM: ఈనెల 28 వరకు ఓపెన్ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు డీఈవో తిరుమల చైతన్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళంలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 30 వరకు 200 అపరాధ రుసుంతో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలు కొరకు ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో సంప్రదించాలని డీఈవో కోరారు.
VZM: రాజాంలో ఈనెల 27వ తేదీన 19 నుంచి 40 ఏళ్లలోపు గల వారికి ఉచిత శిక్షణ కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు NAIRED నిర్వాహకులు తెలిపారు. మహిళలకు హోమ్ నర్సింగ్, మగ్గం వర్క్, టైలరింగ్, బ్యూటీ పార్లర్ కోర్సులకు, పురుషులకు అకౌంటింగ్ టాలీ, ఎలక్ట్రికల్ వైరింగ్, జెంట్స్ టైలరింగ్ కోర్సులకు 30 రోజులపాటు ఉచిత శిక్షణ, ఉచిత వసతి, భోజన సదుపాయం ఇస్తామన్నారు.