SRD: జహీరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 11న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జ్యోతి సోమవారం తెలిపారు. మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో 200 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్ ఉత్తీర్ణులైన వారు హాజరు కావచ్చని చెప్పారు.