• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు వీరపనేనిగూడెం ప్రిన్సిపాల్

కృష్ణా జిల్లా వీరపనేనిగూడెం డాక్టర్ అంబేడ్కర్ గురుకులం ప్రిన్సిపాల్ గ్రేడ్-1 యశోద లక్ష్మి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున లభించిన ఈ అవార్డు APSWREIS‌కు ప్రతిష్టతను తీసుకువచ్చింది. తన కృషి, నిబద్ధతతో విద్యార్థుల అభ్యున్నతికి విశేష సేవలందించిన యశోద లక్ష్మికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

September 3, 2025 / 08:48 PM IST

‘మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలి’

AKP: నర్సీపట్నం టౌన్ ఎస్సై జీ.ఉమామహేశ్వరరావు పెదబొడ్డేపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్ధులకు బుధవారం మహిళా భద్రత, మత్తు పదార్ధాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. మహిళల భద్రత శక్తి యాప్ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. విద్యార్ధులకు మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్ధాల వల్ల జీవితాలు సర్వనాశనం అవుతాయన్నారు.

September 3, 2025 / 06:27 PM IST

పేద విద్యార్థులు ప్రతిభతో ఎదగాలి

కృష్ణా: పేద విద్యార్థులు ప్రతిభతో ఎదగాలని జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ అన్నారు. బుధవారం చల్లపల్లి ఎస్.ఆర్.వై.ఎస్.పీ హైస్కూల్లో పూర్వ విద్యార్థి, ప్రవాస భారతీయులు మండవ శేషగిరిరావు పేద విద్యార్థులకు సగం ధరకే లాప్ టాప్స్ అందచేశారు. 9వ తరగతి విద్యార్థి పోతార్లంక ధనుష్, 8వ తరగతి విద్యార్థిని గంజాల అశ్వినిలకు ఈ లాప్ టాప్స్ అందచేశారు.

September 3, 2025 / 04:35 PM IST

కేంద్ర ప్రభుత్వం దసరా కానుక

వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించిన కొత్త పన్ను రేట్లను నవరాత్రి నాటికి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో నిత్యావసరాలు, చిన్న కార్లు, హోటల్ సేవలు వంటివి చౌకగా మారనున్నాయి. అదే సమయంలో విలాసవంతమైన వస్తువుల ధరలు పెరగనున్నాయి. దసరా, దీపావళి పండగల ముందే ఈ కొత్త ధరల అమల్లోకి రావడం సామాన్యులకు పెద్ద ఊరటనిస్తుంది.

September 3, 2025 / 03:39 PM IST

పాతూరు ఉర్దూ పాఠశాల ఆకస్మికంగా తనిఖీ

NLR: ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని చదివితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఉర్దూ డీఐ షేక్ ఖాజా మొహిద్దీన్ తెలిపారు. బుధవారం వింజమూరులోని పాతూరు ఉర్దూ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను, బోధనా పరికరాలను పరిశీలించి పాఠశాలను చక్కగా నిర్వహిస్తున్న HM ఖాదర్ బాషాను అభినందించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

September 3, 2025 / 02:57 PM IST

రైతు సమస్యలు ప్రభుత్వానికి పట్టవా..?: SV మోహన్ రెడ్డి

KRNL: రైతు సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ మేరకు పెట్టుబడి సాయం, క్రాఫ్ట్ ఇన్సూరెన్స్, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పల పాలవుతున్నారని అన్నారు. ఈ నెల 9న ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతులతో కలిసి ధర్నాలు చేస్తున్నామన్నారు.

September 3, 2025 / 02:01 PM IST

RECORD: భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,06,970కి చేరింది. కాగా, 9 రోజుల్లో రూ.5,460 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.800 పెరిగి రూ.98,050 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.900 పెరిగి రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

September 3, 2025 / 10:20 AM IST

కాసేపట్లో జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 4 స్లాబులను రెండు స్లాబులకు తగ్గించే అవకాశం ఉంది. చిరువ్యాపారుల పర్మిషన్లను సులభతరం చేయనుంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే.. కేంద్రం జీఎస్టీ కొత్త రేట్లను తక్షణమే అమలు  చేయబోతుందనే వార్తల నేపథ్యంలో వేతన జీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

September 3, 2025 / 10:03 AM IST

ఓయూ దూరవిద్య ప్రవేశాల గడువు పెంపు

HYD: ఓయూ దూరవిద్య MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించిన్నట్లు PG అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. UGC-డెబ్ నిబంధనల ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 20 వరకు, రూ.500 అపరాధ రుసుముతో 25 వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఎంట్రన్స్ పరీక్ష 28న నిర్వహించనున్నామన్నారు.

September 3, 2025 / 08:22 AM IST

ASF ఉద్యోగులకు క్రీడా పోటీలు: రమాదేవి

ASF: తెలంగాణ రాష్ట్ర క్రీడా  ప్రాధికార ఆదేశాల మేరకు ASF జిల్లాలో వివిధ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు క్రీడా పోటీల సెలక్షన్స్ ఈ నెల 4 నుంచి నిర్వహించడం జరుగుతుందని డీవైఎస్ఓ రమాదేవి తెలిపారు. HYDలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలు కోసమే ఈ సెలక్షన్స్ నిర్వహించబడుతుందన్నారు. ఆసక్తి ఉన్న వారు 4 వ తారీకు ASF గిరిజన క్రీడా పాఠశాలలో హాజరుకావాలన్నారు.

September 3, 2025 / 05:52 AM IST

Ed.CET ఫేజ్-2 పూర్తి షెడ్యూల్ విడుదల..!

HYD: Ed.CET 2025 ఫేజ్-2 పూర్తి షెడ్యూల్ విడుదల చేసినట్లు HYD తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. SEP 4న సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన క్యాండిడేట్స్ వివరాలు అందుబాటులో ఉంచుతామని, SEP 5 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్స్, SEP 7న ఎడిట్ చేసుకునే అవకాశం,11వ తేదీన రిజల్ట్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.

September 3, 2025 / 04:07 AM IST

త్వరలో 6 వేల పోస్టులు భర్తీ చేస్తాం: మంత్రి

TG: వైద్య విద్యలో నాణ్యతకు పెద్దపీట వేశామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఇప్పటికే వైద్యరంగంలో 8 వేల పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. త్వరలో మరో 6 వేల పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. కొడంగల్, సంగారెడ్డి వైద్య కళాశాలకు అనుమతి వచ్చినట్లు పేర్కొన్నారు.

September 2, 2025 / 04:47 PM IST

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఉదయం నుంచి లాభాల్లో దూసుకెళ్లాయి. అయితే, ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 206.61 పాయింట్ల నష్టంతో 80,157.88 వద్ద.. నిఫ్టీ 45.45 పాయింట్లు లాభంతో 24,579.60 వద్ద నిలిచాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.88.16 వద్ద ఉంది.

September 2, 2025 / 04:10 PM IST

విద్యార్థినులకు అవేర్నెస్ ప్రోగ్రాం

KDP: మైదుకూరు బాల శివ యోగేంద్ర జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ నందు మైదుకూరు అర్బన్ ఎస్సై సుబ్బారావు విద్యార్థినీలకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్త్రీల పట్ల జరిగే నేరాలు, ఫోక్సో, గృహహింసలపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో ఎలా ఉపయోగించాలో వివరించారు.

September 2, 2025 / 02:13 PM IST

‘అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు చేసుకోండి ‘

సత్యసాయి: పెనుకొండ మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కేశవరావు సోమవారం తెలిపారు. కామర్స్, గణిత శాస్త్రం, వృక్షశాస్త్రం, చరిత్ర సబ్జెక్టులలో బోధించుటకు అతిథి అధ్యాపకులు కావాలన్నారు. సంబంధిత సబ్జెక్టులలో పోస్టు గ్రాడ్యుయేషన్ 55% ఉత్తీర్ణత కలిగిన వారు ఈ నెల 6లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు.

September 1, 2025 / 08:09 PM IST