• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం సస్పెండ్

కృష్ణా: గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రవీంద్ర భవానీని జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. నాలుగు రోజులక్రితం కాలేజీ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు హెచ్ఎం భవానీకి మధ్య వివాదంలో తల్లిదండ్రులపై హెచ్ఎమ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చెయ్యడమే కారణంగా తెలుస్తోంది.

September 27, 2024 / 12:59 PM IST

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 13.01 పాయింట్ల లాభంతో 85,849.13 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 12.60 పాయింట్లు లాభపడి 26,228.60 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.65గా ఉంది.

September 27, 2024 / 09:43 AM IST

హైదరాబాద్‌లో భారీగా తగ్గిన ఇళ్ల అమ్మకాలు

TG: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో 11 శాతం మేర తగ్గినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘అనరాక్ ఓ’ వెల్లడించింది. మొత్తం 1.07లక్షల యూనిట్ల విక్రయాలు జరగగా గతేడాది ఇదే త్రైమాసికంలో  1,20,290 యూనిట్లు అమ్ముడుపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ధరలు అధికంగా 32 శాతం పెరగడం ప్రధాన కారణంగా తెలిసింది.

September 27, 2024 / 09:30 AM IST

274 మందికి డీఎస్సీ కౌన్సిలింగ్

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 274 మంది 2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్జీటీ ఉద్యోగాల నియామకానికి నేటి నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. నేటి నుంచి అక్టోబర్ 5 వరకు హనుమకొండలోని డీఈవో ఆఫీసులో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని అధికారులు చెప్పారు. ఆన్ లైన్‌లో వెరిఫికేషన్ దరఖాస్తు ఫారాన్ని కౌన్సిలింగ్‌కు  హాజరు కావాలన్నారు.

September 27, 2024 / 09:03 AM IST

నేడు, రేపు 2008 డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

సంగారెడ్డి: డీఎస్సీ 2008లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన డీఈఓ కార్యాలయంలో ఈ రోజు, రేపు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 292 మంది అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. అభ్యర్థుల పేర్లను విద్యాశాఖ వెబ్ సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.

September 27, 2024 / 08:26 AM IST

MBBS వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం

TG: రాష్ట్రంలో MBBS కన్వీనర్ కోటా సీట్ల అడ్మిషన్లకు ఆన్‌లైన్‌లో వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ ఉదయం 6 నుంచి ఈ నెల 29 సాయంత్రం వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏమైనా సమస్యలుంటే 9392685856/ 7842136688/ 9059672216 ఫోన్ నంబర్లకు కాల్ చేయవచ్చు. లేదా tsmedadm2024@gm...

September 27, 2024 / 07:59 AM IST

పలు వెబ్‌సైట్లపై కేంద్రం కొరడా

ఆధార్‌, పాన్‌లతో సహా పౌరులకు సంబంధించిన సున్నితమైన వివరాలు బహిర్గతం చేస్తున్న వెబ్‌సైట్లపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఆ వెబ్‌సైట్లను బ్లాక్‌ లిస్ట్‌‌లో పెట్టినట్లు తెలిపింది. ఆయా వెబ్‌సైట్లలో భద్రతా లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు కేంద్ర ఐటీశాఖ తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది.

September 27, 2024 / 12:43 AM IST

భారీ ఐపీఓకు సిద్ధమైన స్విగ్గీ

ఆన్‌లైన్ ఆర్డర్లు ద్వారా ఆహారాన్ని వినియోగదార్లకు డెలివరీ చేసే స్విగ్గీ.. IPOకు రానుంది. ఈ IPO ద్వారా రూ.3,750 కోట్లు సమీకరించేందుకు ప్లాన్ చేస్తుంది. దీంతో భారత్‌లో ఈ ఏడాది అత్యధికంగా లిస్టింగ్‌ చేసిన కంపెనీల్లో ఒకటిగా స్విగ్గీ నిలువనుంది. సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ కార్పొరేషన్‌ పెట్టుబడులున్న ఈ సంస్థను 2014లో స్థాపించారు. దేశంలోని 15,000 రెస్టారెంట్లతో స్విగ్గీ...

September 27, 2024 / 12:05 AM IST

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 666.25 పాయింట్ల లాభంతో 85,836.12 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 211.80 పాయింట్లు లాభపడి 26,216 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.64 వద్ద నిలిచింది.

September 26, 2024 / 04:02 PM IST

తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!

త్వరలోనే ముడి చమురు ధరలు తగ్గొచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో చమురు సంస్థ మార్జిన్లు బాగా పెరిగాయంది. కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.2-3 చొప్పున తగ్గించేందుకు వీలుందని పేర్కొంది. కాగా.. ఈ ఏడాది మార్చిలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2 చొప్పున తగ్గించారు. అప్పటి నుంచి వీటి ధరల్లో మార్పు లేదు.

September 26, 2024 / 04:02 PM IST

అమెరికాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

TG: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అమెరికాలో పర్యటనలో బిజీగా ఉన్నారు. నెవాడా, ఆరిజోనా పర్యటనలో భాగంగా హూవర్ డ్యామ్‌ను సందర్శించారు. లాస్ వెగాస్‌లో మైనింగ్ ఎగ్జిబిషన్‌లోని ఆధునిక యంత్ర పరికరాలను పరిశీలించారు. సంబంధిత కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. కాగా, మరో వారం రోజుల పాటు అమెరికాలోనే భట్టి పర్యటించనున్నారు.

September 26, 2024 / 01:10 PM IST

మెటా ఏఐలో సరికొత్త ఫీచర్లు

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మెటా AIలో మూడు సరికొత్త ఫీచర్లను జోడించింది. AI సంభాషణల్ని మరింత మెరుగుపరచడం కోసం రియల్ టైం కన్వర్జేషన్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అలాగే ఫొటోలను నచ్చినట్లుగా తీర్చిదిద్దే ఫీచర్లను కూడా జోడించింది. వీటితో పాటు ఫొటోతో సెర్చ్ చేసి.. అందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు కొత్త ఫీచర్లకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్ తన బ్లాగ్‌పోస...

September 26, 2024 / 12:57 PM IST

“రూ.లక్ష కోట్ల వార్షిక లాభమే SBI లక్ష్యం”

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వార్షిక లాభాన్ని రూ.లక్ష కోట్లకు చేర్చాలనే లక్ష్యంతో ఉన్నామని బ్యాంక్ ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. ఈ ఘనతను రానున్న 3-5 ఏళ్లలో అందుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. 2023-24లో SBI రూ.61,077 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని.. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 21.59 శాతం అధికమని చెప్పారు. కార్పొరేట్ రుణాలకు గిరాకీ బాగుందని.. ఇప్పటికే రూ.4 లక్షల కోట్ల రుణాలకు దరఖాస్తుల...

September 26, 2024 / 12:52 PM IST

HDFC క్రెడిట్‌ కార్డులకు కొత్త రూల్స్‌

HDFC బ్యాంకు కొన్ని క్రెడిట్ కార్డులకు అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. స్మార్ట్‌బై ప్లాట్‌ఫామ్‌లో యాపిల్‌ ఉత్పత్తుల కొనుగోలుపై రివార్డు పాయింట్ల రిడీమ్‌ను ఒక క్యాలెండర్ త్రైమాసికంలో ఒక ఉత్పత్తికి పరిమితం చేసింది. తనిష్క్‌ వోచర్లపై రివార్డు పాయింట్ల రిడీమ్‌ను 50,000 రివార్డు పాయింట్లకు పరిమితం చేసింది. ఈ మార్పులు ఇన్ఫినియా, ఇన్ఫినియా మెటల్ కా...

September 26, 2024 / 12:30 PM IST

జియో యూజర్లకు GOOD NEWS

భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్ల కోసం రూ.999లతో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 98 రోజులు. రోజుకూ 100 ఉచిత SMSలతోపాటు అపరిమిత కాలింగ్‌ చేసుకోవచ్చు. 2GB రోజువారీ డేటా కూడా లభిస్తుంది. అలాగే, 5G ఇంటర్నెట్ యాక్సెస్‌ ఉన్న ప్రాంతాల్లోనివారు అపరిమిత 5G డేటాను వాడుకోవచ్చు. JIOTV, జియోక్లౌడ్, JIO సినిమా వంటి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్లను క...

September 26, 2024 / 12:22 PM IST