కృష్ణా: మొవ్వ మండంలోని వీఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో జేకేసీ, ఐక్యూఏసీ సంయుక్తంగా ఈ నెల 6వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మాధవి తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
SKLM: జిల్లా డా. బీ.ఆర్ ఏయు పరిధిలో ఈ నెల 10వ తేదీ నుంచి పలు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ ప్రకటనలో తెలిపారు. 10వ తేదీ నుంచి ఇంజినీరింగ్ 5వ సెమిస్టర్ పరీక్షలు, 13వ తేదీ నుంచి 7వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని అన్నారు. BPED, DPED 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయన్నారు.
MBNR: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం ద్వారా ఉపకార వేతనం పొందేందుకు అర్హత కలిగిన మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి శంకరా చారి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఈ-పాస్ సైట్ను ఉపయోగించి ఆన్ లైన్లో ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కామన్ అడ్మిషన్ టెస్ట్-2024కు సంబంధించిన ప్రొవిజనల్ కీ నేడు విడుదల కానుంది. క్యాట్ పరీక్షను ప్రభుత్వం దేశవ్యాప్తంగా మొత్తం 170 నగరాల్లో నవంబర్ 24న నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 3.29 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. నేడు విడుదల చేసే కీపై అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 5 రాత్రి 11:55 వరకు http://iimcat.ac.in ద్వారా ఆన్లైన్లో తెలియజేయాలని సూచించారు. కాగా ఫలితాలు జనవరిలో విడుదల అయ్యే అవ...
NRML: మైనారిటీలు ముఖ్యమంత్రి విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకోవాలని నిర్మల్ జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి మోహన్ సింగ్ ఒక ప్రకటనలో కోరారు. విదేశాలలో ఉన్నత చదువులు అభ్యసించే మైనారిటీలకు ఈ పథకం ద్వారా రూ. 20 లక్షల ఉపకార వేతనం, విమాన రవాణా ఖర్చు రూ. 40వేలు ఇస్తామన్నారు. డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండి PG, PHD చేయాలనుకునే వారు అర్హులన్నారు.
నవంబర్ నెలకు సంబంధించి మహింద్రా అండ్ మహింద్రా వాహనాల విక్రయాల వివరాలను సంస్థ వెల్లడించింది. నవంబర్ మాసంలో మొత్తం 79,083 వాహనాలను అమ్మినట్లు తెలిపింది. గతేడాది ఇదే సమయంలో అమ్ముడైన 70,576తో పోలిస్తే 12 శాతం పెరిగినట్లు పేర్కొంది. వీటిలో SUVకి చెందిన 46,222 వాహనాల విక్రయాలు జరిగాయని చెప్పింది.
జమ్మూకశ్మీర్లోని డల్ సరస్సులో ఉబర్ తన సేవలను ప్రారంభించింది. పడవ విహారానికి ‘ఉబర్ శికారా’ పేరిట ముందస్తు బుకింగ్ సేవలను సంస్థ ప్రారంభించింది. జలరవాణాకు సంబంధించి ఇటువంటి సేవలను తమ సంస్థ అందుబాటులోకి తీసుకురావడం ఆసియాలోనే ఇది తొలిసారి అని ఉబర్ వెల్లడించింది.
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు సవరించింది. రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తం FDలపై కొత్త రేట్లు వర్తించనున్నాయి. సవరించిన రేట్లు ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు పేర్కొంది. సాధారణ ఖాతాదారులకు 4-7.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 4-7.49 శాతం మధ్య వడ్డీ రేట్లు అమలు కానున్నాయి. సాధారణ ఖాతాదారులకు 7-45 రోజుల మధ్య డిపాజిట్లకు 4 శాతం వడ్డీని బ్యాంకు అమలు చేస్...
ఇది వరకు ఉన్న పాన్ కార్డు హోల్డర్లందరూ పాన్ 2.0 అప్గ్రేడ్ కోసం ఆటోమేటిక్గా అర్హులవుతారు. మీకు ఇప్పటికే PAN ఉంటే.. మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్త పాన్ కోసం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. కొత్త దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే గుర్తింపు, చిరునామా రుజువులను సమర్పించాలి. పన్ను చెల్లింపుదారులందరికీ PAN 2.0 ఉచితంగా అందించబడుతుంది.
IIT, NEET, IIIT వంటి ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో BE/BTech కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే JEE అడ్వాన్స్డ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 మే 18న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. CBT మోడ్లో పరీక్ష జరుగనుంది. ఒక అభ్యర్థి రెండేళ్లలో గరిష్ఠంగా రెండుసార్లు ఈ పరీక్షకు హాజరు కావచ్చు.
ఉభయసభలు నిత్యం వాయిదా పడటంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి చర్చలు లేకుండా వాయిదా పడటంపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. అదానీ వ్యవహారం, మణిపూర్ పరిస్థితి, సంభాల్, అజ్మేర్ ఘటనలు, నిరుద్యోగం మొదలైన అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయన్నారు. కానీ ప్రభుత్వానికి ఈ అంశాలపై చర్చించటం ఇష్టం లేఖ కావాలనే వాయిదా వే...
PPM: పాలకొండ మండల కేంద్రంలో డిసెంబర్ 10, 11వ తేదీల్లో సీపీఎం పార్టీ జిల్లా మహాసభ కురపాంలో జరుగుతాయని, దీనికి సంబంధించి గోడపత్రికను పాలకొండ మండల కమిటీ కన్వీనర్ ధావాలా రమణారావు సోమవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. మన్యం ప్రాంతంలో అనేక సమస్యలపై పరిష్కారానికి ఉద్యమాలు పోరాటం నిర్వహించాలని, సమస్యలను సమీక్షించుకుని పోరాటం చేస్తానని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ను రద్దు చేసింది. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, ముడి ఉత్పత్తుల గురించి నెలల పాటు చర్చలు జరిపిన అనంతరం ఈ ట్యాక్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రిలయన్స్, ఓఎన్జీసీ వంటి సంస్థలకు ఊరట లభిస్తుంది.
ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన రిటైల్ స్టోర్లను పెంచడానికి రెడీ అయ్యింది. దేశవ్యాప్తంగా ఈ నెలఖరులోగా 4 వేల స్టోర్లను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 800 స్టోర్ల సంఖ్యను 4 వేలకు పెంచనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ‘X’లో ప్రకటన చేశారు. డిసెంబర్ 20న దేశవ్యాప్తంగా అన్ని స్టోర్లూ ఒకేసారి ప్రారంభించన...
చాలా బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్లు EMI పద్ధతిలో లోన్లు ఇస్తున్నాయి. అయితే సులభంగా లోన్ రావాలంటే.. సిబిల్ స్కోర్ చాలా ముఖ్యమని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రుణ చెల్లింపులో ఆలస్యం చేస్తే చెక్ బౌన్స్తో పాటు సిబిల్ స్కోర్ కూడా తగ్గుతుంది. దీంతో భవిష్యత్తులో తీసుకునే రుణాలపై ప్రభావం పడుతుంది. బ్యాంక్ రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులు ఆలస్యం కాకుండా చూసుకుంటే.. సిబిల్ స్కోర్ మెరుగ్...