SKLM: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలకు సంబంధించి మొదటి సెమిస్టర్ టైం టేబుల్ విడుదల అయింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అధికారి పద్మారావు విడుదల చేశారు. ఈ పరీక్షలు డిసెంబర్ 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
కోనసీమ: రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జవహర్ నాలెడ్జ్ సెంటర్( జెకెసి ) ఆధ్వర్యంలో ఈనెల 12న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పాల్గొంటున్నట్లు చెప్పారు. టెన్త్, ఐటిఐ, ఇంటర్, డిగ్రీ, బిటెక్, అర్హతలు కలిగి 30సంవత్సరాలలోపు గల అభ్యర్థులు అర్హులన్నారు.
విజయనగరంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో మంగళవారం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమో చదివి 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఈ మేళాలో బహుళజాతి కంపెనీలు పాల్గొంటున్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు https:// naipunyam.ap.gov.in వెబ్ సైట్ అప్లై చేసుకోవచ్చు.
నూతనంగా తీసుకువచ్చిన ఏఐ ద్వారా 800 కోట్ల ఫోన్ కాల్స్పై వినియోగదారులను హెచ్చరించినట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. అంతేకాకుండా 80 కోట్లకు పైగా మోసపూరిత సందేశాలను గుర్తించినట్లు తెలిపింది. తద్వారా స్పామ్ కాల్స్కు సమాధానం చెప్పే వినియోగదారుల సంఖ్య 12 శాతం వరకు తగ్గినట్లు పేర్కొంది. ఈ స్కామర్లు ఎక్కువగా ల్యాండ్లైన్ నుంచే మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించింది.
మదుపర్లకు సెబీ హెచ్చరికలు జారీ చేసింది. అనధికార వైబ్సైట్ల నుంచి అన్లిస్టెడ్ షేర్లను ట్రేడింగ్ చేయవద్దని సూచించింది. వీటి ద్వారా ట్రేడింగ్ చేయడం వల్ల వ్యక్తిగత వివరాలు అపహరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అందువల్ల అనధికార సైట్లలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని పేర్కొంది. గుర్తింపు ఉన్న స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా మాత్రమే నిధుల సమీకరణకు, షేర్ల ట్రేడింగ్కు అనుమతి ఉంటుందని చ...
ఈ ఏడాది నవంబర్లో దేశవ్యాప్తంగా 32,08,719 వాహన విక్రయాలు జరిగినట్లు వాహన డీలర్ల సమాఖ్య తెలిపింది. గతేడాది ఇదే నెలలో జరిగిన విక్రయాలతో పోలిస్తే 11.21 శాతం ఎక్కువని పేర్కొంది. పీవీ విభాగంలో వీటి విక్రయాల 3,21,943కి పడిపోయినట్లు వెల్లడించింది. అలాగే రిటైల్ విక్రయాలు మాత్రం పెరిగినట్లు చెప్పింది.
SKLM: పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో 3 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీ రాములు తెలిపారు. INTER , DEGREE,PG పూర్తిచేసి ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 16 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9553292734 సంప్రదించాలన్నారు.
SKLM: ఎచ్చెర్ల మండలం కేంద్రంలో గల ప్రభుత్వ ఐటిఐ కాలేజ్లో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి యు. సాయికుమార్ తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా పలు కంపెనీల్లో 120పోస్టులు భర్తీ చేయనున్నారు. SSC, INTER, డిగ్రీ, పూర్తిచేసే 18-35ఏళ్ల కలిగిన M/F అభ్యర్థులు అర్హులు అన్నారు. ఈ అవకాశం నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ అప్రధాన్య వ్యాపారాల నుంచి క్రమంగా తప్పుకుంటోంది. సినిమా, ఈవెంట్ టికెట్లను విక్రయించే పేటీఎం ఇన్సైడర్ను ఇటీవలే జొమాటోకు విక్రయించడం ద్వారా రూ.2,048 కోట్లు సమకూర్చుకుంది. తాజాగా జపాన్కు చెందిన పేపే కార్పొరేషన్లో తనకున్న వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. ఈ వాటాల విలువ సుమారు రూ.2,000 కోట్లు ఉంటుందని అంచనా.
వచ్చే వారం 11 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ప్రముఖ కంపెనీలు విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్ సబ్స్క్రిప్షన్ 11న ప్రారంభమై 13న ముగియనుంది. ఇన్వెంటరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, ఇంటర్వేషనల్ జెమోలాజికల్ ఇన్ట్సిట్యూట్, ధనలక్షి క్రాప్ సైన్స్, జంగిల్ క్యాంప్స్, టాస్ ది కాయిన్, పర్పుల్ యూనిల్ సేల్స్, సుప్రీమ్ పెసిలిటీ మేనేజ్మెంట్, యష్ హైవోల్టేజ్ కంపెనీలు ఐపీఓల ద్వారా నిధులు సమీకర...
JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో అకౌంటెంట్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ మాదాడి సులోచన తెలిపారు. కామర్స్లో డిగ్రీ లేదా బీకాం కంప్యూటర్స్ విద్యార్హత కలిగి ఉన్న మహిళ అభ్యర్థుల నుంచి ఈ నెల 12 లోగా దరఖాస్తులను ఎంఈఓ కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు.
TG: గ్రూప్-2 పరీక్షలను TGPSC ఈ నెల 15, 16వ తేదీల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మొత్తం నాలుగు పేపర్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్-1, పేపర్-2 డిసెంబర్ 15న, పేపర్-3, పేపర్-4 డిసెంబర్ 16న రెండు సెషన్లలో ఉండనున్నాయి. అయితే, ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు ఈ నెల 9వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని TGPSC కార్యదర్శి నవీన్ తెలిపారు.
ప్రైవేటురంగ టెలికాం కంపెనీ VI ప్రీపెయిడ్ యూజర్ల కోసం సూపర్ హీరో ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా అర్ధరాత్రి 12 నుంచి మ. 12 గంటల వరకు ఉచిత అపరిమిత డేటా పొందవచ్చు. ప్రస్తుతం రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉచిత డేటా ఇస్తోంది. ఇకపై అదనంగా ఆరు గంటల పాటు ఈ ప్లాన్ అమలు చేయనుంది. రూ.365పైబడి రీఛార్జ్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఇటీవల ‘బీఈ 6ఈ’ పేరిట ఓ విద్యుత్ కారును మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ‘6ఈ’ కోడ్ను తన విమాన సేవలకు వినియోగిస్తుండటంతో.. ట్రేడ్మార్క్ ఉల్లంఘన జరిగిందంటూ మహీంద్రాపై ఢిల్లీ హైకోర్టులో ఇండిగో కేసు వేసింది. దీంతో ఆ కారు పేరును ‘బీఈ 6’ మార్చాలని నిర్ణయించినట్లు మహీంద్రా సంస్థ పేర్కొంది. అయితే, ‘బీఈ 6ఈ...
ప్రకాశం: త్రిపురాంతకంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చదువులోనే కాకుండా ఇతర క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం వివిధ సంస్కృతి కార్యక్రమాలను ఆయన ఆసక్తిగా తిలకించారు.