BDK: సింగరేణి సంస్థలో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలుగా (జేఎంఈటీ) చేరి వివిధ కారణాలతో టర్మినేట్ అయిన 43 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి వీలుగా సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్. బలరామ్ ఆదేశాల మేరకు వారికి మరొక అవకాశాన్ని కల్పించేలా ఉత్తర్వులు శనివారం విడుదల అయ్యాయి.