NGKL: జిల్లాలోని పాఠశాలలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని నాగర్ కర్నూల్ నూతన డీఈఓ రమేష్ కుమార్ అన్నారు. కల్వకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ రిజిస్టర్లను డీఈఓ పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని విద్యార్థులకు గణిత పాఠాలు బోధించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 111 పాయింట్ల లాభంతో 80,956 వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 24,467 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.74గా ఉంది.
HYD: సైబర్ క్రైమ్పై విద్యార్థులకు అవగాహన ఉండాలని సికింద్రాబాద్ నార్త్ జోన్ DCP రష్మి పెరుమాళ్ అన్నారు. బుధవారం గోపాలపురం PS ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. సైబర్ క్రైమ్, వ్యక్తిత్వ వికాసం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగం అయిన మెడ్ ప్లస్ మెడికల్ షాప్, హైదరాబాద్ నందు ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 6 న శుక్రవారం ఉదయం 10.00 గంటలకు మోడల్ కెరీర్ సెంటర్ ప్రభుత్వ ఐటీఐ ఖమ్మం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్. మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
KMM: ముదిగొండ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పూవాళ్ళ దుర్గాప్రసాద్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని, పేద విద్యార్థుల కోసం మెస్ ఛార్జీలను పెంచిందని అన్నారు.
TG: రాష్ట్ర ప్రభుత్వం BTech మేనేజ్మెంట్ కోటా ఫీజులను ఖరారు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. బీ కేటగిరీ కోటా ఫీజులను కన్వీనర్ కోటా సీట్ల ఫీజుకు అదనంగా మూడు రెట్లు పెంచే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఉన్నత విద్యామండలి త్వరలోనే ప్రభుత్వం ముందు ఉంచనున్నట్లు సమాచారం. బీ కేటగిరీ సీట్ల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ సీట్లను ఆన్లైన్లో భర్తీ చేయాలని ప్రభుత్...
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే 54వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. త్వరలో మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎస్సీ వర్గీకరణ పూర్తైన వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 16 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని యోచిస్తోంది. వీటిలో ఎక్కువగా టీచర్, గ్రూప్-3 ఉద్యోగాలే ఉన్నట్లు సమాచారం.
ప్రకాశం: డీఈఎస్ఈడీ మొదటి సంవత్సరం సప్లమెంటరీ(2018-20) పరీక్ష ఫలితాలపై ఈనెల 7 లోపు రీకౌంటింగ్ కోసం ఫీజు చెల్లించాలని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. డమ్మీ మార్కుల జాబితాలు ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. సబ్జెక్టుకు రూ.500 చొప్పున సీఎఫ్ఎంఎస్ ద్వారా చలానా తీసి డమ్మీ మార్కుల జాబితాను జతచేసి సెల్ఫ్ అడ్రసు కవర్తో నేరుగా అందజేయాలని ఆయన కోరారు.
ప్రకాశం: జిల్లా డీఈఎల్ఈడీ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ నవంబరు 2024 నకు సంబంధించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు డీఈఓ అత్తోట కిరణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాలను WWW.BSE.AP.GOV.IN వెబ్సైట్లో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఎవరైనా రీకౌంటింగ్కు దరఖాస్తు చేస్తే సబ్జెక్టునకు రూ.500 లతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
TG: రాష్ట్రంలోని అసిస్టెంట్ ఇంజినీర్ నియామక ఫలితాలు విడుదల అయ్యాయి. ఎలక్ట్రిక్ విభాగంలో 50, మెకానికల్ విభాగంలో 97 మందిని TGPSC సెలెక్ట్ చేసింది. కాగా ఈ ఉద్యోగాల భర్తీకి TGPSC 2022లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పరీక్షకు 13,820 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,198 మంది పరీక్ష రాశారు. పోస్టులకు ఎంపికైనా అభ్యర్థులు వివరాలను https://websitenew.tspsc.gov.in/లో చూసుకోవచ్చు.
NZB: తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ 5 సంవత్సరాల కోర్సెస్(ఏపీఈ, ఐపీసీహెచ్) V, VII, & IXసెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలతో పాటు ఐఎంబీఏ, V సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల తేదీల్లో వర్శిటీ అధికారులు మార్పులు చేశారు. డిసెంబర్ 5 నుంచి16 వరకు జరగాల్సిన పరీక్షలు డిసెంబర్ 17 నుంచి 23 వరకు మార్పు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం.అరుణ పేర్కొన్నారు.
W.G: మార్చిలో జరుగు ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించని అభ్యర్థులందరూ డిసెంబర్ 5 లోగా అపరాధ రుసుము లేకుండా చెల్లించాలని జిల్లా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజినల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ నరసింహం మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జనరల్, లోకేషనల్ కోర్సుల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
KRNL: డీఈఓ శ్యామ్యూల్ పాల్ ఆదేశాల మేరకు పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో ఈ నెల 7న పీటీఎం సమావేశం నిర్వహించాలని ఎంఈఓ-2 రామమూర్తి మంగళవారం తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని సూచించారు.
BHPL: చేర్యాల మండలం కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల జూ. కళాశాలలో ఇంగ్లీష్, నర్సింగ్ బోధించేందుకు అతిథి మహిళా అధ్యాపకుల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రత్యేక అధికారిణి కృష్ణవేణి తెలిపారు. ఇంగ్లిష్ బోధించుటకు పీజీ, నర్సింగ్ బోధించుటకు బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఈనెల 4 నుంచి 9 వరకు సంబంధిత కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలి సూచించారు.
అన్నమయ్య: అంగళ్లు సమీపంలోని మిట్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని లాస్య ప్రియ ఎన్సీసీలో సత్తా చాటారు. మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్: సీ. యువరాజ్ మాట్లాడుతూ.. కర్ణాటకలోని దండేలి నందు వాటర్ రాఫ్టింగ్ పోటీలలో తమ కళాశాల ఎన్సీసీ క్యాడెట్ లాస్య ప్రియ రాష్ట్రస్థాయిలో విజయం సాధించిందన్నారు. కల్నల్ మోహన్ నాయక్ ప్రశంసా పత్రాన్ని అందజేశారన్నారు.