RBI చిన్న, సన్నకారు రైతులకు ఊరట కల్పించింది. రైతులకు తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితిని పెంచింది. ప్రస్తుతం రైతులు ఎలాంటి తాకట్టు చూపించకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉండగా.. తాజాగా దాన్ని రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనిపై త్వరలోనే RBI సర్క్యులర్ జారీ చేయనుంది. ఈ రుణాలపై పరిమితిని చివరిసారిగా 2019లో రూ.లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచారు.
వచ్చే వారం రెండు కంపెనీలు IPOకు రానున్నాయి. సాయి లైఫ్ సైన్సెన్స్, విశాల్ మెగామార్ట్ కంపెనీల సబ్స్క్రిప్షన్ డిసెంబరు 11న ప్రారంభమై.. 13న ముగియనున్నాయి. సాయి లైఫ్ సైన్సెన్స్ ఐపీఓ ధరల శ్రేణిని రూ.522-549గా నిర్ణయించగా.. 16న షేర్ల అలాట్మెంట్, 18న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానుంది. రూ.8వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా వస్తున్న విశాల్ మెగామార్ట్ కంపెనీ ధరల శ్రేణి రూ.7...
నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 7న నిర్వహించే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశానికి ప్రతిఒక్కరినీ ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
KNL: బనగానపల్లెలోని నెహ్రూ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈనెళల 12న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 30 రకాల బహుళ జాతీయ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటుండగా.. 1,000కి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
కృష్ణా జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో మిషన్ వాత్సల్య, సాక్ష్యం, శక్తి పథకాల అమలుకై కాంట్రాక్ట్ పద్ధతిన 14 ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు 42 సంవత్సరాలలోపు వయసున్న అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థులు ఈ నెల 7లోపు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ధరల స్థిరీకరణ కీలకమని RBI గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన ఆయన.. కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రెపో రేటును 6.5% వద్ద కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది. కాగా.. వరుసగా 11వ సారి ఎలాంటి మార్పు చేయకపోవటం గమనార్హం.
దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగినట్లు ఓ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ నివేదికలో వెల్లడించింది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్ మధ్య కాలంలో 25 ద్వితీయ శ్రేణి నగరాల్లో 65% పెరిగినట్లు చెప్పింది. జైపూర్, ఆగ్రా, గుంటూరు, మంగళూరు, చంఢీగఢ్లో భారీగా పెరుగుదల నమోదైందని పేర్కొంది. స్థలం రేటు తక్కువగా ఉండటం, మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు మెరుగుపడటం ఇందుకు కారణమని వ...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. RBI ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఇవాళ ప్రకటించనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో 81,840 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 24,720 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ 5 పైసలు బలపడి 84.66 వద్ద ఉంది.
గత పదేళ్లలో బిలియనీర్ల సంపద 121శాతం పెరిగినట్లు స్విట్జర్లాండ్ లోని యూబీఎస్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. బిలియనీర్ల సంఖ్య కూడా పదేళ్లలో 1757 నుంచి 2,682కు చేరిందని బ్యాంక్ తెలిపింది. ఈ ఏడాది 268 మంది కొత్తగా బిలియనీర్లు అవ్వగా.. వీరిలో 60 శాతం మంది ఎంటర్ప్రెన్యూర్లేనని నివేదిక పేర్కొంది.
NDL: నందికొట్కూరు పట్టణంలోని విద్యానగర్, ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న చిన్నారి ఆస్తా మహిన్ (8) మృతికి కారకులైన పాఠశాల హెచ్ఎం సబిహ, ఎంఈఓ నబిసాలను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు పీడీఎస్యు, ఎస్ఎఫ్ఎ, డిమాండ్ చేశారు.
KRNL: ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఈనెల 7న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీరంజిత్ బాషా వెల్లడించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థి ప్రగతి తెలుసుకోవడానికి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన విద్య అందించడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఫ్యాషన్, లైఫ్స్టైల్ ఉత్పత్తుల ఇ-కామర్స్ సంస్థ మింత్రా క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. ‘ఎం-నౌ’ పేరుతో బెంగళూరులో సేవలను ప్రారంభించింది. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు మింత్రా CEO నందితా సిన్హా తెలిపారు. ఎం-నౌ సేవల్లో భాగంగా ఆర్డరు పెట్టిన 30 నిమిషాల్లోనే డెలివరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవల ద్వారా ఇప్పటివరకు 10వేల ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని, త్వరలో ఒ...
GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మహిళ హాస్టల్ చీఫ్ వార్డెన్గా బోటనీ అండ్ మైక్రో బయాలజీ విభాగానికి చెందిన అధ్యాపకురాలు మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఇన్చార్జి వీసీ ఆచార్య గంగాధరరావు ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు చీఫ్ వార్డెన్గా సునీత, డిప్యూటీ వార్డెన్లుగా ఏఎస్వీ రాధిక, వీ. సుభాషిని, టీ. ఝాన్సీలను నియమించారు.
ప్రకాశం: ఒంగోలు నగరంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఈ నెల 9న ప్రధానమంత్రి జాతీయ అప్రంటీస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎంవీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ అర్హులేనన్నారు. జిల్లాలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. పూర్తి వివరాలకు 9709165456 సంప్రదించాలన్నారు.
SKLM: ఎచ్చెర్ల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం(ఐటీఐ)లో ఈ నెల 9న PM అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు ప్రకటనలో తెలిపారు. 7 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి అర్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.