• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

అదరగొట్టిన విశాల్ మార్ట్, మొబిక్విక్

గతవారం ఐపీవోకు వచ్చిన విశాల్ మెగామార్ట్, మొబిక్విక్ కంపెనీల షేర్లు ఇవాళ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. మంచి ప్రీమియంతో లిస్ట్‌ అయిన షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. విశాల్ మెగా మార్ట్ ఇష్యూ ధర రూ.78 కాగా.. రూ.104 వద్ద షేర్లు ప్రారంభమయ్యాయి. 33.33% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. మొబిక్విక్ 58.51శాతం ప్రీమియంతో రూ.442.25 వద్ద స్టాక్స్‌లో నమోదయ్యాయి. కాగా.. మొబిక్విక్ ఇష్యూ ధర రూ.279.

December 18, 2024 / 12:07 PM IST

అగ్ని ప్రమాద బాధితులకు ట్రై కార్ చైర్మన్ సహాయం

W.G: పోలవరం మండలం చేగొండపల్లికి చెందిన ముచ్చిక రాజబాబు, తెల్లం లక్ష్మి, సరయ్య అనే వారికి చెందిన మూడు గృహాలు ఇటీవల విద్యుత్ ఘాతుకానికి గురై పూర్తిగా దగ్ధమవడం జరిగింది. ఈ క్రమంలో బుధవారం బాధిత కుటుంబాలను నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్&రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు పరామర్శించారు. అనంతరం వారికి రూ.5000 రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు.

December 18, 2024 / 11:55 AM IST

రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ ప్రారంభిస్తాం: మంత్రి

NLR: రాష్ట్రంలో నాలుగు మోడల్ స్మార్ట్ స్కూల్స్‌ను ప్రారంభిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నగరంలోని వీఆర్ ఉన్నత పాఠశాలను జేసీ కార్తీక్, కమిషనర్ సూర్యతేజతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోడల్ స్మార్ట్ స్కూల్స్ ప్రారంభించేందుకు మంత్రి లోకేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు.

December 18, 2024 / 11:53 AM IST

స్కిల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి: కలెక్టర్

నెల్లూరు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఎస్సీ, ఎస్టీల శిక్షణ కార్యక్రమాలకు నిధులను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ బుధవారం సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

December 18, 2024 / 11:36 AM IST

నేడు LT, ఫార్మాసిస్ట్‌ల మెరిట్ జాబితా విడుదల

నెల్లూరు వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కింద ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి మెరిట్ జాబితా బుధవారం విడుదల చేస్తున్నట్లు DMHO డాక్టర్ పెంచలయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు ల్యాబ్ టెక్నీషియన్, రెండు ఫార్మాసిస్ట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 19వ తేదీలోపు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో తెలియచేయాలని కోరారు.

December 18, 2024 / 09:07 AM IST

రాష్ట్రంలో డైకిన్‌ రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు

AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెంచేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన కంపెనీ ముందుకు వచ్చింది. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రీజిరేషన్ పరికరాల తయారీ కంపెనీ డైకిన్ ఇండస్ట్రీస్ రూ.1000 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. ఈ కంపెనీ తన కంప్రెసర్ల తయారీ యూనిట్‌ను శ్రీసిటీలో నిర్మించనుంది. 75ఎకరాల్లో నిర్మించే ఈ కర్మాగారం ఆగ్నేయా...

December 18, 2024 / 08:05 AM IST

ఈనెల 19న అప్రెంటిస్ మేళా

SKLM: శ్రీకాకుళంలోని డీఎల్టీసీ-ఐటీఐలో ఈనెల 19న అప్రెంటిస్ మేళా జరగనుందని డీఎల్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై రామ్మోహన్ రావు మంగళవారం తెలిపారు. ఓ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించే ఈ మేళాకు ఐటీఐలో వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లలో ఉత్తీర్ణులైన 25సం.లోపు వయసు కలిగినవారు అర్హులన్నారు.

December 18, 2024 / 08:00 AM IST

నేడు నరసాపురంలో మెగా ఉద్యోగ మేళా

W.G: నరసాపురం పట్టణంలోని వైఎన్సిలో బుధవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. లోక్మాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 95020 24765 నంబర్ ను సంప్రదించాలని అన్నారు.

December 18, 2024 / 07:59 AM IST

రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నందు ఉచిత శిక్షణ

ఒంగోలు రూడ్ సెట్ సంస్థలో జనవరి 8వ తేదీ నుంచి 30 రోజుల పాటు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నందు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకూ చెంది ఉండి 19 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వుండే యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

December 18, 2024 / 07:32 AM IST

‘డిసెంబర్ 23 వరకు అవకాశం’

ఏలూరు జిల్లాలో 2025 మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు ఎన్రోల్ చేసుకున్న విద్యార్థుల వివరాలను సరిచేసుకునేందుకు డిసెంబర్ 19 నుంచి 23 వరకు అవకాశం ఉందని డీఈవో వెంకట లక్ష్మమ్మ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. సదరు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాల లాగిన్ ద్వారా అభ్యర్థుల పేరు, ఆధార్ చిరునామా, తదితర తప్పులను సరిచేయాలని సూచించారు.

December 18, 2024 / 07:32 AM IST

నరసాపురంలో ఈ నెల 21న జాబ్ మేళా

W.G: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, నేషనల్ కెరీర్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో నరసాపురం వైఎన్ కళాశాలలో ఈ నెల 21న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పీ. లోకమాన్ తెలిపారు. ఈ మేళాలో 70 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయసు వారు అర్హులన్నారు.

December 18, 2024 / 07:26 AM IST

కొత్తగూడెంలో నేడు ఉద్యోగ మేళా

BDK: జిల్లా ఉపాధి కల్పనాధికారి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. ముత్తూట్ మైక్రో ఫైనాన్స్‌లో ఖాళీగా ఉన్న 40 ఉద్యోగాలకు కొత్తగూడెం బాబుక్యాంపు మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

December 18, 2024 / 05:20 AM IST

విద్యుత్ ఆదాపై విద్యార్దులకు వక్తృత్వ పోటీలు

VZM: విద్యుత్‌ ఆదాపై విద్యార్థులకు మంగళవారం దాసన్నపేట విద్యుత్‌ భవనంలో చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించారు. జాతీయ ఇందన పోదుపు వారోత్సవాలలో భాగంగా ఈ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ అదికారులు మాట్లాడుతూ విద్యుత్‌ ఆదాపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

December 18, 2024 / 04:48 AM IST

పాలకొండలో నేడు మినీ జాబ్ మేళా

SKLM: పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధి కల్పనలో భాగంగా SSC , INTER, DEGREE పూర్తిచేసిన 18 – 28 ఏళ్లు గల M/F లు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు ఈ నెం 63012 75511 సంప్రదించాలన్నారు.

December 18, 2024 / 04:04 AM IST

వినియోగదారులకు SBI అలర్ట్

SBI టాప్ మేనేజ్‌మెంట్ ఫేక్ వీడియోలపై బ్యాంకు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు Xలో పోస్టు పెట్టింది. ‘బ్యాంక్  మేనేజ్‌మెంట్ వ్యక్తులంటూ వైరల్ అవుతున్న ఫేక్ వీడియోలను నమ్మవద్దు. వీడియోలో చెప్పిన పథకాలతో బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదు. అసాధారణ రాబడి వచ్చే పథకాలను SBI ప్రవేశపెట్టదు. ప్రజలు మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి’ అని పేర్కొంది.  

December 17, 2024 / 07:34 PM IST