• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

నేటి నుంచి ఎస్ఏ-1 పరీక్షలు

TPT: జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో అర్థ వార్షిక పరీక్షలు సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ మోడల్ పేపర్ (ఎస్ఏటీఎంపీ) టర్మ్-1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

December 11, 2024 / 07:06 AM IST

13న ఎడ్‌సెట్ స్పాట్ అడ్మిషన్లు

TPT: ఈ నెల 13వ తేదీన ఎడ్‌సెట్ -2024 స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఎస్వీయూలోని అడ్మిషన్స్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు అడ్మిషన్లు ప్రారంభం కానున్నట్టు రిజిస్ట్రార్ భూపతినాయుడు తెలిపారు. ఆసక్తి కల్గిన వారు, ఎడ్‌సెట్ ర్యాంకు కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావచ్చని వర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ బాబు కోరారు.

December 11, 2024 / 07:05 AM IST

పీజీ పరీక్షల టైం టేబుల్ విడుదల

కృష్ణా: యూనివర్శిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో సైన్స్, ఆర్ట్స్ గ్రూపులలో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 28 నుంచి 2025 జనవరి 10 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది.

December 11, 2024 / 06:48 AM IST

RBI గవర్నర్‌గా నేడు సంజయ్ బాధ్యతల స్వీకరణ

ఆర్బీఐ 26వ గవర్నర్‌గా ఇవాళ సంజయ్ మల్హోత్రా బాధ్యతలను స్వీకరించనున్నారు. సంజయ్ మూడేళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగనున్నారు. తన 33 ఏళ్ల కెరీర్‌లో పవర్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రెవెన్యూ, ఆర్థిక, గనులు మొదలైన అనేక రంగాల్లో పని చేశారు. సంజయ్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్‌ IAS అధికారి. ఐఐటీ కాన్పూర్‌ నుంచి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు.

December 11, 2024 / 06:15 AM IST

2025లో ఐపీఓకి రానున్న జెప్టో

ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో ఐపీఓకి రానుంది. ఈ విషయాన్ని సంస్థ కో- ఫౌండర్ ఆదిత్ పాలిచా తెలిపారు. 2025లో ఐపీఓ ద్వారా ప్రైమరీ మార్కెట్‌లోకి రావాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. 2026 నాటికి అప్పులన్నీ తీరిపోయి సంస్థ లాభాల్లోకి అడుగుపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జెప్టో ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని.. రోజుకు వేల వస్తువులను 10 నిమిషాల్లోనే కస్టమర్లకు డెలివరీ చేస్తున్...

December 11, 2024 / 04:50 AM IST

జిల్లా స్థాయి పరీక్షలో సత్తా చాటిన గుండెమడకల విద్యార్థులు

NLR: స్క్రీనింగ్ పరీక్షల్లో గుండెమడకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో సత్తా చాటారు. కౌశల్ -2024 ఏపీ సైన్స్ సిటీ సంయుక్తంగా నిర్వహించిన జిల్లా స్థాయి స్క్రీనింగ్ పరీక్షలో 10వ తరగతి చదువుతున్న సాయి తేజ, షణ్ముఖ ప్రియ విద్యార్థులు సత్తా చాటారని HM తెలిపారు. డిసెంబర్ 30న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పాల్గొంటారన్నారు.

December 11, 2024 / 04:16 AM IST

₹10 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్‌

మోటో G35 5G పేరిట మరో కొత్త ఫోన్‌ను ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరొలా మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్.. 6.72 అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే, 240Hz టచ్ సాంప్లింగ్ రేటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్-3 ప్రొటెక్షన్, 50MP కెమెరా, 5000mah బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్-3 ప్రాసెసర్ వంటి ఫ్యూటర్లతో లభిస్తోంది. 4GB+128GB వేరియంట్ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది.

December 11, 2024 / 03:45 AM IST

క్విక్ కామర్స్ విభాగంలోకి అమెజాన్

క్విక్ కామర్స్ విభాగంలోకి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అడుగుపెట్టబోతుంది. ఈ నెలాఖరులోగా క్విక్ కామర్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ముందుగా బెంగళూరులో సేవలను ప్రారంభించనున్నట్లు అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ వెల్లడించారు. ఈ సేవల కోసం 2వేల ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఇతర నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నట్లు చ...

December 11, 2024 / 03:05 AM IST

విద్యార్థులకు ALERT

డిస్టెన్స్, ఆన్‌లైన్‌లో హైయిర్ ఎడ్యుకేషన్‌లో కోర్సులను చదువుతున్న విద్యార్థులను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్రమత్తం చేసింది. ఈ కోర్సులకు సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్ నోటీసులు వైరల్ అవుతున్నాయని తెలిపింది. కోర్సులకు సంబంధించిన అప్‌డేట్స్ కేవలం అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ఇస్తామని సూచించింది. UGC వెబ్‌సైట్ ugc.gov.inలో వచ్చే నోటిఫికేషన్లను మాత్రమే నమ్మాలని...

December 10, 2024 / 05:54 PM IST

ఏయూలో ఆర్గానిక్ ఉత్పత్తుల మేళా

VSP: ఈనెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఆర్గానిక్ ఉత్పత్తుల మేళా నిర్వహిస్తున్నట్లు శాసనమండలి పూర్వ సభ్యులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఇంతవరకు అతిపెద్ద మేళా బెంగళూరులో నిర్వహించరని, అంతకన్నా పెద్ద మేళా ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు.

December 10, 2024 / 12:23 PM IST

FLASH: భారీగా పెరిగిన ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగి రూ.78,600 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరగటంతో రూ.72,050గా ఉంది. కాగా, వెండిపై ఏకంగా రూ.4000 పెరగ్గా కిలో వెండి ధర రూ.1,04,000కు చేరింది.

December 10, 2024 / 10:40 AM IST

జిల్లాలో గురుకుల పాఠశాలలో పోస్టులకు ఎంపికలు

VZM: జిల్లాలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను పార్ట్ టైం ప్రాతిపదికన బర్తీ చేస్తామని జిల్లా సమన్వయకర్త ఫ్లోరెన్స్ తెలిపారు. నెల్లిమర్ల గురుకుల పాఠశాలలో ఈనెల 12న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. గణితం, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, ఇంగ్లీష్, సివిక్స్, బోటనీ పోస్టులకు అభ్యర్థులను నియమిస్తామన్నారు.

December 10, 2024 / 09:19 AM IST

నేడు DSC ఉచిత శిక్షణ దరఖాస్తుకు ఆఖరు గడువు

VZM: మైనార్టీ అభ్యర్థులకు DSCలో ఉచిత శిక్షణకు మంగళవారంతో దరఖాస్తుకు గడువు ముగుస్తున్నట్లు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల కార్యనిర్వాహక సంచాలకుడు RS జాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు www.apcedmmwd.org వెబ్సైటులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 0866 2970567 నంబరు లేదా కార్యాల యంలో సంప్రదించాలన్నారు.

December 10, 2024 / 09:00 AM IST

కేఆర్కే డిగ్రీ కళాశాలలో 59మంది ఉద్యోగాలకు ఎంపిక

ప్రకాశం: అద్దంకి సమీపంలోని శింగరకొండలో ఉన్న కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాబ్ మేళాలలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు 59 మంది ఎంపిక అయినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వి.మోహనరావు తెలిపారు. మొత్తం 116 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, 104 మంది హాజరయ్యారు. మేళాలో పలు కంపెనీలకు 59 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

December 10, 2024 / 08:36 AM IST

43 మంది విద్యార్థులు ఎంపిక

ప్రకాశం: ఒంగోలులోని ప్రభుత్వ బాలుల ఐటీఐ కళాశాలలో సోమవారం జరిగిన జాబ్ మేళాకు 72 మంది విద్యార్థులు హాజరుకాగా, 43 మంది అప్రెంటీస్‌ శిక్షణకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఈ అప్రంటీస్‌ మేళాలో ఐటీఐ విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. అప్రంటీస్‌ షిప్‌ మేళాను విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు.

December 10, 2024 / 08:09 AM IST