• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

చైనా గేమింగ్ యాప్‌పై ఈడీ యాక్ష‌న్‌

చైనా ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌పై ఈడీ చ‌ర్య‌లు చేప‌ట్టింది. FIEWIN యాప్‌తో అనుసంధానించిన క్రిప్టో ఖాతాల‌ను ఫ్రీజ్ చేసింది. రూ.25 కోట్లు విలువైన క్రిప్టో ఖాతాల‌ను ఈడీ ఫ్రీజ్ చేసిన‌ట్లు తెలిపింది. గేమింగ్ యాప్ ద్వారా ఇండియా నుంచి చైనాకు దాదాపు నాలుగు వంద‌ల కోట్లు చేరిన‌ట్లు గుర్తించిన ఈడీ.. న‌లుగురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసింది.

September 26, 2024 / 11:59 AM IST

గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ అరెస్ట్

TG: హైదరాబాద్‌లో గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ అరెస్ట్ అయ్యారు. చంద్రశేఖర్‌ను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ అరెస్టు చేసింది. చంద్రశేఖర్ రూ.7 కోట్ల స్కామ్ చేశారని.. ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్‌కు విక్రాంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసి ఈవోడబ్య్లూ ఆధారాలు సేకరించింది. నార్సింగి, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లలో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.

September 26, 2024 / 10:59 AM IST

రాజాంలో రేపు మెగా జాబ్ మేళా

SKLM: రాజాం పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి నీలం గోవింద రావు ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ చదివిన వారు అర్హులన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని గమనించాలన్నారు.

September 26, 2024 / 10:08 AM IST

అధికంగా డిగ్రీ పరీక్ష ఫీజు వసూలు..!

HNK: WGL,HNK జిల్లాల్లోని పలు డిగ్రీ కాలేజీలు అధికంగా పరీక్ష ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. HNKలోని ఓ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో కాకతీయ యూనివర్సిటీ ఆదేశాల ప్రకారం రెగ్యులర్ పరీక్ష ఫీజు ఒక్కొక్కరికి రూ.750 ఉండగా.. రూ.1500-1980 వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల వసూలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

September 26, 2024 / 10:06 AM IST

ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 182 పాయింట్ల లాభంతో 85,358 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 26,048 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.68గా ఉంది.

September 26, 2024 / 09:45 AM IST

ఏడాదికి 100 బిలియన్ల డాలర్ల టార్గెట్

ప్రస్తుతం మనదేశంలోకి ఏటా 70-80 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తుండగా.. వచ్చే కొన్నేళ్లలో దీన్ని 100 బిలియర్లకు చేర్చాలనుకుంటున్నట్లు పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి అమర్ దీప్ సింగ్ తెలిపారు. ఇందుకు FDI దరఖాస్తుల ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరిస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడులను మరింతగా ప్రోత్సహించేందుకు రక్షణ, రైల్వేలు, బీమా, టెలికాం వంటి రంగాల్లో నిబంధనలను...

September 26, 2024 / 09:25 AM IST

వచ్చే నెల 3 నుంచి టెట్ పరీక్ష

NLR: ఏపీ టెట్ (టీచర్ ఎలిజిబుల్ టెస్ట్) పరీక్షను అక్టోబర్ 3 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో రామారావు తెలిపారు. ఈ పరీక్షలు జిల్లాలోని PBR విశ్వోదయ కళాశాల (కావలి), RSR కళాశాల (కడనూతల), నారాయణ ఇంజినీరింగ్ కళాశాల ( నెల్లూరు), అయాన్ డిజిటల్ సెంటర్ (పొట్టేపాలెం)లో జరుగుతాయన్నారు. అభ్యర్థులు సమయానికి 30నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి రావాలన్నారు.

September 26, 2024 / 08:10 AM IST

నేడు గూడూరులో జాబ్ మేళా

NLR: గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

September 26, 2024 / 07:30 AM IST

ఫార్మా డీలో వడ్డాది విద్యార్థినికి గోల్డ్ మెడల్

VSP: వడ్డాదికి చెందిన యర్రా హేమలత ఫార్మా డీలో గోల్డ్ మెడల్ సాధించింది. రాము, దేవి దంపతుల ప్రథమ కుమార్తె హేమలత కాకినాడలోని ఓ కాలేజీలో ఫార్మా-D కోర్సు పూర్తి చేసింది. కష్టపడి చదివి మంచి మార్కులతో గోల్డ్ మెడల్ సాధించింది. కాలేజీలో 133 మంది విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులకు ఈ అవకాశం కలిగిందని విద్యార్థిని హేమలత తెలిపింది.

September 26, 2024 / 07:25 AM IST

సమగ్ర శిక్ష ఉద్యోగులకు జీతాలు విడుదల చేయాలి

AKP: విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆగస్టు, సెప్టెంబర్ నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకుడు పూడి వెంకట్రావు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు జీతాలు విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

September 26, 2024 / 07:17 AM IST

త్వరలోనే మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్

TG: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగ ఖాళీలు వేగంగా భర్తీ అవుతున్నాయి. గడిచిన 15 రోజుల్లోనే 4 వేల పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మరో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంకో పది రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది. మరో 1600 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ ఆమోదం కోరుతూ ఆరోగ్యశాఖ ఫైల్ పంపింది.

September 26, 2024 / 07:15 AM IST

నాలుగు సెంటర్లలో ఏపీ టెట్

NLR: ఏపీ టెట్ అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. కావలిలోని పీబీఆర్ విశ్వోదయ ఇంజినీరింగ్ కళాశాల, పొట్టేపాళెంలోని ఆయాన్ డిజిటల్ సెంటర్, కడనూతలలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, నెల్లూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష జరగనుందన్నారు.

September 26, 2024 / 06:49 AM IST

ఉల్లి కొనగలమా..? తినగలమా..?

సాధారణంగా ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వస్తుంటాయి. ఇప్పుడు అవి కొనాలంటే కన్నీళ్లు వస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధర అర్ధ సెంచరీ దాటింది. 3 నెలల క్రితం కిలో రూ.20 పలికిన ధర నేడు మూడింతలు పెరిగింది. వరుసగా పండుగలు, శుభకార్యాలు ఉండటంతో.. మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో సామాన్యులు ఉల్లి వాడకాన్ని తగ్గించుకుంటున్నారు. భారీ వర్షాల వల్ల ఉల్లి సాగు తగ్గడంతో.. ధరలు పెరిగాయని వ్య...

September 26, 2024 / 06:47 AM IST

GREAT: సత్తా చాటిన భారత్

ఆసియా పవర్ ఇండెక్స్ రీజినల్ పవర్‌లో భారత్ సత్తా చాటింది. జపాన్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అమెరికా ఉండగా.. రెండో స్థానంలో చైనా ఉంది. రానున్న రోజుల్లో చైనాను వెనక్కి నెట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనాతో అమెరికా, చైనా, యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కొంతమేర దెబ్బతిన్నాయి. ఆ సమయంలో భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో.. పవర్ ఇండెక్స్ రే...

September 26, 2024 / 06:32 AM IST

ఈ నెల 29న టెట్ మోడల్ పరీక్ష

ప్రకాశం: ఒంగోలులో యూటీఎఫ్, డీవైఎఫ్ఎ, కనిగిరి టీచర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 29న ఉపాధ్యాయ అర్హతపరీక్ష(టెట్) మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి డి.వీరాంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కంభం, దర్శి, పొదిలి, ఒంగోలు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

September 26, 2024 / 05:32 AM IST