NTR: చల్లపల్లి మండలం పురిటిగడ్డ జడ్పీ హైస్కూల్లో గురువారం విద్యార్థుల కోసం వండిన అన్నంలో పురుగులు కనిపించాయి. విద్యార్థులు గమనించి హెచ్ఎం కే.బీ.ఎన్ శర్మ దృష్టికి తీసుకువెళ్లడంతో, ఆయన వెంటనే స్పందించారు. బియ్యాన్ని జల్లించి శుభ్రం చేయించి వండించారు. వండిన అన్నం నాణ్యతను స్వయంగా పరిశీలించి, ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.