TG: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. CM విదేశీ విద్య స్కీమ్ కింద మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన వారు telanganaepass.cgg.gov.inలో ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్ తెలిపారు. US, UK, AUS, కెనడా, సింగపూర్, జర్మనీ తదితర దేశాల్లో PG, PHD చేస్తున్న వారు అర్హులు. ఎంపికైన వారికి రూ.20 లక్షల స్కాలర్ షిప్, విమాన టిక...
ఆదాయ పన్ను చెల్లింపునకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గత ఆర్థిక సంవత్సరానికిగానూ మరో 15 రోజులు పెంచింది. ఈ నిర్ణయంతో 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఐటీ రిటర్నులు డిసెంబర్ 15 లోపు దాఖలు చేసుకోవచ్చు. ఆదాయ పన్ను చట్టం, 1961కి లోబడి సెక్షన్ 139(1) కింద ఐటీ రిటర్నుల గడువు తేదీని పెంచినట్లు వెల్లడించింది.
ఆదాయ పన్ను చెల్లింపునకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గత ఆర్థిక సంవత్సరానికిగానూ మరో 15 రోజులు పెంచింది. ఈ నిర్ణయంతో 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఐటీ రిటర్నులు డిసెంబర్ 15 లోపు దాఖలు చేసుకోవచ్చు. ఆదాయ పన్ను చట్టం, 1961కి లోబడి సెక్షన్ 139(1) కింద ఐటీ రిటర్నుల గడువు తేదీని పెంచినట్లు వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ దేశాలు అంతర్జాతీయ మారక కరెన్సీగా అమెరికా డాలర్ స్థానంలో కొత్త కరెన్సీని సృష్టించినా, వేరే కరెన్సీని స్వీకరించినా ఆ దేశాలపై టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా డాలర్నే ఉపయోగిస్తామని బ్రిక్స్ దేశాల హామీ కావాలని తెలిపారు. లేదంటే, ఆ దేశాలు అమెరికా మార్కెట్లో అమ్మకాలను నిలిపేసుకోవాలని ప...
TG: సికింద్రాబాద్లోని రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్(CRC), ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(AOC) సెంటర్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 723 ట్రేడ్స్ మెన్/ ఫైర్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు https://www.aocrecruitment.gov.in/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవడాని...
TG: ఉస్మానియా వర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు OU కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంఫార్మసీ (పీసీఐ) రెండో సెమిస్టర్ మెయిన్, మొదటి, రెండు, మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 7 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో ...
SBI, ICICI బ్యాంకులు నవంబర్ 1 నుంచి క్రెడిట్కార్డు కొత్త నిబంధనలను ప్రకటించాయి. SBI రివార్డు పాయింట్ల వ్యాలిడిటీ మారింది. కార్డుతో EMI ద్వారా కొనుగోళ్లు చేస్తే అదనపు ఛార్జీలు విధించవచ్చు. ఆన్లైన్ బిల్లు చెల్లింపులు, ఆటో డెబిట్పై ఛార్జీలు వర్తించవచ్చు. ICICI కార్డులపై ఇంధన సర్ఛార్జ్ మినహాయింపులో మార్పులు చేసింది. రివార్డు పాయింట్ల రిడెంప్షన్ ప్రక్రియ మార్చింది. EMI కొనుగో...
HDFC బ్యాంకు అనుబంధ HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ IPOకు సిద్ధమైంది. ఈమేరకు సెబీకి ప్రాథమిక పత్రాలను సమర్పించింది. ఈ ఇష్యూ ద్వారా రూ.12,500కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్లో రూ.10వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా రూ.2,500కోట్ల నిధుల్ని సమీకరించనుంది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో HDFC బ్యాంక్కు 94.64 శాతం వ...
HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధి ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఈ, ఎంటెక్ మూడో సెమిస్టర్ రెగ్యులర్, రెండో సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 204 పాయింట్ల నష్టంతో 79,688 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 68 పాయింట్లు కుంగి 24,272 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.08గా ఉంది.
నల్లగొండ: జిల్లాలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎంబీఏ జనరల్, ఎంబీఏ టీటీఎం ఒకటి, రెండు, మూడు, నాలుగు సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఎంబీఏ జనరల్ 4వ సెమిస్టర్ 200 మంది విద్యార్థులకు గాను 191(95%) మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంజీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఫలితాలు సంబంధిత వెబ్సైట్లో ఉంటాయన్నారు.
దేశంలో గడచిన పదేళ్లలో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య భారీగా పెరిగింది. 2014-24 వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారుల పెరుగుదలపై SBI రీసెర్చ్ నివేదిక విడుదల చేసింది. అలాగే 2014లో మధ్యతరగతి ఆదాయం రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండగా 2024లో రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెరిగిందని పేర్కొంది. 2014లో పన్ను చెల్లించే వారి సంఖ్య 3.79 కోట్ల మంది ఉండగా 2014లో 8.62 కోట్...
NLG: చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 9వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశాలకు గాను దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 9వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ నాగభూషణం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష 2025 ఫిబ్రవరి 8వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. navodaya.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవలన్నారు.
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా నవంబర్, డిసెంబర్ మధ్య IND-US రూట్లలో 60 విమానాలు రద్దు చేసింది. నిర్వహణ సమస్య కారణంగా ఎయిర్క్రాప్ట్లు అందుబాటులో లేకపోవడంతో రద్దు చేసినట్లు సంస్థ ప్రకటించింది. పీక్ ట్రావెల్ పీరియడ్లో రద్దయిన వాటిలో శాన్ ఫ్రాన్సిస్కో, చికాగోకు వెళ్లే విమానాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఢిల్లీ-చికాగో 14, ఢిల్లీ-వాషింగ్టన్ 28, ముంబై-న్యూయార్క్ రూట్లో న...