TG: హైదరాబాద్లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,360, అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,000 ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ.98,000 ఉంది.
VSP: ఈ నెల 26,27 తేదీల్లో విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. మళ్లీ 30వ తేదీన నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.వి. శేషమ్మ తెలిపారు. ఆఫీసు అసిస్టెంట్ (3), రిసెప్షనిస్ట్కమ్ – డేటా ఎంట్రీ ఆపరేటర్ (1) ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
TG: MBBS, BDS ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. రేపటి నుంచి మొదటి విడత అడ్మిషన్ల వెబ్ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. కన్వీనర్ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకున్న 16,679 మంది విద్యార్థుల ప్రాథమిక జాబితాను నిన్న కాళోజీ హెల్త్ వర్సిటీ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఇవాళ సా.5లోపు తెలుపాలని వీసీ పేర్కొన్నారు. అభ్యంతరాలు పరిశీలించి రేపు తుది జాబితాను విడుదల చేసి, అదేరోజు వెబ్ ఆప్షన్ల ...
VZM: రెవిన్యూ శాఖలో వివిధ క్యాడర్లకు చెందిన 462 మందిని బదిలీ చేస్తూ విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.మొత్తం 462 పోస్టులకు బదిలీ జరిగింది.బదిలీలు జరిగిన వాటిలో MRO-1, DT -69, సీనియర్ అసిస్టెంట్-50, జూనియర్ అసిస్టెంట్-21, వీఆర్వో గ్రేడ్ I -238, వీఆర్వో గ్రేడ్ II-81, రికార్డ్ ఆసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ ఒక్కొక్క పోస్టు ఉన్నాయన్నారు .
VSP: కంచరపాలెం ప్రభుత్వ ఓల్డ్ ఐటీఐలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో ఫిట్టర్ వెల్డర్ ఎలక్ట్రీషియన్ మెకానికల్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి అప్రెంటిస్ షిప్ పూర్తి చేసిన అభ్యర్థులు జాబ్ మేళాకు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.
VSP: విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయం ఆవరణలో ఈనెల 27న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా సబ్ రీజినల్ ఎంప్లాయిమెంట్ అధికారి శ్యాంసుందర్ తెలిపారు. వివిధ కంపెనీల్లో 250 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ ఉత్తీర్ణులైన వారు అర్హులుగా పేర్కొన్నారు. వయసు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలన్నారు.
VSP: ఏయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పీజీ డిప్లమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సంచాలకులు డి.ఏ నాయుడు తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన వారు అక్టోబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రముఖ గాయని పీ సుశీలకు ‘కలైజ్ఞర్ స్మారక కళా విభాగం స్పెషలిస్ట్’ అవార్డును తమిళనాడు సర్కార్ ప్రకటించింది. దివంగత DMK అధినేత కరుణానిధి పేరిట తమిళనాడు సర్కార్ తమిళాభివృద్ధి విభాగం నేతృత్వంలో కలైజ్ఞర్ నినైవు కళై తురై విత్తగర్ అవార్డును ప్రదానం చేయడానికి 2022లో నిర్ణయించారు. మొదటి అవార్డు తిరువారూర్ ఆరూర్దాస్కు దక్కింది. ఈనెల 30న సీఎం స్టాలిన్ చేతులమీ...
TG: వైద్యారోగ్యశాఖలో 633 ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అక్టోబర్ 5 నుంచి 21వ తేదీ సా.5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో పొరపాట్లు ఉంటే అక్టోబర్ 23 నుంచి 24 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసే అవకాశం కల్పించారు. నవంబర్ 30న CBT పద్దతిలో పర...
TG: వైద్యారోగ్యశాఖలో 633 ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అక్టోబర్ 5 నుంచి 21వ తేదీ సా.5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో పొరపాట్లు ఉంటే అక్టోబర్ 23 నుంచి 24 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసే అవకాశం కల్పించారు. నవంబర్ 30న CBT పద్దతిలో పర...
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈనెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్పై బంపర్ ఆఫర్ అందుబాటులోకి రాబోతోంది. ఈ సేల్లో వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ను కొనే వారికి రూ.1,599 విలువైన వన్ ప్లస్ నార్డ్ 2r బడ్స్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు అమెజాన్ పేర్కొంది. బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ పోను రూ.16,999 అమెజాన్ సేల్లో వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ […]
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈనెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్పై బంపర్ ఆఫర్ అందుబాటులోకి రాబోతోంది. ఈ సేల్లో వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ను కొనే వారికి రూ.1,599 విలువైన వన్ ప్లస్ నార్డ్ 2r బడ్స్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు అమెజాన్ పేర్కొంది. బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ పోను రూ.16,999 అమెజాన్ సేల్లో వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ […]
TG: రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మండలానికి ఒక మండల విద్యాశాఖ అధికారిని నియమించింది. 609 మండలాలకు ఇన్ఛార్జ్ ఎంఈవోలను నియమించింది. మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం 632 మండలాలకు గానూ అందులో 16 మండలాల్లో రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు.
TG: రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మండలానికి ఒక మండల విద్యాశాఖ అధికారిని నియమించింది. 609 మండలాలకు ఇన్ఛార్జ్ ఎంఈవోలను నియమించింది. మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం 632 మండలాలకు గానూ అందులో 16 మండలాల్లో రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 130.92 పాయింట్ల నష్టంతో 84,797.69 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 22.80 పాయింట్లు కుంగి 25,916.20 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.56గా ఉంది.