అక్టోబర్లో బ్యాంకు సెలవుల జాబితాను RBI ప్రకటించింది. మొత్తం 15 రోజులు మూతపడనున్నాయి. 1న జమ్మూకశ్మీర్ ఎన్నికలు, 2న గాంధీ జయంతి, 3న నవరాత్రి (జైపూర్), 5న ఆదివారం, 10 దుర్గాపూజ, 11 దుర్గాష్టమి, 12 విజయదశమి, 13 ఆదివారం, 14న దుర్గాపూజ, 16 లక్ష్మీపూజ, 17 వాల్మీకి జయంతి, 20 ఆదివారం, 26 నాలుగో శనివారం, 17 ఆదివారం, 31 దీపావళి కావడంతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఆయా పండగల మేరకు సెలవులు ప్రకటించారు.
దేశీయ దిగ్గజ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. హోసూర్లోని కొత్త ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్లో త్వరలో 20 వేల మందికిపైగా ఉద్యోగులను నియమించుకోనుంది. ఈ విషయాన్ని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. పనపాక్కంలో టాటా మోటార్స్- జేఎల్ఆర్ రూ.9,000 కోట్లతో నిర్మించనున్న కొత్త తయారీ యూనిట్ శంకుస్థాపనకు చంద్రశేఖరన్ హాజరై మాట్లాడారు.
బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.345తో 60 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. రోజుకూ 1GB డేటా, 100 SMSలు ఉంటాయి. అపరిమిత కాలింగ్ పొందొచ్చు. అయితే, ఇందులో BSNL ట్యూన్స్, హర్డీ గేమ్స్ సదుపాయాలు ఉండవు. ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ టారిఫ్లను పెంచడంతో చాలామంది యూజర్లను దృష్టిలో పెట్టుకొని BSNL కొత్త ప్లాన్లపై దృష్ట...
పండగల వేళ నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. పప్పు, వంటనూనెల ధరలు 22% పెరగటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లి ధర రూ.100కు చేరువలో ఉంది అల్లం, వెల్లుల్లి ధరలు వారం రోజుల్లోనే రూ.60 చొప్పున పెరిగాయి. కిలో అల్లం ధర రూ.100 నుంచి రూ.160, వెల్లుల్లి రూ.300 నుంచి రూ.360కి చేరగా.. మాల్స్లో వెల్లుల్లి ధర రూ.400 ఉంది. ఇక కిలో కందిపప్పు రూ.170, పెసరపప్పు రూ.150, మినపపప్పు రూ.135, సెనగపప్...
TG: రాష్ట్రంలో MBA, MCA సీట్ల భర్తీకి ఈ నెల 30 నుంచి ఐసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 30న ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్, అక్టోబరు 1న ధ్రువపత్రాల పరిశీలన, 1,2 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. అక్టోబరు 4వ తేదీలోపు సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. స్పాట్ ప్రవేశాల మార్గదర్శకాలను 6న వెబ్ సైట్లో ఉంచుతామని తెలిపారు.
☛ AP స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీలో 24 SVMU ప్రొఫెషనల్ పోస్టులు. MBA ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్నవారు అర్హులు☛ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో 250 డిప్యూటీ మేనేజర్ ఖాళీలు. బీఈ/బీటెక్ తో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు☛ TGలో ITI కోర్సు అడ్మిషన్లు-2024.. 10వ తరగతి పాసైనవారు అర్హులు☛ TCS హైదరాబాద్లో ఒరాకిల్ క్లౌడ్ టెక్నికల్ పోస్టులు. ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు.
KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2008 డీఎస్సీ అభ్యర్థులకు అక్టోబర్ 4 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కరీంనగర్ డిఈఓ జనార్దన్ రావు తెలిపారు. బీఈడీతో డీఎస్సీ రాసి ఉద్యోగాలు రాని 220కి పైగా అభ్యర్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచినట్టు డీఈఓ తెలిపారు.
NLR: ఏపీ టెట్ (టీచర్ ఎలిజిబుల్ టెస్ట్) పరీక్షను అక్టోబర్ 3 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో రామారావు తెలిపారు. ఈ పరీక్షలు జిల్లాలోని PBR విశ్వోదయ కళాశాల (కావలి), RSR కళాశాల (కడనూతల), నారాయణ ఇంజినీరింగ్ కళాశాల ( నెల్లూరు), అయాన్ డిజిటల్ సెంటర్ (పొట్టేపాలెం)లో జరుగుతాయన్నారు. అభ్యర్థులు సమయానికి 30నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఎస్24FE పేరిట కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. 6.7 అంగుళాల డిస్ ప్లే, ఎగ్జినోస్ 2,400 చిప్ సెట్, 25W ఫాస్ట్ ఛార్జింగ్, 4,700mah బ్యాటరీ, ఏఐ ఫీచర్లతో ఈ ఫోన్ లభిస్తుంది. ఇప్పటికే ప్రీ- ఆర్డర్లు ప్రారంభమైన ఈ ఫోన్ 8జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.59,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.65,999. వచ్చే నెల 3 నుంచి రిటైల్ అమ్మకాలు ప్రారంభమవుతాయని క...
SKLM: ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ లో పీజీ డిప్లొమా ఇన్ గాంధీయన్ సోషల్ వర్క్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుజాత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏడాది కాల వ్యవధి గల ఈ కోర్సులో చేరేందుకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 5లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
ASF: వాంకిడి మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి తనిఖీ చేశారు. సందర్భంగా పాఠశాలలలోని తరగతి గదులను మరియు రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు పాఠాలను బోధించారు. సబ్జెక్టులపై ప్రశ్నలను అడిగారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి చూయించాలని పాఠశాల ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు.
SKLM: విల్ కోర్టు పరిధిలో పారాలీగల్ వలంటీర్లుగా పనిచేయడానికి ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సివిల్ జడ్జి హరిప్రియ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.నరసన్న పేట,పోలాకి మండలాల పరిధిలో పనిచేయడానికి వీలుగా అక్టోబర్ 8లోగాదరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలని, ఎంపికైన వారికి ఎటువంటి పారితోషికం ఉండదని స్పష్టం చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 264.27 పాయింట్ల నష్టంతో 85,571.85 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 26,179 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.70 వద్ద నిలిచింది.
AKP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా అనకాపల్లి రేబాక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 30న 3 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తునట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఎన్. గోవిందరావు శుక్రవారం తెలిపారు. ఈ ఇంటర్వ్యూలకు పదవ తరగతి నుండి పీజీ వరకు చదువుకొని 18 నుండి 30 సంవత్సరముల వయస్సు గల యువతీ, యువకులు అర్హులని పేర్కొన్నారు.
ప్రకాశం: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బందిని ఒప్పంద, అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపడుతున్నట్లు డీఈవో డి.సుభద్ర పేర్కొన్నారు. బోధనా సిబ్బందిని ఒప్పంద విధానంలో, బోధనేతర సిబ్బందిని అవుట్ సోర్సింగ్ కింద 2024-25 సంవత్సర కాలానికి భర్తీ చేస్తామన్నారు. మహిళా అభ్యర్థులు ఆన్లైన్ రూ. 250లు చెల్లించి దరఖాస్తు చేయాలన్నారు.