ASR: అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కే.పుష్పరాజు అధ్యక్షతన జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కాలుష్య నివారణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. అనంతరం వివిధ రకాల కాలుష్యాల గురించి వివరించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మొదట్లోనే సెన్సెక్స్ భారీగా కుంగిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 70 పాయింట్ల నష్టంతో 79,732 వద్ద.. నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయి 24,127 దగ్గర ట్రేడవుతున్నాయి. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 84.58గా ఉంది. ఈ వారంలో RBI ద్రవ్యపరపతి విధాన సమీక్షా నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
W.G: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గోపాలపురంలో అందిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని స్కిల్ హబ్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ సూచించారు. సోమవారం నుంచి ఈ శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. టెన్త్, ఆపై విద్యార్హతలు కలిగిన 18-35 వయస్సు కలిగి, ఆసక్తిగల వారు స్థానిక మండల పరిషత్ ఆఫీస్లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ఇవాళ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ పథకం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోర్టల్ ద్వారా ఇప్పటికే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. దాదాపు ఆరు లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. వారికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల ద్వారా ఇంటర్న్షిప్ అవకాశం కల్పించనున్నారు. ఎంపికైన గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.5000 అంది...
SKLM: ఎచ్చెర్లలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ హబ్ కేంద్రంలో కొత్తగా ప్రారంభిస్తున్న మూడు నెలల కాల వ్యవధి గల రెండు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఐటీఐ ప్రధానాచార్యులు, జిల్లా కన్వీనర్ ఎల్. సుధాకరరావు తెలిపారు. 18- 30 ఏళ్ల వయసు ఉన్న వారు సోమవారం లోపే దరఖాస్తు చేసుకోవాలి అని తెలిపారు.
BDK: ఆళ్లపల్లి మండల పరిధిలోని అనంతోగు గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో బోధించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్వీ. బానోత్ సరోజిని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందీ, ఫిజిక్స్, ఇంగ్లిష్ ఉపాధ్యాయులు కావాలని చెప్పారు. బీఈడీ, ఎంఎస్సీ ఉత్తీర్ణులైన విద్యావంతులు అభ్యర్థులు ఈ నెల 2,3 తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
MDK: జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాల్లో అకౌంటెంట్, ఏఎన్ఎం ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాధాకిషన్ తెలిపారు. మూడు అకౌంటెంట్, నాలుగు ఏఎన్ఎం పోస్టులు ఖాళీ ఉన్నాయని, వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం చేయనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు సమగ్ర శిక్షా జిల్లా కార్యాలయం లేదా 8985889663, 7893308762 నంబర్లను సంప్రదించాలన్నారు.
NZB: సిరికొండ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సాంఘిక, హిందీ పాఠ్యాంశాలు బోధించేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేకాధికారి పర్వీన్ తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన పని చేసేందుకు డిగ్రీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈరోజు నుంచి 4వ తేదీ వరకు ధ్రువపత్రాల జిరాక్స్లను పాఠశాలలో సమర్పించాలని కోరారు.
W.G: రాజమండ్రిలో నవంబర్ 27న నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలలో ఉభయగోదావరి జిల్లాలో 13 మంది అర్హత సాధించారని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జ్యోతి ఆదివారం తెలిపారు. విజేతలుగా A.రవి రాజు, P. మణికంఠ, సూరిశెట్టి నాగేశ్వరి, కొప్పిశెట్టి సత్య ప్రసాద్, కర్రి చరిత, యశస్వి కృష్ణ, దావులూరి దేవ సాహితి, కంకిపాటి సందీప్ కుమార్, షేక్ అక్బీర్, చల్లబత్తుల శ్రీధర్ ఉన్నారు.
SKLM: ఎచ్చెర్లలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ హబ్ కేంద్రంలో కొత్తగా ప్రారంభిస్తున్న మూడు నెలల కాల వ్యవధి గల రెండు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఐటీఐ ప్రధానాచార్యులు, జిల్లా కన్వీనర్ ఎల్.సుధాకరరావు తెలిపారు. 18- 30 ఏళ్ల వయసు ఉన్న వారు సోమవారంలోగా దరఖాస్తు చేసుకోవాలి అని తెలిపారు.
VZM: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి సోమవారం ఉదయం 10 గంటలకు పార్వతీపురం గిరిజన సామాజిక భవనంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటరును ప్రారంభించినున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్సీ కోచింగ్ రెండు నెలల పాటు కొనసాగుతుంది. కోచింగ్ తీసుకునే వారికు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
TG: నిజామాబాద్ ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో మహిళా అతిధి అధ్యాపకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చంద్రిక తెలిపారు. డిగ్రీ కళాశాలలో స్టాటిస్టిక్స్, చరిత్ర,ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆమె కోరారు. ఆసక్తి కలిగిన మహిళాలు తమ సర్టిఫికెట్లను తీసుకొని…ఈనెల 3న కళాశాలలో ఇంటర్వ్యూ, డెమో పరీక...
భారత్లో వివాహాల ఖర్చు ఏటా భారీగా పెరిగిపోతోందని ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ సంస్థ వెడ్మీగుడ్ పేర్కొంది. ఈ ఏడాది పెళ్లిళ్ల కోసం ఏకంగా రూ.36.5 లక్షల కోట్లు ఖర్చు చేశారని తెలిపింది. అంటే సగటున ఒక్కో వివాహానికి రూ.36.5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అదే డెస్టినేషన్ వెడ్డింగ్కు అయితే 51.1 లక్షలను కేటాయిస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో జరిగిన పెళ్లిళ్ల ఖర్చుతో పోలిస్తే ఈ సారి 7 శాతం ఎక...
వడ్డీ రేట్లలో RBI మరోసారి మార్పులు చేయకపోవచ్చని నిపుణలు అంచనా వేస్తున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో GDP వృద్ధి రేటు తగ్గటమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ నెల 4-6 తేదీల మధ్య జరగనున్న ఎంపీసీ సమావేశంలో కీలక రేట్లు యథాతథంగా ఉంచవచ్చని తెలుస్తోంది. ద్రవ్యోల్బణం తగ్గముఖం పడితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉన్నట్లు సన్న...
పీఎఫ్ విత్డ్రా చేసుకునే ప్రక్రియ ఈజీ చేసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. 2025 జూన్ నాటికి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు డెబిట్ కార్డు తరహా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాన్నట్లు సమాచారం. దీని ద్వారా పీఎఫ్ ఎమౌంట్ను ATM నుంచి విత్ డ్రా చేసుకోవచ్చట. అలాగే రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలను పొందేందుకు అధిక పీఎఫ్ కూడా కేంద్రం చెల్లించనున్నట్లు...