• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

భారీగా పెరిగిన ఇళ్ల ధరలు

దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగినట్లు ఓ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ నివేదికలో వెల్లడించింది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్ మధ్య కాలంలో 25 ద్వితీయ శ్రేణి నగరాల్లో 65% పెరిగినట్లు చెప్పింది. జైపూర్, ఆగ్రా, గుంటూరు, మంగళూరు, చంఢీగఢ్‌లో భారీగా పెరుగుదల నమోదైందని పేర్కొంది. స్థలం రేటు తక్కువగా ఉండటం, మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు మెరుగుపడటం ఇందుకు కారణమని వ...

December 6, 2024 / 10:07 AM IST

ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. RBI ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఇవాళ ప్రకటించనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో 81,840 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 24,720 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ 5 పైసలు బలపడి 84.66 వద్ద ఉంది.

December 6, 2024 / 09:54 AM IST

పదేళ్లలో 121 శాతం పెరిగిన బిలియనీర్ల సంపద

గత పదేళ్లలో బిలియనీర్ల సంపద 121శాతం పెరిగినట్లు స్విట్జర్లాండ్ లోని యూబీఎస్‌ బ్యాంక్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. బిలియనీర్ల సంఖ్య కూడా పదేళ్లలో 1757 నుంచి 2,682కు చేరిందని బ్యాంక్‌ తెలిపింది. ఈ ఏడాది 268 మంది కొత్తగా బిలియనీర్లు అవ్వగా.. వీరిలో 60 శాతం మంది ఎంటర్‌ప్రెన్యూర్లేనని నివేదిక  పేర్కొంది.

December 6, 2024 / 08:45 AM IST

విద్యార్థి జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో

NDL: నందికొట్కూరు పట్టణంలోని విద్యానగర్, ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న చిన్నారి ఆస్తా మహిన్ (8) మృతికి కారకులైన పాఠశాల హెచ్ఎం సబిహ, ఎంఈఓ నబిసాలను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు పీడీఎస్‌యు, ఎస్ఎఫ్ఎ, డిమాండ్ చేశారు.

December 6, 2024 / 08:27 AM IST

7న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం: కలెక్టర్

KRNL: ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఈనెల 7న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీరంజిత్ బాషా వెల్లడించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థి ప్రగతి తెలుసుకోవడానికి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన విద్య అందించడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని తెలిపారు.

December 6, 2024 / 08:25 AM IST

క్విక్ కామర్స్ సేవలు ప్రారంభించిన మింత్రా

ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల ఇ-కామర్స్ సంస్థ మింత్రా క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. ‘ఎం-నౌ’ పేరుతో బెంగళూరులో సేవలను ప్రారంభించింది. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు మింత్రా CEO నందితా సిన్హా తెలిపారు. ఎం-నౌ సేవల్లో భాగంగా ఆర్డరు పెట్టిన 30 నిమిషాల్లోనే డెలివరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవల ద్వారా ఇప్పటివరకు 10వేల ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని, త్వరలో ఒ...

December 6, 2024 / 08:10 AM IST

ANU మహిళ హాస్టల్ చీఫ్ వార్డెన్ నియామకం

GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మహిళ హాస్టల్ చీఫ్ వార్డెన్‌గా బోటనీ అండ్ మైక్రో బయాలజీ విభాగానికి చెందిన అధ్యాపకురాలు మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఇన్చార్జి వీసీ ఆచార్య గంగాధరరావు ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు చీఫ్ వార్డెన్‌గా సునీత, డిప్యూటీ వార్డెన్‌లుగా ఏఎస్వీ రాధిక, వీ. సుభాషిని, టీ. ఝాన్సీలను నియమించారు.

December 6, 2024 / 06:50 AM IST

ఈనెల 9న ఐటీఐలో జాతీయ అప్రంటీస్ మేళా

ప్రకాశం: ఒంగోలు నగరంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఈ నెల 9న ప్రధానమంత్రి జాతీయ అప్రంటీస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎంవీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ అర్హులేనన్నారు. జిల్లాలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. పూర్తి వివరాలకు 9709165456 సంప్రదించాలన్నారు.

December 6, 2024 / 06:42 AM IST

ఈ నెల 9న ఐటిఐలో అప్రెంటిస్ మేళా

SKLM: ఎచ్చెర్ల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం(ఐటీఐ)లో ఈ నెల 9న PM అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు ప్రకటనలో తెలిపారు. 7 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి అర్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.

December 6, 2024 / 04:16 AM IST

విశ్వవిద్యాలయం నుంచి అనిల్‌కు గోల్డ్ మెడల్

PLD: తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి గోగా అనిల్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. నెకరికల్లు మండలం రూపెనగుంట్ల గ్రామానికి చెందిన అనిల్ మహమ్మారి, ప్రజారోగ్య శాస్త్రములో గోల్డ్ మెడల్ సాధించాడు. తమిళనాడు కేంద్ర విశ్వవిద్యాలయంలో జరిగిన 9వ స్నాతకోత్సవంలో కులపతి పద్మనాభన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్‌ను అందజేశారు.

December 6, 2024 / 04:11 AM IST

సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

SKLM: జిల్లాలో DR. BR. అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల తేదీలను యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ డా. జి.పద్మారావు విడుదల చేశారు. ఈ పరీక్షలు డిసెంబర్ 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.

December 6, 2024 / 04:02 AM IST

10వ తేదీన జాబ్ మేళా

TPT: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(NAC)లో 10వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. అపోలో ఫార్మసీ, కోల్ మన్ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. ఇంటర్, డిగ్రీ, బి ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు అని పేర్కొన్నారు.

December 6, 2024 / 04:02 AM IST

రేపటి నుంచి వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ రేపటి నుంచి 17వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్‌ 12, 12R, నార్డ్ 4 ఫోన్లపై రాయితీ, బ్యాంకు డిస్కౌంట్లు అందిస్తోంది. 12 నెలల వరకు నో‌కాస్ట్‌ EMI సదుపాయం కల్పిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా వంటి స్టోర్లలో ఆఫర్లు లభిస్తాయి.

December 5, 2024 / 11:19 PM IST

IPOకు రానున్న విశాల్ మెగామార్ట్

సూపర్ మార్టులను నిర్వహించే విశాల్ మెగామార్ట్ IPOకు రానుంది. ఈ నెల 11న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమై 13న ముగియనుంది. ధరల శ్రేణి వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది. రూ.8వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా వస్తున్న ఈ IPO పూర్తి ఆఫర్ ఫర్ సేల్ రూపంలో షేర్లను విక్రయించనుంది. కాగా, దేశవ్యాప్తంగా 626 విశాల్ మెగామార్ట్ స్టోర్లు ఉన్నాయి. మొబైల్ యాప్, వెబ్‌సైట్ ద్వారా కూడా విక్రయాలు జరుపుతోంది.

December 5, 2024 / 02:58 PM IST

మిశ్రమంగా స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 14 పాయింట్ల లాభంతో 80,970 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 24,443 దగ్గర ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి 84.71 ఉంది. 

December 5, 2024 / 09:52 AM IST