• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

పీజీ డిప్లొమాలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం

SKLM: ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ లో పీజీ డిప్లొమా ఇన్ గాంధీయన్ సోషల్ వర్క్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుజాత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏడాది కాల వ్యవధి గల ఈ కోర్సులో చేరేందుకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 5లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

September 28, 2024 / 05:58 AM IST

విద్యార్థులకు పాఠాలు చెప్పిన జిల్లా అదనపు కలెక్టర్

ASF: వాంకిడి మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి తనిఖీ చేశారు. సందర్భంగా పాఠశాలలలోని తరగతి గదులను మరియు రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు పాఠాలను బోధించారు. సబ్జెక్టులపై ప్రశ్నలను అడిగారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి చూయించాలని పాఠశాల ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు.

September 28, 2024 / 05:57 AM IST

పారా లీగల్ వాలంటీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

SKLM: విల్ కోర్టు పరిధిలో పారాలీగల్ వలంటీర్లుగా పనిచేయడానికి ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సివిల్ జడ్జి హరిప్రియ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.నరసన్న పేట,పోలాకి మండలాల పరిధిలో పనిచేయడానికి వీలుగా అక్టోబర్ 8లోగాదరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలని, ఎంపికైన వారికి ఎటువంటి పారితోషికం ఉండదని స్పష్టం చేశారు.

September 28, 2024 / 05:36 AM IST

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 264.27 పాయింట్ల నష్టంతో 85,571.85 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 26,179 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.70 వద్ద నిలిచింది.

September 27, 2024 / 03:56 PM IST

ఈనెల 30న అనకాపల్లిలో జాబ్ మేళా

AKP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా అనకాపల్లి రేబాక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 30న 3 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తునట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఎన్. గోవిందరావు శుక్రవారం తెలిపారు. ఈ ఇంటర్వ్యూలకు పదవ తరగతి నుండి పీజీ వరకు చదువుకొని 18 నుండి 30 సంవత్సరముల వయస్సు గల యువతీ, యువకులు అర్హులని పేర్కొన్నారు. 

September 27, 2024 / 03:00 PM IST

బోధన, బోధనేతర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

ప్రకాశం: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బందిని ఒప్పంద, అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపడుతున్నట్లు డీఈవో డి.సుభద్ర పేర్కొన్నారు. బోధనా సిబ్బందిని ఒప్పంద విధానంలో, బోధనేతర సిబ్బందిని అవుట్ సోర్సింగ్ కింద 2024-25 సంవత్సర కాలానికి భర్తీ చేస్తామన్నారు. మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ రూ. 250లు చెల్లించి దరఖాస్తు చేయాలన్నారు.

September 27, 2024 / 01:32 PM IST

జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం సస్పెండ్

కృష్ణా: గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రవీంద్ర భవానీని జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. నాలుగు రోజులక్రితం కాలేజీ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు హెచ్ఎం భవానీకి మధ్య వివాదంలో తల్లిదండ్రులపై హెచ్ఎమ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చెయ్యడమే కారణంగా తెలుస్తోంది.

September 27, 2024 / 12:59 PM IST

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 13.01 పాయింట్ల లాభంతో 85,849.13 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 12.60 పాయింట్లు లాభపడి 26,228.60 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.65గా ఉంది.

September 27, 2024 / 09:43 AM IST

హైదరాబాద్‌లో భారీగా తగ్గిన ఇళ్ల అమ్మకాలు

TG: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో 11 శాతం మేర తగ్గినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘అనరాక్ ఓ’ వెల్లడించింది. మొత్తం 1.07లక్షల యూనిట్ల విక్రయాలు జరగగా గతేడాది ఇదే త్రైమాసికంలో  1,20,290 యూనిట్లు అమ్ముడుపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ధరలు అధికంగా 32 శాతం పెరగడం ప్రధాన కారణంగా తెలిసింది.

September 27, 2024 / 09:30 AM IST

274 మందికి డీఎస్సీ కౌన్సిలింగ్

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 274 మంది 2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్జీటీ ఉద్యోగాల నియామకానికి నేటి నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. నేటి నుంచి అక్టోబర్ 5 వరకు హనుమకొండలోని డీఈవో ఆఫీసులో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని అధికారులు చెప్పారు. ఆన్ లైన్‌లో వెరిఫికేషన్ దరఖాస్తు ఫారాన్ని కౌన్సిలింగ్‌కు  హాజరు కావాలన్నారు.

September 27, 2024 / 09:03 AM IST

నేడు, రేపు 2008 డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

సంగారెడ్డి: డీఎస్సీ 2008లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన డీఈఓ కార్యాలయంలో ఈ రోజు, రేపు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 292 మంది అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. అభ్యర్థుల పేర్లను విద్యాశాఖ వెబ్ సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.

September 27, 2024 / 08:26 AM IST

MBBS వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం

TG: రాష్ట్రంలో MBBS కన్వీనర్ కోటా సీట్ల అడ్మిషన్లకు ఆన్‌లైన్‌లో వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ ఉదయం 6 నుంచి ఈ నెల 29 సాయంత్రం వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏమైనా సమస్యలుంటే 9392685856/ 7842136688/ 9059672216 ఫోన్ నంబర్లకు కాల్ చేయవచ్చు. లేదా tsmedadm2024@gm...

September 27, 2024 / 07:59 AM IST

పలు వెబ్‌సైట్లపై కేంద్రం కొరడా

ఆధార్‌, పాన్‌లతో సహా పౌరులకు సంబంధించిన సున్నితమైన వివరాలు బహిర్గతం చేస్తున్న వెబ్‌సైట్లపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఆ వెబ్‌సైట్లను బ్లాక్‌ లిస్ట్‌‌లో పెట్టినట్లు తెలిపింది. ఆయా వెబ్‌సైట్లలో భద్రతా లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు కేంద్ర ఐటీశాఖ తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది.

September 27, 2024 / 12:43 AM IST

భారీ ఐపీఓకు సిద్ధమైన స్విగ్గీ

ఆన్‌లైన్ ఆర్డర్లు ద్వారా ఆహారాన్ని వినియోగదార్లకు డెలివరీ చేసే స్విగ్గీ.. IPOకు రానుంది. ఈ IPO ద్వారా రూ.3,750 కోట్లు సమీకరించేందుకు ప్లాన్ చేస్తుంది. దీంతో భారత్‌లో ఈ ఏడాది అత్యధికంగా లిస్టింగ్‌ చేసిన కంపెనీల్లో ఒకటిగా స్విగ్గీ నిలువనుంది. సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ కార్పొరేషన్‌ పెట్టుబడులున్న ఈ సంస్థను 2014లో స్థాపించారు. దేశంలోని 15,000 రెస్టారెంట్లతో స్విగ్గీ...

September 27, 2024 / 12:05 AM IST

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 666.25 పాయింట్ల లాభంతో 85,836.12 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 211.80 పాయింట్లు లాభపడి 26,216 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.64 వద్ద నిలిచింది.

September 26, 2024 / 04:02 PM IST