PLD: సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలను గురువారం రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు 80 గుడ్లు మాత్రమే అందించగా రికార్డులో 113 గుడ్లు రాయటంపై ఆమె ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఇలాంటివి చేస్తే ఉపేక్షించేది లేదని పద్మావతి హెచ్చరించారు.
ATP: కదిరిలో డిగ్రీ కళాశాల పక్కన ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థలకు రోజు పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డెక్కారు. STSN డిగ్రీ కాలేజీ వద్ద రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులకు AISP నాయకులు మద్దతుగా నిలిచారు. నాయకుడు నరసింహ మాట్లాడుతూ.. విద్యార్థుల పట్ల చులకనగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
TG: గ్రూప్-2 పరీక్షలపై TGPSC కీలక అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థుల ఇబ్బందులను పరిష్కరించేందుకు జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నంబర్లను తీసుకొచ్చింది. ఈ మేరకు ఫోన్ నెంబర్లతో కూడిన జాబితాను https://www.tspsc.gov.in/ లో పొందుపర్చింది. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్టికెట్లు డౌన్లోడ్ సమయంలో సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185, 040-23542187 నంబర్లకు సంప్ర...
కృష్ణా: చాట్రాయి మండలం కోటపాడు ఎంపీయూపీ స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిది. విద్యార్థుల తల్లిదండ్రుల వివరాల మేరకు.. బుధవారం మధ్యాహ్నం పాఠశాలలో విద్యార్థులు భోజనం తిన్న తర్వాత 9 మంది తీవ్ర కడుపునొప్పికి గురయ్యారు. అనంతరం వారిని స్థానిక పీహెచ్సీకి తరలించారు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త మెంబర్షిప్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ‘ONE BLCK’ పేరిట తీసుకొచ్చిన ఈ ప్లాన్ ద్వారా సభ్యత్వం పొందాలంటే స్విగ్గీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందాల్సి ఉంటుంది. 3 నెలల ప్లాన్ ధర రూ.299గా ఉంది. ఈ సేవలతో ప్రతి ఫుడ్ ఆర్డర్పై ఫాస్ట్ డెలివరీ, ఆన్-టైమ్ గ్యారెంటీ, ఇన్స్టామార్ట్లో ఉచిత డెలివరీలు, డైన్అవుట్పై ప్రత...
ATP: ఓబులదేవరచెరువు మండలంలోని గౌనిపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగనవాడి కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందించే పౌష్టిక ఆహార నాణ్యతను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు సకాలంలో పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని ఆదేశించారు.
కృష్ణా: మల్లవల్లి పారిశ్రామిక వాడలో 400 కంపెనీలు ప్రారంభించడం ఖాయమని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో 30 వేల ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చెప్పారన్నారు. ఎయిర్ పోర్డు, రైల్వే స్టేషన్, బందరు పోర్టుకు దగ్గరలో ఉన్న ఏకైక పారిశ్రామిక వాడ ఇదేనన్నారు.
PLD: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల సభ్యులు అన్నారు. గురువారం హరితోత్సవం సందర్భంగా ఎస్కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పట్టణంలోని పలు కళాశాల విద్యార్థులు చేత మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు నాటి పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా త్వరలోనే భారత్లో అడుగుపెట్టబోతుంది. ఢిల్లీలో షోరూం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. షోరూం ఏర్పాటుకు అనువైన స్థలం కోసం ఢిల్లీలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నారట. కాగా, భారత్లో ఎలాన్ మస్క్ రూ.25వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారని ఈ ఏడాది ప్రారంభంలో వార్తలు వచ్చాయి.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వ్యక్తిగత సంపాదనలో తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి దూసుకుపోయాడు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇంత సంపాదించిన వ్యక్తి లేరు. తాజాగా స్పేస్ ఎక్స్ లోని అంతర్గత వాటా విక్రయించడంతో.. ఆయన సంపాదన దాదాపు 50 బిలియన్ డాలర్లు పెరగడంతో.. 439.2 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకటించింది.
ఎన్టీఆర్: మైలవరంలోని లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా డొమెస్టిక్ బయోమెట్రిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ జిల్లా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మూడు నెలల పాటు నిర్వహించే ఉచిత శిక్షణకు పది, ఆపైన చదివిన వారు అర్హులని పేర్కొన్నారు.
అనిల్ అంబానీకి చెందిన ప్రముఖ రిలయన్స్ పవర్ ఓ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. విద్యుత్కు సంబంధించి ‘రిలయన్స్ న్యూ ఎనర్జీస్’ అనే పేరుతో ఈ సంస్థను ప్రారంభించింది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం మొదలైన సొల్యూషన్స్పై సంస్థ దృష్టి పెడుతోంది. దీనికి సీఈవోగా మయాంక్ బన్సల్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా రాకేశ్ ...
తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం జియో ‘న్యూఇయర్ వెలకమ్ ఆఫర్ ప్లాన్ 2025’ను తీసుకొచ్చింది. రూ.2025తో రిఛార్జ్ చేసుకుంటే 200 రోజుల వ్యాలిడితో రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత 5జీ డేటా, వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను వినియోగించుకోవచ్చు. అదనంగా రూ.2150 విలువైన కూపన్లు( రూ.500 ఏజియో, స్విగ్గీలో రూ.150, ఈజ్ మై ట్రిప్లో రూ.1500) పొందవచ్చు. ఈ ఆఫర్ జనవరి 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోట తన కొత్త తరం సెడాన్ కామ్రీని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.48 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ కారు లీటరుకు 25 కి.మీ మైలేజీ, 18 అంగుళాల అలాయ్ వీల్స్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 9 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, స్లిమ్ LED ల్యాంప్స్, డైటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి ఫ్యూచర్లతో వస్తుంది.
డెలివరీ వర్కర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కామర్స్ రంగంలో పని చేసే గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్ల సామాజిక భద్రత కోసం త్వరలో కొత్త పథకాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు వీరికి ఎలాంటి ఉద్యోగ ప్రయోజనాలు లేవని.. ఇకపై వారికి కూడా పెన్షన్, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలను కల్పించనున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది వర్కర్లు ఉండగా.. వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య కోట్ల...