బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,06,970కి చేరింది. కాగా, 9 రోజుల్లో రూ.5,460 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.800 పెరిగి రూ.98,050 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.900 పెరిగి రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.