సెప్టెంబర్ నాటికి మ్యూచువల్ ఫండ్(MF)లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య 5 కోట్లకు చేరింది. ఈ మార్కెట్లో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. గడిచిన 10 నెలల్లోనే కొత్తగా కోటి మంది ఇన్వెస్టర్లు MF విభాగంలో పెట్టుబడులను పెట్టారని తెలిపాయి. గతంలో కోటి మంది పెట్టుబడిదారులు రావడానికి 21 నెలలు పట్టగా, 2 కోట్ల నుంచి 4 కోట్లకు చేరేందుకు 26 నెలల సమయం మాత్...
ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ విభాగంలో ట్రేడింగ్ చేసిన వారిలో 91 శాతం మంది నష్టపోతున్నారని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. అంటే ప్రతి 10 మందిలో 9 మందికి నష్టాలే వస్తున్నాయని తెలిపింది. తక్కువ సమయంలో లాభాలను పొందొచ్చనే ఆశతో ఈ ట్రేడింగ్ వైపు మొగ్గు చూపుతున్నారని.. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు 73 లక్షల మంది నష్టాలు చవిచూసినట్లు తెలిపింది. వీరు సగటున రూ.1.2 లక్షల చొప్పున నష్టపోయినట్లు వెల్...
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ మార్కెట్లో కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. తన M సిరీస్లో M55s పేరిట విడుదల చేసింది. M55s 8GB+256GB వేరియంట్ రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. 12GB+256GB మరో రెండు వేరియంట్లు ఉన్నా.. వాటి ధరలను వెల్లడించలేదు. కోరల్ గ్రీన్, థండర్ బ్లాక్లో లభిస్తుంది. ఈనెల 26 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. బ్యాంకు కార్డులతో రూ.2 వేలు ...
రుణ భారంతో ఇబ్బంది పడుతున్న స్పైస్ జెట్కు NCLT మరోసారి నోటీసులు పంపించింది. ఆ సంస్థ ఆపరేషనల్ క్రెడిటార్లలో ఒకటైన టెక్ జాకీ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా NCLT ఈ నిర్ణయం తీసుకుంది. తమ నుంచి స్పైస్ జెట్ సంస్థ రూ.1.2 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ సేవలను వాడుకుందని టెక్ జాకీ సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్ను మహింద్ర ఖండేల్ వాలా, సంజీవ్ తంజాన్తో కూడిన బెంచి పరిశీలించింది. విచారణను నవంబర్...
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 339 పాయింట్ల లాభంతో 84,883 వద్ద ముగిసింది. నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 25,939 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.55గా ఉంది.
చిన్న టీ కొట్టు దగ్గర నుంచి రూ.లక్షల్లో చెల్లింపుల వరకు ఆర్థిక లావాదేవీలకు అత్యధికంగా యూపీఐ పద్ధతినే వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో UPI లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై లోకల్ సర్కిల్స్ అనే సంస్థ 42,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీరిలో 75 శాతం మంది ప్రజలు ఛార్జీలు విధిస్తే UPIని వినియోగించడం ఆపేస్తామని తేల్చేచెప్పారు. 25 శాతం రుసుము విధించ...
మెయిన్ బోర్డు కేటగిరిలో IPOకు వచ్చిన మన్బా ఫైనాన్స్ కంపెనీ సబ్స్క్రిప్షన్ క్షణాల్లోనే పూర్తయింది. ఇవాళ ఉదయం సబ్స్క్రిప్షన్ ప్రారంభం కాగా.. కొన్ని నిమిషాల్లోనే పూర్తి సబ్స్క్రిప్షన్ అందుకుంది. IPOలో భాగంగా రూ.151 కోట్ల సమీకరణకు 1.26 కోట్ల షేర్లను కంపెనీ విక్రయానికి పెట్టింది. ధరల శ్రేణిని రూ.114-120గా నిర్ణయించింది. కనీసం 125 ఈక్విటీ షేర్లకు సబ్స్క్రైబ్ చేసుకో...
UN సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ కార్యక్రమంలో గ్లోబల్ AI ఆపర్చునిటీ ఫండ్ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ CEO సుందర్పిచాయ్ ప్రకటించారు. గూగుల్ తరఫున ఈ ఫండ్లో భాగంగా 120 మిలియన్ డాలర్లు (రూ.వెయ్యి కోట్లు) సమకూరుస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కమ్యూనిటీల్లో AI ఎడ్యుకేషన్, శిక్షణకు ఖర్చు చేస్తామన్నారు. AI ఎడ్యుకేషన్, శిక్షణను స్థానిక భా...
TG: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. వైద్యారోగ్య శాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 5 చివరి తేదీగా ప్రకటించారు. వివరాలకు https://mhsrb.telangana.gov.in/MHSR...
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76 వేలు దాటింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరగ్గా రూ.69,800గా ఉంది. వెండి ధర రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. కాగా, కిలో వెండి ధర రూ.98,000గా ఉంది.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీ. ఫార్మసీ రెండవ సంవత్సరం రెండవ సెమిస్టర్ రెగ్యులర్ సప్లమెంటరీ, మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన పరీక్షా కేంద్రాలకు జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం తెలిపారు. కళాశాల వారీగా జంబ్లింగ్ చేసి నూతన పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు వెల్లడించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 310 పాయింట్లు ఎగబాకి 84,854 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 126 పాయింట్లు లాభపడి 25,917 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.83.47 వద్ద ఉంది.
ప్రకాశం: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీలో పదో తరగతి, ఇంటర్ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 28వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. రూ.300 అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు ఆన్లైన్లో అడ్మిషన్లు పొందవచ్చని డీఈఓ పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లు ఈ విషయాన్ని గమనించి అడ్మిన్ల సంఖ్య పెంచాలని డీఈవో తెలిపారు.
WG: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పొందేందుకు ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని యలమంచిలి ఎంఈవో–2 కనుమూరు వెంకట రామకృష్ణంరాజు పేర్కొన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, పురపాలక, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రకాశం: డాన్ బాస్కో సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న ఒంగోలులోని దాన్ బాస్కో ఐటీఐ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రధానాచా ర్యులు రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ డిప్లొమా, బీటెక్, బీ. ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్ధులు ధ్రువ పత్రాలతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.