కాకినాడలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 8వ తేదీన ప్రధానమంత్రి అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వర్మ తెలిపారు. హైదరాబాద్కు చెందిన మేధా గ్రూప్ కంపెనీ 300 అప్రెంటిస్ ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని, ఐటీఐలో వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ ఉత్తీర్ణులై ఎన్టీసీ సర్టిఫికెట్ కలిగిన వారు సర్టిఫికెట్లతో ఉదయం 8 గంటలకు హాజరుకావాలని ఆయన కోరారు.