వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థ్రెడ్స్ సేవల్లో అంతరాయం కలుగుతున్నట్లు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ మెసేజ్లు వెళ్లడం లేదని, లాగిన్ అవ్వడం లేదని వేలాది మంది యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. 50వేల మందికి పైగా ఫేస్బుక్ యూజర్లు, 23వేల మందికి పైగా ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలకు సన్నద్ధంకావాలని సూచించారు. అలాగే, విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలకు సన్నద్ధంకావాలని సూచించారు. అలాగే, విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
AP: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను మంత్రి లోకేష్ విడుదల చేశారు. మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధించాలని సూచించారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీషెడ్యూల్ విడుదలైంది. డిగ్రీ 1వ సెమిస్టర్, 5వ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 25 నుంచి జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ఈ పరీక్షలను డిసెంబర్ 21 నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు బుధవారం వెల్లడించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 81,568.39 పాయింట్ల వద్ద ఫ్లాట్గా ప్రారంభమైంది. చివరికి 16 పాయింట్ల లాభంలో 81,526.14 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.75 పాయింట్లు లాభంలో 24,641.80 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.84గా ఉంది.
ఈ రోజు ఐదు కంపెనీల IPO సబ్స్క్రిప్షన్ ప్రారంభమైంది. ప్రధాన విభాగంలో విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్.. SME విభాగంలో పర్పుల్ యునైటెడ్ సేల్స్, సుప్రీమ్ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కంపెనీల సబ్స్క్రిప్షన్ మొదలైంది. వీటిలో మొబిక్విక్ పబ్లిక్ ఇష్యూ తొలిగంటలోనే పూర్తి సబ్స్క్రిప్షన్ అందుకుంది. కాగా, 13న ఈ కంపెనీల IPO సబ్స్క్రిప్షన్ ముగియనుంది.
NGKL: జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐ.టీ.ఐ కళాశాలలో ఈనెల 13 వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్ సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఇన్ పార్మసీ, బి.ఫార్మసీ, ఆ పైన చదివిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు.
ప్రకాశం: జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఖాళీల భర్తీ చేసేందుకు బుధవారం ప్రాజెక్టు డైరెక్టర్ శారద నోటిఫికేషన్ను విడుదల చేశారు. 12 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న 15 అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 4 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 89 ఆయాల పోస్టులు భర్తీచేయనున్నారు. ఈ నెల 11 నుండి 23లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వరుసగా రెండో రోజు బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో నిన్నటితో పోల్చితే ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.870 పెరగటంతో రూ.79,470కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 పెరిగి రూ.72,850గా ఉంది. మరోవైపు వెండి ధర దిగొచ్చింది. దీంతో కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.1,03,000 ఉంది.
KRNL: గతంలో జారీ చేసిన 2 నోటిఫికేషన్లలో ఆదోని మెడికల్ కళాశాల, ఆదోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పోస్టుల భర్తీని రద్దు చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ K.చిట్టి నరసమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన పోస్టుల వివరాలు, ప్రస్తుతం భర్తీ చేస్తున్న వివరాలు కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రభుత్వ వెబ్సైట్లలో https://kurnool.ap.gov.in, https://nandyal.ap.gov.in ఉంచమన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 15 పాయింట్లు పెరిగి 81,515 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 17 పాయింట్లు లాభపడి 24,627 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.87గా ఉంది.
వచ్చే ఏడాది ప్రారంభం నుంచే పలు సంస్థల్లో నియామకాలు పెరగనున్నట్లు మానవ వనరుల సేవల సంస్థ నివేదిక వెల్లడించింది. ఉద్యోగుల నియామకంపై కంపెనీలు సానుకూలంగా ఉన్నాయని.. అయితే ఈ కొత్త ఉద్యోగాలు ఐటీ రంగంలోనే ఎక్కువ ఉండనున్నట్లు చెప్పింది. దాదాపు 53% సంస్థలు రిక్రూట్మెంట్ చేపట్టనున్నట్లు తెలిపింది. దేశంలోని 3వేలకు పైగా వ్యాపార సంస్థల సమాచారం సేకరించి ఈ నివేదిక రూపొందించినట్లు పేర్కొంది.
TPT: జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో అర్థ వార్షిక పరీక్షలు సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ మోడల్ పేపర్ (ఎస్ఏటీఎంపీ) టర్మ్-1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
TPT: ఈ నెల 13వ తేదీన ఎడ్సెట్ -2024 స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఎస్వీయూలోని అడ్మిషన్స్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు అడ్మిషన్లు ప్రారంభం కానున్నట్టు రిజిస్ట్రార్ భూపతినాయుడు తెలిపారు. ఆసక్తి కల్గిన వారు, ఎడ్సెట్ ర్యాంకు కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావచ్చని వర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ బాబు కోరారు.