ASR: ఉపాధి హామీ పనులు రెండు వందల రోజులు పెంచాలని సీఐటీయు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. చింతపల్లి మండలం తాజంకి పంచాయతీ వంతమామిడి గ్రామంలో ఉపాధి పనులు పరిశీలించారు. అనంతరం ఆనయ మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల పోరాటంతో ఉపాధి హామీ చట్టం వచ్చిందని వేలాది మంది ఉపాధి కూలీలకు వంద రోజులు పని గ్యారంటీ చేస్తూ చట్టబద్ధత కల్పించిందని అన్నారు.
KRNL: జాబ్ మేళాతో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి లభిస్తుందని ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి ఆనంద్ రాజ్ కుమార్ అన్నారు. ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించగా నవభారత్ ఫర్టిలైజర్స్, అమరరాజా గ్రూప్స్ ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేయగా, 23 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నారని తెలిపారు.
W.G: ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తిస్థాయి గ్రాట్యుటీ చెల్లించేలా ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఉద్యోగ సంఘాల వినతి మేరకు గ్రాట్యుటీపై రూ.16 లక్షల సీలింగ్ను ఎత్తివేసింది. ఇప్పటికే తక్కువ మొత్తం పొందిన రిటైర్డ్ ఉద్యోగులకూ వర్తిస్తుందని తెలిపారు. బకాయిల కోసం వారు వెంటనే డిపోల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
GNTR: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (ఆనర్స్) వ్యవసాయం, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో స్పాట్ కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామని వర్సిటీ రిజిస్ట్రార్ జి.రామచంద్రరావు తెలిపారు. ఈనెల 9న ఉదయం 9.30 గంటలకు ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు.
NRML: ముధోల్ గిరిజన బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ITDA ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్త ప్రకటన విడుదల చేశారు. కళాశాలలో భౌతిక శాస్త్రం 01, గణిత శాస్త్రం 01 ఖాళీగా ఉన్నాయని అర్హులైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అభ్యర్థులు ఈనెల 7 నుంచి 9 వరకు ఉట్నూరులోని ఆర్సీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
కృష్ణా: ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 5ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈనెల 20లోపు https://crda.ap.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ లీడ్, ప్రాజెక్టు మేనేజర్ తదితర పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగ అర్హతలు తదితర వివరాలకు అభ్యర్థులు CRDA అధికారిక వెబ్సైట్లో చూడవచ్చని తెలిపారు.
RBI చిన్న, సన్నకారు రైతులకు ఊరట కల్పించింది. రైతులకు తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితిని పెంచింది. ప్రస్తుతం రైతులు ఎలాంటి తాకట్టు చూపించకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉండగా.. తాజాగా దాన్ని రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనిపై త్వరలోనే RBI సర్క్యులర్ జారీ చేయనుంది. ఈ రుణాలపై పరిమితిని చివరిసారిగా 2019లో రూ.లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచారు.
వచ్చే వారం రెండు కంపెనీలు IPOకు రానున్నాయి. సాయి లైఫ్ సైన్సెన్స్, విశాల్ మెగామార్ట్ కంపెనీల సబ్స్క్రిప్షన్ డిసెంబరు 11న ప్రారంభమై.. 13న ముగియనున్నాయి. సాయి లైఫ్ సైన్సెన్స్ ఐపీఓ ధరల శ్రేణిని రూ.522-549గా నిర్ణయించగా.. 16న షేర్ల అలాట్మెంట్, 18న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానుంది. రూ.8వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా వస్తున్న విశాల్ మెగామార్ట్ కంపెనీ ధరల శ్రేణి రూ.7...
నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 7న నిర్వహించే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశానికి ప్రతిఒక్కరినీ ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
KNL: బనగానపల్లెలోని నెహ్రూ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈనెళల 12న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 30 రకాల బహుళ జాతీయ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటుండగా.. 1,000కి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
కృష్ణా జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో మిషన్ వాత్సల్య, సాక్ష్యం, శక్తి పథకాల అమలుకై కాంట్రాక్ట్ పద్ధతిన 14 ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు 42 సంవత్సరాలలోపు వయసున్న అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థులు ఈ నెల 7లోపు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ధరల స్థిరీకరణ కీలకమని RBI గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన ఆయన.. కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రెపో రేటును 6.5% వద్ద కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది. కాగా.. వరుసగా 11వ సారి ఎలాంటి మార్పు చేయకపోవటం గమనార్హం.
దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగినట్లు ఓ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ నివేదికలో వెల్లడించింది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్ మధ్య కాలంలో 25 ద్వితీయ శ్రేణి నగరాల్లో 65% పెరిగినట్లు చెప్పింది. జైపూర్, ఆగ్రా, గుంటూరు, మంగళూరు, చంఢీగఢ్లో భారీగా పెరుగుదల నమోదైందని పేర్కొంది. స్థలం రేటు తక్కువగా ఉండటం, మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు మెరుగుపడటం ఇందుకు కారణమని వ...