SKLM: జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు జనరల్ ఒకేషనల్ విభాగాల్లో ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు గురువారంతో ముగుస్తుంది. జిల్లావ్యాప్తంగా జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 35 వేల మందికి పైగా చదువుతున్నారు. వీరంతా ఇవాళ సాయంత్రంలోపు పరీక్ష ఫీజు చెల్లించాలి.
KNL: APSSDC ఆధ్వర్యంలో ఆళ్లగడ్డలోని అనంత డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాలో 3 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. జీతం రూ.14 వేల నుంచి రూ.20 వేల వరుకు ఉంటుందని, 10వ తరగతి ఆపై చదివిన నిరుద్యోగులు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ రికార్డును కొల్లగొట్టింది. తొలిసారి లక్ష డాలర్ల మార్కును దాటేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి బిట్కాయిన్ విలువ పెరుగుతూనే ఉంది. క్రిప్టో కరెన్సీల విషయంలో ట్రంప్ సానుకూలంగా ఉండటమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
CTR: బైరెడ్డిపల్లె మండలంలోని కమ్మనపల్లె గురుకుల పాఠశా లలో భౌతిక, జీవశాస్త్ర ఉపాధ్యాయ పోస్టు లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు శుక్రవారం లోపు దరఖాస్తు చేయాలని పాఠశాల ప్రిన్సిపాల్ శోభ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు పాఠశాలలో సంప్రదించాలన్నారు.
SRD: సంగారెడ్డి లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో గురువారం తేదీన ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి అనిల్ కుమార్ ప్రకటనలో తెలిపారు. 10, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని చెప్పారు. 18 నుంచి 30 సంవత్సరాలకు వయసున్న అభ్యర్థులు జాబ్ మేళాకు హాజరుకావాలని పేర్కొన్నారు.
MDK: హవేలిఘనపూర్ లో డీసెట్ రాసి అనివార్య కారణాలతో గతంలో జరిగిన హాజరుకాని అభ్యర్థులు ఈనెల 5న జిల్లా విద్యా శిక్షణా సంస్థలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని డైట్ ప్రిన్సి పల్ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 7 నుంచి 9 వరకు మీ-సేవా కేంద్రాలలో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని, వీలైనన్ని ఎక్కువ కళాశాలలు ఎంపిక చేసుకోవాలని సూచించారు.
KMR: రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామ శివారులోని ఇటుక బట్టి వద్ద సీఆర్పీ మహమూద్ బడి ఈడు పిల్లల సర్వే చేపట్టారు. పదిమంది బడిఈడు పిల్లలను గుర్తించారు. ఈ పిల్లల కోసం ఆవాస ప్రాంత పాఠశాల ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు పిల్లల వివరాలు పంపించినట్లు మండల విద్యాశాఖ అధికారి ఆనందరావు తెలిపారు. పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
గురుగ్రామ్లోని ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన PGCILలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వివిధ ఆఫీస్లలో ఖాళీగా ఉన్న 71 ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ పూర్తి చేసి ఉండాలి. 28 ఏళ్లకు మించి ఉండకూడదు. జీతం రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు ఉంటుంది. https://www.powergrid.in/ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుక...
ELR: సత్రంపాడు ఐటీఐ కళాశాల వద్ద నిరుద్యోగ యువకులకు స్వల్పకాలిక శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రిన్సిపల్ రజిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8లోపు అప్లికేషన్ను స్వీకరిస్తామన్నారు. 30 సంవత్సరాలలోపు వారు పదవ తరగతి ఆపై చదువుకుని ఖాళీగా ఉన్న అభ్యర్థులు అర్హులని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
MDK: జిల్లావ్యాప్తంగా 101 పాఠశాలలో జరిగిన జాతీయ అచ్చీవ్ మెంట్ సర్వే పరీక్షలో 2514 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.3వ తరగతిలో 772, 6వ తరగతిలో 741, 9వ తరగతిలో 1001 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు. సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు,విద్యాశాఖ,మండల విద్యాధికారులు పరీక్షలను పరిశీలించారు.
SDPT: జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు బాల్రెడ్డి గత పదేళ్లుగా గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉచితంగా విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నారు. పాఠశాల సందర్శించిన జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి రిటైర్డ్ ఉపాధ్యాయులు బాల్రెడ్డి సేవలను గుర్తించి శాలువాతో ఘనంగా సన్మానించారు.
UPI లైట్కు సంబంధించి RBI కీలక ప్రకటన చేసింది. UPI లైట్ వాలెట్ పరిమితిని రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచింది. అలాగే, ఒక్కో లావాదేవీ పరిమితిని సైతం రూ. 500 నుంచి రూ.1000 పెంచుతున్నట్లు తెలిపింది. సత్వరమే జరిగే ఈ డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో లైట్ పరిమితిని పెంచినట్లు RBI పేర్కొంది. అక్టోబర్లో ఎంపీసీ భేటీ సందర్భంగా ఈ ప్రకటన చేసింది.
వంట నూనెల ఇండస్ట్రీలో గోల్డ్ డ్రాప్ సంస్థ ప్రఖ్యాతి గాంచిన విషయం తెలిసిందే. సంస్థ తన ఉత్పత్తుల్లో నాణ్యాత ప్రమాణాలు పాటించినందుకు ఏడోసారి కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్&ట్రేడ్ డెవలప్మెంట్(CITD)అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. సంస్థ సేల్స్&మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియాకు CITD అవార్డును ప్రధ...
NGKL: జిల్లా విద్యాధికారిగా రమేష్ కుమార్ బాధ్యతలు తీసుకున్న తొలి రోజే ఆకస్మిక తనిఖీ చేశారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులను తనిఖీ చేసిన అనంతరం తరగతి గదికి వెళ్లి 10 వ తరగతి విద్యార్థులకు గణితం బోధించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.